Ind Vs Eng: చివరి టెస్టులో ఇంగ్లాండ్ చిత్తు.. బెంబేలెత్తించిన స్పిన్నర్లు!

ఇంగ్లాండ్ తో జరిగిన చివరి టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ను భారత్ 4-1 కైవసం చేసుకుంది. ‘ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్‌’ను కుల్‌దీప్‌ సొంతంచేసుకోగా ‘ప్లేయర్ ఆఫ్‌ ది సిరీస్‌’ అవార్డును యశస్వి జైస్వాల్ దక్కించుకున్నాడు.

New Update
Ind Vs Eng: చివరి టెస్టులో ఇంగ్లాండ్ చిత్తు.. బెంబేలెత్తించిన స్పిన్నర్లు!

Ind Vs Eng : ఇంగ్లాండ్(England) తో జరిగిన చివరి టెస్టులో భారత్(India) ఘన విజయం సాధించింది. ఐదు టెస్టు సిరీస్ లో భాగంగా ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఇన్నింగ్స్ తేడాతో ఇండియా విజయకేతనం ఎగరవేసింది. దీంతో ఈ సీరీస్ ను భారత్ 4-1తో కైవసం చేసుకుంది. ఇక మొదటినుంచి ఏకపక్షంగా సాగిన మ్యాచ్ లో మొదట భారత బ్యాటర్లు సెంచరీలతో భారీ స్కోర్ సాధించగా భారత బౌలర్లు ఇంగ్లాండ్ బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టారు. మొదటి ఇన్నింగ్స్ లో పై చేయి సాధించిన భారత్ ఇన్నింగ్స్ తేడాతో ఇంగ్లాండును చిత్తుగా ఓడించింది.

ఇది కూడా చదవండి: TSRTC: టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్

రెండు అవార్డులు మనకే..
ఈ మేరకు ఇంగ్లాండ్‌ మొదటి ఇన్నింగ్స్ లో 218 పరుగులకే ఆలౌట్ అవగా.. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 477 పరుగులకు అలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లీష్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 195 పరుగులకే కుప్పకూలగా భారత్ ఇన్నింగ్స్‌ 64 పరుగుల తేడాతో గెలిచింది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో జో రూట్ (84) రాణించగా.. జానీ బెయిర్‌స్టో (39) ఫర్వాలేదనిపించాడు. భారత బౌలర్లలో అశ్విన్ 5 వికెట్లు, కుల్‌దీప్‌ 2, బూమ్రా 2, జడేజా 1 వికెట్ తీశారు. ఇక మొదటి ఇన్నింగ్స్ లో భారత్ భారీ స్కోర్ సాధించగా.. రోహిత్ శర్మ (103), శుభ్‌మన్‌ గిల్ (110) శతకాలు బాదారు. యువ బ్యాట్స్ మెన్ పడిక్కల్ (65), యశస్వి జైస్వాల్ (57), సర్ఫరాజ్‌ ఖాన్ (56) హాఫ్ సెంచరీలతో రాణించారు. చివర్లో కుల్‌దీప్‌ (30), బుమ్రా (20) విలువైన భాగస్వామ్యం నెలకొల్పారు. ‘ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్‌’(Player Of The Match) ను కుల్‌దీప్‌ సొంతంచేసుకోగా.. ‘ప్లేయర్ ఆఫ్‌ ది సిరీస్‌’(Player Of The Series) అవార్డును యశస్వి జైస్వాల్ దక్కించుకున్నాడు.

స్కోరు వివరాలు:
భారత్: తొలి ఇన్నింగ్స్‌ 477/10
ఇంగ్లాండ్‌: తొలి ఇన్నింగ్స్‌ 218/10
ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌ 195/10

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

TTDలో నిజంగానే 100 ఆవులు చనిపోయాయా?: చైర్మన్ బీఆర్ నాయుడు కీలక ప్రకటన!

TTD ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గోశాలలో 100 ఆవులు చనిపోయాయన్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని చైర్మన్ BR నాయుడు స్పష్టం చేశారు. భూమన కరుణాకర్ రెడ్డి కల్పిత ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఇతర ప్రాంతాల్లో చనిపోయిన గోవుల ఫోటోలను ఇక్కడివిగా చిత్రీకరిస్తున్నారన్నారు.

New Update
TTD Cows Death

TTD Chairman Reaction Over Cows Death

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని నిర్వహించబడుడున్న ఎస్వీ గోశాలలో దాదాపు 100 గోవులు మృతి చెందాయని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి నిన్న ఆరోపించిన విషయం తెలిసిందే. అత్యంత దయనీయ పరిస్థితుల్లో ఆ ఆవులు చనిపోతున్నాయని.. ఇది మహా అపచారం అని ఆవేదన వ్యక్తం చేశారు. మృతి చెందిన ఆవులకు సంబంధించిన ఫొటోలను సైతం కరుణాకర్ రెడ్డి విడుదల చేశారు. ఈ అంశంపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు స్పందించారు. కరుణాకర్ రెడ్డి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారన్నారు. ఇలాంటి కల్పిత ఆరోపణలు అత్యంత విషాదకరమన్నారు. శ్రీవారి సేవలో నిమగ్నమై, హిందూ ధర్మ పరిరక్షణకు అంకితభావంతో టీటీడీ ట్రస్ట్ బోర్డు చేపడుతున్న పుణ్య కార్యక్రమాల పట్ల కంటకింపుతో ఈ తరహా చర్యలకు దిగడం చాలా బాధాకరమనర్నారు.

గోమాతకు హిందూ ధర్మంలో ఉన్న ప్రాముఖ్యత అనన్య సాధారణమన్నారు. వేదకాలం నుంచే గోమాతను దేవతలతో పూజిస్తూ వస్తున్నామన్నారు. ఏ ఒక్క గోవు యొక్క మృతి కూడా సామాన్యంగా తీసుకోలేమన్నారు. కానీ సహజంగా తప్పని అనారోగ్యం, వృద్ధాప్యం, ప్రమాదాలు వంటి కారణాల వల్ల  గోవుల మృతి జరిగే అంశాన్ని రాజకీయంగ, అబద్ధ ప్రచారానికి వాడుకోవడం అత్యంత అధర్మమని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇతర ప్రాంతాల్లోని ఫొటోలను ఇక్కడివిగా..

ఇంకా దుర్మార్గంగా, ఇతర ప్రాంతాల్లో చనిపోయిన గోవుల ఫోటోలను టీటీడీ గోశాలకు చెందినవిగా  చిత్రీకరించి ప్రజలను మోసగించేందుకు చేస్తున్న కుట్ర బాధాకరమన్నారు. ఇలాంటి వదంతులను ప్రజలు గుర్తించి, అవాస్తవాలపై నమ్మకం కలిగి మోసపోవద్దని కోరారు. గోసేవా అంటేనే గోదేవి సేవ అని అన్నారు. ఈ పవిత్రమైన సేవను రాజకీయ లబ్ధి కోసం మచ్చలేసే ప్రయత్నాలను భక్తులందరూ తిరస్కరించాలన్నారు. శ్రీవారి ఆశీస్సులతో, హిందూ ధర్మ పరిరక్షణలో టీటీడీ చేపడుతున్న గోరక్షణ, గోపోషణ కార్యక్రమాలపై భక్తుల విశ్వాసం మరింత బలపడాలని ఆకాంక్షించారు. 

(br naidu ttd chairman | telugu-news | latest-telugu-news | telugu breaking news)

Advertisment
Advertisment
Advertisment