Chandrayan-4: 2028లో చంద్రయాన్‌ -4 ప్రయోగం చేపట్టనున్న ఇస్రో

ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. 2028లో ఇస్రో చంద్రయాన్‌ -4 ప్రయోగాన్ని చేపట్టనుంది. ఈ మిషన్‌లో చంద్రుని లూనార్‌ సర్ఫెస్‌ నుంచి శాంపిల్స్‌ తీసుకురానుంది. అలాగే 2040 నాటికి భారతీయులను చంద్రునిపైకి పంపనుంది.

New Update
Chandrayan-4: 2028లో చంద్రయాన్‌ -4 ప్రయోగం చేపట్టనున్న ఇస్రో

భారత్‌లో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-3ని విజయవంతం చేసిన (భారత అంతరిక్ష పరిశోధన సంస్థ) ఇస్రో.. ఇప్పుడు మరో ప్రయోగానికి సిద్ధమవుతోంది. 2028లో చంద్రయాన్‌-4 ప్రయోగాన్ని చేపట్టనుంది. దీనికి లూపెక్స్‌ మిషన్‌ అని పేరు కూడా పెట్టినట్లు ఇస్రోకి చెందిన స్పేస్‌ అప్లికేషన్ సెంటర్‌(SAC) అసోసియేట్‌ డైరెక్టర్‌ డా. నీలేష్‌ దేశాయ్‌ తెలిపారు. ఈ ప్రయోగంలో భాగంగా చంద్రుని ఉపరితలం పైనుంచి రాళ్లను తీసుకువస్తామని.. ఈ మిషన్ విజయవంతం అయితే.. చంద్రుని లూనార్ సర్ఫేస్‌ నుంచి శాంపిల్స్‌ తీసుకొచ్చిన నాలుగో దేశంగా చరిత్ర సృష్టిస్తుందని పేర్కొన్నారు. అంతేకాదు ఇప్పటికే ఇస్రో.. 2040కి చంద్రుని పైకి భారతీయులన్ని పంపాలని ప్రణాళికలు చేస్తోందని.. మనుషుల్ని జాబిల్లి పైకి పంపేందుకు మనకు ఇంకా 15 ఏళ్ల సమయం పడుతుందన్నారు.

Also Read: ఆ సమస్యను పరిష్కరించండి.. సత్యనాదెళ్లకు ఎలాన్‌ మస్క్‌ మెసేజ్

చంద్రునిపై మానవులు నివసించేందుకు దారి

2028లో చేపట్టబోయే చంద్రయాన్-4 మిషన్‌ను.. చంద్రుని సౌత్‌ పోల్‌ సమీపంలో ల్యాండ్‌ చేయనున్నారు. ఇక్కడ నుంచి జాబిల్లిపై ఉండే రాళ్ల శాంపిల్స్‌ను సేకరించి వాటిని తిరిగి భూమి పైకి తీసుకొస్తుంది. ఆ శాంపిల్స్‌పై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తారు. చంద్రనిపై భవిష్యత్తులో మానవులు నివసించేందుకు.. నీరు లాంటి వనరులను గుర్తించేందుకు ఇందుకు సంబంధించిన డేటా ఉపయోపడుతుంది. చంద్రయాన్‌-4లో 350 కేజీల రోవర్‌ ఉంటుంది. ఇది చంద్రయాన్-3 రోవర్‌తో పోల్చి చూస్తే చాలా పెద్దది. అలాగే ఇది ఎక్కువ దూరం చంద్రునిపై ప్రయాణిస్తుంది.

చంద్రయాన్‌-3 కి మించి 

మనదేశానికి చెందిన అత్యంత బరువైన GSLV Mk 3 లేదా LVM3 లాంచ్‌ వెహికిల్స్‌లలో చంద్రయాన్‌-4 మిషన్‌ను వినియోగించే అవకాశం ఉంది. చంద్రునిపై శాంపిల్స్‌ని సేకరించి.. మళ్లీ వాటిని భూమి పైకి తీసుకురావాలి కాబట్టి ఇది సాంకేతికంగా సవాలుతో కూడుకున్న పని. ఇందుకోసం రెండు ప్రయోగాలు చేపట్టాల్సి ఉంటుంది. జాబిల్లిపై చంద్రయాన్‌-4 ల్యాండింగ్‌ అనేది.. చంద్రయాన్‌-3 లాగే ఉంటుంది. కాకపోతే చంద్రయాన్‌-4లో సెంట్రల్‌ మాడ్యూల్‌.. ఆర్బిటింగ్‌ మాడ్యూల్‌ నుంచి విడిపోయాక వెనక్కి వచ్చేస్తుంది. ఇప్పటికే ఇస్రో.. చంద్రని ఉపరితలం నుంచి స్పేస్‌క్రాఫ్ట్‌ పైకి లేస్తుందా.. అలాగే ఆర్బిటార్‌ చంద్రుని నుంచి భూమిపైకి వస్తుందా అనే దానిపై ఓ ప్రయోగాన్ని ప్రదర్శించింది. ఇందులో చంద్రునిపై నుంచి మళ్లీ తిరిగి వచ్చేలా చేసేందుకు సాధ్యమయ్యే అవకాశాలు కనిపించాయి.

Also read: 2029 నుంచి జమిలి ఎన్నికలు..! కేంద్రానికి ప్రతిపాదన చేయనున్న లా కమిషన్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Vidadala Rajini : మాజీమంత్రికి బిగ్ షాక్....మరిది అరెస్ట్

మాజీ మంత్రి, వైసీపీ మహిళా నేత విడుదల రజనికి బిగ్ షాక్ తగిలింది. ఆమె మరిది గోపిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.హైదరాబాద్ లో ఆయన్ను అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు విజయవాడకు తరలించారు. క్వారీ యజమానులను బెదిరించి డబ్బులు వసూలు చేశారని గోపీపై కేసు నమోదైంది.

New Update
Vidadala Rajini

Vidadala Rajini

Vidadala Rajini: మాజీ మంత్రి, వైసీపీ మహిళా నేత విడుదల రజనికి బిగ్ షాక్ తగిలింది. ఆమె మరిది గోపిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. హైదరాబాద్ లో ఆయన్ను అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు.. విజయవాడకు తరలిస్తున్నారు. యడ్లపాడు కంకర క్వారీ యజమానులను బెదిరించి డబ్బులు వసూలు చేశారని రజినితోపాటు గోపీపై కేసు నమోదైంది. ఈ క్రమంలోనే అతడ్ని ఏసీబీ అధికారులు హైదరాబాద్ లో అరెస్టు చేశారు.

ఇది కూడా చదవండి: ఈ పండ్లు తింటే క్యాన్సర్‌ పరార్.. ఆ అద్భుతమైన ఆహారాలు ఇవే


గోపిని  ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలిలో ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విడదల గోపినాథ్ ను అరెస్ట్ చేసి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు తరలించారు. గచ్చిబౌలి పోలీసులకు సమాచారం ఇచ్చి ఏపీకి తీసుకెళ్లారు. స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి డబ్బులు తీసుకున్న ఘటనపై కేసు నమోదు చేసిన ఏసీబీ.. తాజాగా అరెస్ట్ చేసింది.

ఇది కూడా చూడండి: PM Modi: సౌదీ పర్యటన మధ్యలోనే ముగించుకుని వెనక్కు వచ్చేసిన ప్రధాని మోదీ
 
కాగా.. మాజీ మంత్రి విడదల రజనిపై ఏసీబీ ఈ ఏడాది మార్చిలో కేసు నమోదు అయింది. 2020లో పల్నాడు జిల్లా యడ్లపాడులోని శ్రీలక్ష్మీబాలాజీ స్టోన్ క్రషర్ యాజమ్యాన్నాని విజిలెన్స్ తనిఖీల పేరుతో బెదిరించారని అభియోగాలు ఉన్నాయి. స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని బెదిరించి రూ.2.20 కోట్లు వసూలు చేశారని ఆమెపై ఫిర్యాదులు చేశారు. ఈ క్రమంలో విడదల రజనీపై కేసు నమోదు చేశారు. ఆమెను ఈ కేసులో ఏ1గా చేర్చారు ఏసీబీ అధికారులు. ఏ2గా ఐపీఎస్ అధికారి జాషువా పై కేసు నమోదు చేశారు. ఏ3గా గోపి, ఏ4గా రజనీ పీఏ దొడ్డ రామకృష్ణలను నిందితులుగా చేర్చింది. విడదల రజని వాటా 2 కోట్లు ఇచ్చినట్టు కేసు నమోదు చేయగా.. ఆమె మరిది గోపి, జాషువాలకు చెరో 10 లక్షలు ఇచ్చినట్లు కేసు నమోదు చేశారు.

ఇది కూడా చూడండి: Pahalgam: పహల్గామ్ లో నంబర్ ప్లేట్ లేని బైక్..ఉగ్రవాదులదేమోనని అనుమానం

Advertisment
Advertisment
Advertisment