Heat: రాబోయే 5 రోజుల్లో మరింత పెరగనున్న ఉష్ణోగ్రతలు!

ఏపీలో గత రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. నెల్లూరు, కావలి, తుని, అనంతపురం, మచిలీపట్నం, ఒంగోలు, నంద్యాల, అన్నమయ్య జిల్లా ఆరోగ్యవరంతో పాటు కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతల కంటే 3 నుంచి 4 డిగ్రీలు అధికంగా నమోదు అయ్యాయి.

New Update
Weather: దేశంలో కొన్ని రాష్ట్రాల్లో హీట్ వేవ్..ఐఎండీ హెచ్చరిక

High Temperature in Andhra Pradesh: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు (Summer)  రోజురోజుకి పెరిగిపోతున్నాయి. మార్చి రెండవ వారం నుంచే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఏపీలో గత రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. నెల్లూరు, కావలి, తుని, అనంతపురం, మచిలీపట్నం, ఒంగోలు, నంద్యాల, అన్నమయ్య జిల్లా ఆరోగ్యవరంతో పాటు కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతల కంటే 3 నుంచి 4 డిగ్రీలు అధికంగా నమోదు అయ్యాయి.


ఏపీలో అత్యథికంగా నంద్యాల జిల్లాలోని పాణ్యంలో 43. 7 డిగ్రీలు నమోదు అయ్యాయి. గ్రామీణ మండలాల్లో 43.3 డిగ్రీలు, తిరుపతి గూడూరులో 42. 3 డిగ్రీలు నమోదు అయ్యాయి. వచ్చే రెండు రోజుల్లో కోస్తాంధ్ర, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదు అయినట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

సోమవారం నుంచి పలు జిల్లాల్లో తీవ్రంగా వడగాలులు వీస్తున్నాయి. మంగళ, బుధవారాల్లో కూడా వడగాలులు తీవ్రంగా వీచే అవకాశాలున్నట్లు వాతావరణశాఖాధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వడగాల్పుల ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంత ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. నీళ్లు ఎక్కువగా తాగాలని, పుచ్చకాయ, దోసకాయ వంటివి ఎక్కువగా తీసుకోవాలని వైద్యులు తెలిపారు.

కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, మజ్జిగ, బార్లీ నీళ్లు ఎక్కువగా తీసుకోవాలని వైద్యులు సూచించారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని తెలిపారు. వడగాల్పుల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.

Also read: ఏప్రిల్‌-జూన్‌ లో మరింత వేడి…ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండండి: ఐఎండీ!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Aghori: చంచల్‌గూడ జైలుకు అఘోరీ..  ప్రత్యేక బ్యారక్ ఏర్పాటు చేసి!

చీటింగ్ కేసులో అరెస్టైన లేడీ అఘోరీని పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం ప్రత్యేక బ్యారక్ సిద్దం చేసి లోపలికి తీసుకెళ్లారు. మరోవైపు శ్రీ వర్షిణికి తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లేలా శంకర్‌పల్లి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు.

New Update
aghori ccg

Aghori going to Chanchalguda jail

Aghori: చీటింగ్ కేసులో అరెస్టైన లేడీ అఘోరిని ఎట్టకేలకు పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం చంచల్‌గూడ జైలుకు తరలించి..  ప్రత్యేక బ్యారక్ సిద్దం చేశారు జైలు అధికారులు. ఇతర ఖైదీలను కలవకుండా ఏర్పాట్లు చేశారు. మరోవైపు శ్రీ వర్షిణిని అదుపులోకి తీసుకున్నారు శంకర్‌పల్లి పోలీసులు. ఆమె తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లేలా కౌన్సెలింగ్ ఇచ్చారు.  

ఉత్తరప్రదేశ్ సరిహద్దులో అదుపులోకి..

ఇదిలా ఉంటే.. లేడీ అఘోరీ అలియాస్ అల్లూరి శ్రీనివాస్ పోలీసులకు చిక్కాడు. వర్షిణీని పెళ్లి చేసుకుని కనిపించకుండా పోయిన అఘోరీని పోలీసులు మంగళవారం సాయంత్రం మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దులో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నార్సింగి పోలీస్ స్టేషన్ కి తరలించారు. అక్కడ నుంచి చేవెళ్ల కోర్టుకు తీసుకెళ్లారు. విచారణలో భాగంగా లేడీ అఘోరీకి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆమెను సంగారెడ్డి సబ్ జైలుకు తరలించారు.  అదే సమయంలో శ్రీనివాస్ నుంచి వర్షిణీని వేరు చేసిన పోలీసులు భరోసా సెంటర్‌కు పంపించారు. 

ఇది కూడా చూడండి: Pahalgam: పహల్గామ్ లో నంబర్ ప్లేట్ లేని బైక్..ఉగ్రవాదులదేమోనని అనుమానం

లేడీ అఘోరికి సంగారెడ్డి జైలు అధికారులు బిగ్ షాక్ ఇచ్చారు. ఆడా, మగా తేలకుండా ఏ బ్యారక్‌లో ఉంచలేమని సంగారెడ్డి సెంట్రల్ జైలు తేల్చి చెప్పారు. దీంతో లింగ నిర్ధారణ పరీక్షలు చేయించాలంటూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఈ పరీక్షల తర్వాత అఘోరీని చంచల్ గూడ జైలుకు తరలించారు.

ఇది కూడా చూడండి: PM Modi: సౌదీ పర్యటన మధ్యలోనే ముగించుకుని వెనక్కు వచ్చేసిన ప్రధాని మోదీ

Aghori for Varshini | jail | telugu-news | today telugu news

Advertisment
Advertisment
Advertisment