T20 world Cup: ఇంగ్లాండ్‌ను చిత్తుగా ఓడించిన ఇండియా..ఫైనల్స్‌లోకి ఎంట్రీ

టీ20 వరల్డ్‌కప్‌లో భారత జట్టు ఫైనల్స్‌కి దూసకెళ్ళిపోయింది. సెమీఫైనల్స్‌లో ఇంగ్లాడ్‌ను చిత్తుగా ఓడించింది టీమ్ ఇండియా. 68 పరుగుల తేడాతో విక్టరీ కొట్టింది.

New Update
T20 world Cup: ఇంగ్లాండ్‌ను చిత్తుగా ఓడించిన ఇండియా..ఫైనల్స్‌లోకి ఎంట్రీ

టాస్ ఓడిపోయి బ్యాటింగ్‌కు దిగిన టీమ్ ఇండియా మొదట్లో కాస్త తడబడినా మూడో వికెట్‌కు మంచి భాగస్వామ్యం నెలకొల్పడంతో భారత జట్టు 171 పరుగులు ఇంగ్లాండ‌కు లక్ష్యంగా ఇచ్చింది. తరువాత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ బ్యాటర్లు ఏ స్థాయిలోనూ బాగా ఆడలేకపోయారు. దీంతో ఇండియా 68 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి...ఫైనల్స్‌లోకి ఎంటర్ అయిపోయారు.

టీ 20 వరల్డ్‌కప్‌లో ఓటమన్నదే లేకుండా జూతరయాత్ర చేస్తోంది టీమ్ ఇండియా. మొదట నుంచి అద్భుతంగా ఆడుతూ ఇప్పుడు ఫైనల్స్‌లోకి దూసుకెళ్ళింది. సెమీ ఫైనల్స్‌లో టఫ్ అవుతుంది అనుకున్న ఇంగ్లాండ్‌తో మ్యాచ్లో కూడా సునాయాసంగా నెగ్గేసింది. బ్యాటర్లు, బౌలర్లు సమానంగా రాణించడంతో గ్రాండ్ విక్టరీని సొంతం చేసుకుంది.

మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టులో కెప్టెప్ రోహిత్ శర్మ భాద్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 39బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 57 పరుగులు చేయగా..సూర్యకుమార్ యాదవ 36 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 47 పరుగులు చేసి చెలరేగాడు. తర్వాత వచ్చిన హార్ధిక్ పాండ్యా కూడా మెరుపులు మెరిపించాడు. ఇంగ్లిష్‌ బౌలర్లలో క్రిస్‌ జోర్డాన్‌ 3 వికెట్లు తీశాడు. టోప్లే, జోఫ్రా ఆర్చర్‌, సామ్‌ కరన్‌, ఆదిల్‌ రషీద్‌ ఒక్కో వికెట్‌ పడగొట్టారు. తర్వాత లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్‌ 16.4 ఓవర్లలో 103 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లు అక్షర్‌ పటేల్‌ 3, కుల్‌దీప్‌ యాదవ్‌ 3, బుమ్రా 2 వికెట్లు తీయడంతో ఇగ్లాండ్ బ్యాటర్లు చకచకా ఫెవిలియన్ బాట బట్టారు. దీంతో ఇండియాకు విజయం నల్లేరు మీద నడక అయిపోయింది.

Also Read:Andhra Pradesh: పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి 14 రోజుల రిమాండ్ – నెల్లూరు సబ్ జైలుకు తరలింపు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

USA: 90 రోజులు టారీఫ్ లకు బ్రేక్..అంతా ఒట్టిదే..వైట్ హౌస్

ట్రంప్ టారీఫ్ ల దెబ్బకు ప్రపంచ మార్కెట్లు అతలాకుతలం అవుతున్నాయి. దీంతో అమెరికా అధ్యక్షుడు సుంకాలను ఆపేస్తారనే వార్తలు వచ్చాయి. అయితే వాటిని వైట్ హౌస్ కొట్టిపడేసింది. టారీఫ్ లను ఆపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. 

New Update
us

White House

 ప్రతీకార సుంకాలను ఆపేది లేదని తేల్చి చెప్పారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్, వైట్ హౌస్. ఏది ఏమైనా టారీఫ్ లను కొనసాగిస్తామని చెప్పారు. మా విధానంలో ఎటువంటి మార్పూ ఉండదు అన్నారు. అయితే ఏ దేశమైనా టారీఫ్ ల మీద చర్చకు వస్తే తాము సుముఖంగా ఉన్నామని ట్రంప్ స్పష్టం చేశారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త సుంకాలను 90 రోజుల పాటు నిలిపివేయాలని ఆలోచిస్తున్నారనే వార్తలను వైట్ హౌస్ ఖండించింది. దానిపై వస్తున్న వార్తలన్నీ నకిలీవి అని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ అన్నారు. 

 

ఒక్క పోస్ట్ తో అంతా తారుమారు..

నిన్న ఎక్స్ లో వాల్టర్ బ్లూమ్ బెర్గ్, నేషనల్ ఎకనామిక్ కౌన్సిల్ డైరెక్టర్ కెవిన్ హాసెట్,  అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనా మినహా అన్ని దేశాలకు 90 రోజుల సస్పెన్షన్ గురించి ఆలోచిస్తున్నారని పోస్ట్ లు వచ్చాయి. దీంతో మార్కెట్లో గందరగోళం మొదలైంది.  ఈ ఒక్క పోస్ట్ తో స్టాక్ మార్కెట్ హెచ్ థగ్గులకు గురైంది. దీని గురించే ఈరోజు వైట్ హౌస్  మాట్లాడింది. హాసెట్ చెప్పినదాన్ని జనాలు తప్పుగా అర్ధం చేసుకున్నారని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ అన్నారు. ట్రంప్ కు అలాంటి ఆలోచన లేదని స్పష్టం చేశారు. అయితే అసలు ఈ చర్చ అంతా బిలియనీర్ హెడ్జ్ ఫండ్ పెట్టుబడిదారుడు, ట్రంప్ మద్దతుదారుడు అయిన బిల్ అక్మాన్ ఆదివారం ట్రంప్ అసమాన సుంకాల ఏర్పాట్లను పరిష్కరించడానికి, దేశానికి గణనీయమైన పెట్టుబడులను ఆకర్షించడానికి "90 రోజుల గడువు" అమలు చేయాలని సూచించిన తర్వాత చర్చ ప్రారంభమైంది.

 today-latest-news-in-telugu | usa | donald trump tariffs | white-house

Also Read: RCB VS MI: ముంబయ్ గెలుస్తుంది అనుకుంటే...బెంగళూరు తన్నుకుపోయింది

Advertisment
Advertisment
Advertisment