Ind vs Aus: భారత్ తొలి వికెట్ డౌన్ ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో లక్ష్య ఛేదనకు దిగిన భారత్ అప్పుడే మొదటి వికెట్ కోల్పోయింది. భారత ఇన్నింగ్స్ 10.5 ఓవర్లు ఓపెనర్గా వచ్చిన వాషింగ్టన్ సుందర్(18) లబుషేన్కు క్యాచ్ ఇచ్చి వెనుదికిగాడు. By Karthik 27 Sep 2023 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో లక్ష్య ఛేదనకు దిగిన భారత్ అప్పుడే మొదటి వికెట్ కోల్పోయింది. భారత ఇన్నింగ్స్ 10.5 ఓవర్లు ఓపెనర్గా వచ్చిన వాషింగ్టన్ సుందర్(18) లబుషేన్కు క్యాచ్ ఇచ్చి వెనుదికిగాడు. కాగా ప్రస్తుతం క్రీజులోకి విరాట్ కోహ్లీ వచ్చాడు, ప్రస్తుతం భారత్ స్కోర్ 13 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 84 పరుగులు చేసింది. రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. కాగా అంతకుముందు రాజ్కోట్ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో ఆస్ట్రేలియా బ్యాటర్లు అదరగొట్టారు. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన కంగారు జట్టు తొలి బంతి నుంచే దూకుడుగా ఆడటం ప్రారంభించారు. ఓపెనర్ డేవిడ్ వార్నర్ 34 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 56 పరుగులు చేసి ఔటయ్యాడు. అనంతరం మిచెల్ మార్ష్ 84 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్సర్లతో 96 పరుగులు చేయగా.. స్టీవ్ స్మిత్ 74 పరుగులతో రాణించాడు. ఇక మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ లబుషేన్ ఓ వైపు వికెట్లు పడుతున్నప్పటికీ 72 పరుగులతో చివర్లో దుమ్మురేపాడు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 352 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారత బౌలర్లలో బుమ్రా మూడు వికెట్ల తీయగా.. కుల్దీప్ యాదవ్ రెండు, ప్రసిద్ద్ కృష్ణ, మహ్మద్ సిరాజ్లు చెరో వికెట్ తీశారు. #virat-kohli #odi #australia #fifty #out-rohit-sharma #last #india #washington-sundar సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి