Asia Cup 2023: భారత్‌ గ్రాండ్‌ విక్టరీ

ఆసియా కప్‌ 2023 టోర్నీలో భారత్‌ ఘన విజయం సాధించింది. వరల్డ్‌ కప్‌కు ముందు జరిగిన ఈ మినీ టోర్నీలోని ఫైనల్‌లో టీమిండియా 10 వికెట్ల తోడాతో ఘన విజయం సాధించింది.

New Update
Asia Cup 2023: భారత్‌ గ్రాండ్‌ విక్టరీ

ఆసియా కప్‌ 2023 టోర్నీలో భారత్‌ ఘన విజయం సాధించింది. వరల్డ్‌ కప్‌కు ముందు జరిగిన ఈ మినీ టోర్నీలోని ఫైనల్‌లో టీమిండియా 10 వికెట్ల తోడాతో ఘన విజయం సాధించింది. మొదట టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న శ్రీలంక భారత్ బౌలర్ల ధాటికి నిలవలేకపోయింది. బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌ చెలరేగారు. మొదట బుమ్రా ఫస్ట్‌ వికెట్‌ తీయగా.. అనంతరం మహ్మద్‌ సిరాజ్‌ ఓకే ఓవర్లో ఏకంగా నాలుగు వికెట్లు తీసి శ్రీలంకను కోలుకోలేని దెబ్బతీశాడు. ఓదశలో మెండీస్‌ ఆదుకుంటాడని చూసినా హార్డిక్ పాండ్యా బౌలింగ్‌లో అతను కూడా వెనుదిరిగాడు. అనంతరం లంక తన చివరి మూడు వికెట్లను సైతం తర్వత్వరగా కోల్సోయింది. దీంతో లంక 15.2 ఓవర్లలో 50 పరుగులకే కుప్ప కూలింది.

అనంతరం 51 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన భారత ఓపెనర్లు శుభ్‌మన్‌ గిల్‌, ఇషాన్‌ కిషన్‌ లంక బౌలర్లపై విరుచుకుపడ్డారు. ప్రతీబంతిని బౌండరీకి తరలించాలనే కసితో ఆడారు. 6.1 ఓవర్లో భారత్‌ 51 పరుగులు చేసి లక్ష్యన్ని చేధించింది. మరోవైపు ఆసియా కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ ఉత్కంఠ భరితంగ సాగుతుందని అభిమానులు భావించగా.. ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో టీమిండియా ఈజీగా విక్టరీ కొట్టడంతో అభిమానులు మజాను మిస్సయ్యామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా 250వ వన్డే మ్యాచ్‌ ఆడిన రోహిత్‌ శర్మ ఈ మ్యాచ్‌ విజయంతో తన 250వ వన్డే మ్యాచ్‌ను విజయంతో ముగించాడు.

కాగా ఈ మ్యాచ్‌లో హీరో ఎవరంటే హైదరాబాదీ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ అనే చెప్పాలి. బుమ్రాను చూసి బయటపడ్డ లంక బౌలర్లను సిరాజ్‌ కళ్లెం వేస్తాడని ఏవరూ అనుకోలేదు. మూడో ఓవర్‌లో బుమ్రా ఓపెనర్‌ వికెట్‌ తీయగా అనంతరం బాల్‌ అందుకున్న సిరాజ్‌.. తాను వేసిన 4వ ఓవర్‌లో ఏకంగా నాలుగు వికెట్లను పడగొట్టగాడు. ఇందులో నాలుగో ఓవర్‌లోని 3, 4 బంతుల్లో వరుస వికెట్లు తీయడం గమనార్హం. దీంతో లంక నాలుగో ఓవర్‌లోనే కీలక బ్యాటర్లును కోల్పొయింది. అంతే కాకుండా సిరాజ్‌ ఈ మ్యాచ్‌లో తన అత్యుత్తమ గణాంకాలు 6/21 నెలకొల్పాడు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Allu Arjun- Atlee: మహేష్ హీరోయిన్ పై కన్నేసిన బన్నీ..!

అల్లు అర్జున్, అట్లీ కాంబోలో రాబోతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై భారీ హైప్ నెలకొంది. బన్నీ డ్యూయల్ రోల్, ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా ఉండనున్నారని టాక్‌ ప్రచారంలో ఉంది. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది చివర్లో ప్రారంభం కానుంది.

New Update
Allu Arjun – Atlee

Allu Arjun – Atlee Movie

Allu Arjun- Atlee : ఇటీవల టాలీవుడ్ లో హైప్ క్రియేట్ చేసిన ఓ భారీ ప్రాజెక్ట్ ఏమిటంటే.. అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కలయికలో రూపొందనున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్. ఈ సినిమాను ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ వచ్చిన నాటి నుంచి ఎన్నో ఆసక్తికర రూమర్స్ ఫిల్మ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతున్నాయి.

Also Read: కొరియోగ్రాఫర్ శ్రష్ఠి వర్మ బ్రాండ్ న్యూ కార్ అదుర్స్..!

డ్యూయల్ రోల్‌లో అల్లు అర్జున్

ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ సినిమాపై, కొన్ని వార్తలు పెద్ద ఎత్తున ప్రచారంలోకి వచ్చాయి. ఇందులో అల్లు అర్జున్ డ్యూయల్ రోల్‌లో కనిపించనున్నారన్న టాక్ హీట్ పెంచింది. అంతేకాదు, ఈ చిత్రానికి గ్లోబల్ స్టాండర్డ్స్‌ను లక్ష్యంగా పెట్టుకోవడం వల్ల, హీరోయిన్ పాత్రకు బాలీవుడ్ టాప్ స్టార్ ప్రియాంక చోప్రా పేరు తెరపైకి వచ్చింది. హాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమెను ఎంపిక చేయబోతున్నారని టాక్ వినిపిస్తోంది.

Also Read: 'మంగపతి' గెటప్‌లో శివాజీ స్పెషల్ వీడియో వైరల్

ఇప్పటికే ప్రియాంక చోప్రా, మహేశ్ బాబు- రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ఇంటర్నేషనల్ అడ్వెంచర్ ప్రాజెక్ట్‌లో భాగమవుతున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ సరసన కూడా ఆమె కనిపిస్తే, అది మరో క్రేజీ కాంబోగా మారనుంది. అయితే దీనిపై మాత్రం ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Also Read: ఫ్యాన్స్ కు మెగా ట్రీట్.. 'విశ్వంభర' ఫస్ట్ సింగిల్ వచ్చేస్తోంది.

ఈ గ్రాండ్ మూవీని సన్ పిక్చర్స్ నిర్మిస్తున్నాయి. బడ్జెట్ పరంగా, విజువల్ ట్రీట్ పరంగా ఈ సినిమాను ఇంటర్నేషనల్ స్టాండర్డ్‌లో తెరకెక్కించేందుకు టీమ్ ప్లాన్ చేస్తోంది. షూటింగ్ ఈ ఏడాది చివర్లో ప్రారంభం కానుందని సమాచారం.

Also Read: 'ప్రభాస్'ని పక్కన పెట్టి అలియా భట్ తో నాగ్ అశ్విన్ మూవీ..!

మొత్తానికి అల్లు అర్జున్ - అట్లీ కాంబోలో రాబోతున్న ఈ సినిమా ఇప్పటికే ఇండస్ట్రీలో భారీ హైప్‌ను సృష్టించగా, కథ, తారాగణం, టెక్నికల్ టీమ్ డీటెయిల్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Advertisment
Advertisment
Advertisment