Cricket: ఆ క్రికెటర్‌ కూతురుపై అసభ్యకర పోస్టులు.. ఇచ్చిపడేసిన స్టార్‌ ప్లేయర్ భార్య!

వరల్డ్‌కప్‌ ఫైనల్‌లో ఇండియాపై ఆస్ట్రేలియా బ్యాటర్‌ హెడ్‌ చెలరేగిన విషయంతెలిసిందే. దీంతో హెడ్‌ భార్య, ఏడాది వయసున్న కూతురుపై కొందరు అసభ్యకర కామెంట్స్ చేశారు. అటు మ్యాక్స్‌వెల్ భార్యను సైతం ట్రోల్ చేశారు. దీంతో ఇన్‌స్టా వేదికగా మ్యాక్సీ భార్య వినీ ట్రోలర్స్‌పై రివర్స్‌ అటాక్‌కు దిగారు.

New Update
Cricket: ఆ క్రికెటర్‌ కూతురుపై అసభ్యకర పోస్టులు.. ఇచ్చిపడేసిన స్టార్‌ ప్లేయర్ భార్య!

ICC WORLD CUP 2023: ఓడిపోతే ఎబ్యూజ్ చేస్తారా? సోషల్‌మీడియాలో నీతిమాలిన మంద పెరిగిపోతోంది. క్రికెటర్లు చాలా హూందాగా ఉంటారు కానీ.. కొంతమంది అభిమానులు మాత్రం దానికి రివర్స్‌లో ఉంటారు. పేరుకే క్రికెట్‌ ఫ్యాన్స్‌ అని చెప్పుకుంటారు కానీ ప్రవర్తించే తీరుమాత్రం ఉగ్రవాదులను పోలి ఉంటుంది. గతంలో కోహ్లీ సరిగ్గా ఆడలేదని ఓ వ్యక్తి విరాట్‌ కూతురుపై ఘోరమైన కామెంట్స్ చేశాడు. ఇలా పైశాచిక పోస్టులు పెట్టేవారి సంఖ్య పెరుగుతోందే కానీ తగ్గడంలేదు. వేరే ఎవరో పనిగట్టుకోని క్రియేట్ చేసి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారనుకుంటే పొరపాటే. క్రికెటర్ల భార్యలను, పిల్లలను రేప్ చేస్తామంటూ కామెంట్స్ చేసిన వారు తర్వాత అరెస్ట్ కూడా అవుతున్నారు. అయినా బుద్ధి రావడం లేదు. వరల్డ్‌కప్‌ ఫైనల్‌లో ఆస్ట్రేలియాపై ఇండియా ఓడిపోయిన విషయం తెలిసిందే. దీంతో సైకో ఫ్యాన్స్‌ కొందరు ఆస్ట్రేలియన్ల క్రికెటర్ల ఫ్యామిలీని టార్గెట్ చేశారు.


రేప్ చేస్తాం:
వరల్డ్‌కప్‌ ఫైనల్‌లో హెడ్‌ సెంచరీతో చెలరేగిన విషయం తెలిసిందే. దీంతో ఇండియా ఓటమికి హెడ్‌ కారణమంటూ కొందరు సోషల్‌మీడియాలో ఓవర్‌ చేశారు. మరికొంతమంది లిమిట్‌ క్రాస్‌ చేశారు. ట్రావిస్ హెడ్ భార్య, కుమార్తెపై అడ్డగోల పోస్టులు పెట్టారు. హెడ్ భార్య, కుమార్తెకు చెందిన ఇన్‌స్టాగ్రామ్ ఫొటోలపై దాడి చేశారు. రేప్ బెదిరింపులకు గురి చేశారు. హెడ్‌ కుమార్తే వయసు కేవలం ఒక్క సంవత్సరం మాత్రమే.

View this post on Instagram

A post shared by Vini Maxwell (@vini.raman)


ఇండియానే సపోర్ట్ చేయాలంట:
మరోవైపు మ్యాక్స్‌వెల్‌ వైఫ్‌ భారత్‌ సంతతికి చెందిన మహిళ అని తెలిసిందే. మ్యాక్సీ భార్య పేరు వినీ రామన్. చిన్నతనం నుంచి ఆమె ఆస్ట్రేలియాలోనే పెరిగారు. అక్కడే మ్యాక్స్‌వెల్‌ను పెళ్లి చేసుకున్నారు. ఇక ఇండియా వర్సెస్‌ ఆస్ట్రేలియా మ్యాచ్‌కు ఆమె కంగారులకు మద్దతు పలికారు. దీంతో ఆమెపై కొంతమంది అతిగాళ్లు విరుచుకుపడ్డారు. భర్త కోసం సొంతదేశాన్ని సపోర్ట్ చేయకుండా వదిలేస్తావా అంటూ అడ్డదిడ్డంగా మాట్లాడారు. వీరందరికి ఇచ్చిపడేసింది వినీ. తన భర్త టీమ్‌కు మద్దతు ఇచ్చినందుకు తాను ఎదుర్కొన్న క్రూరమైన ట్రోలింగ్‌ను బయటపెట్టింది. అదే సమయంలో తాను చేసింది అసలు తప్పు ఎలా అవుతుందో తెలియదంటూ ట్రోలర్స్‌కు చురకలంటించింది. ఇక ప్రత్యర్థి ఆటగాళ్ల కుటుంబాలను అభిమానులు అన్యాయంగా టార్గెట్ చేయడం ఇదే మొదటిసారి కాదు. జాగ్రత్తగా పర్యవేక్షించాలని, కఠినమైన చట్టాలను అమలు చేయాలని ట్రూ స్పోర్ట్స్‌ లవర్స్‌ డిమాండ్ చేస్తున్నారు.

Also Read: అతి జాగ్రత్తే కొంపముంచింది.. ఇండియా చేసిన ఐదు తప్పిదాలివే!

WATCH:

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

India: పాకిస్తానీయులకు ముగిసిన డెడ్ లైన్..537 మంది వెనక్కు..

టెంపరరీ వీసాలతో భారత్ కు వచ్చిన పాక్ పౌరులకు భారత ప్రభుత్వం ఇచ్చిన గడువు ఈ రోజు తో ముగిసింది. దీంతో ఇప్పటి వరకు 537 మంది అట్టారీ-వాఘా సరిహద్దు మార్గంలో పాకిస్థాన్‌కు వెళ్ళారని తెలుస్తోంది. వీరిలో తొమ్మది మంది దౌత్య వేత్తలు, అధికారులు ఉన్నారు.

New Update
pak

Pakistan People

పాకిస్తానీయులు ఇండియాలో ఉండటంపై భారత ప్రభుత్వం సీరియస్ గా ఉంది. పహల్గామ్ లో దాడి జరిగిన తర్వాత పాక్ పౌరులు తమ దేశం నుంచి వెళ్ళిపోవాలని ఆదేశాలను జారీ చేసింది. ఏప్రిల్ 24న ఈ ఉత్తర్వులను ఇచ్చింది. దీంతో పాకిస్తానీయులు దేశం విడిచి వెళ్ళడం ప్రారంభించారు. ఇప్పటివరకు నాలుగు రోజుల్లో 537 మంది అట్టారీ-వాఘా సరిహద్దు మార్గంలో పాకిస్థాన్‌కు  వెళ్లిపోయినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఒక్క ఆదివారం రోజునే 287 మంది వెళ్ళారని సమాచారం . ఇందులో తొమ్మిది మంది దౌత్యవేత్తలు, అధికారులు ఉన్నట్లు చెప్పారు. కొంతమంది ఫ్లైట్స్ ద్వారా వెళ్ళారని..అయితే నేరుగా పాక్ కు విమాన సర్వీసులు లేవు కాబట్టి..ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ నుంచి వెళ్ళిపోయి ఉండవచ్చని చెప్పారు. ఇదే సరిహద్దు ద్వారా 850 మంది భారతీయులు పాకిస్థాన్‌ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చినట్లు చెప్పారు.

మూడు లక్ష జరిమానా..

పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్‌లో ఉంటున్న పాకిస్థానీయులను నిర్ణీత గడువులోగా వెళ్లిపోవాలని కేంద్రం ఆదేశించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘించి ఎవరైనా గడువు దాటినా కూడా ఇంకా భారత్‌లోనే ఉంటే చట్టం ప్రకారం వాళ్లని అరెస్టు చేయవచ్చు. దీనిపై దర్యాప్తు చేపట్టి.. మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా రూ.3 లక్షల జరిమానా, లేదా రెండు విధించే ఛాన్స్ కూడా ఉంటుంది.  సార్క్‌ వీసాల కింద ఇండియాలో ఉంటున్న పాకిస్థానీయులు ఏప్రిల్ 26లోగా దేశం విడిచి వెళ్లిపోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే మెడికల్ వీసాల కింద వచ్చినవాళ్లకు మాత్రం ఏప్రిల్ 29 వరకు గడువు ఇచ్చింది. స్టూడెంట్, బిజినెస్, విజిటర్ తదితర 12 విభాగాల్లో వీసాలు ఉన్నవాళ్లు మాత్రం ఏప్రిల్ 27 నాటికి వెళ్లిపోవాలని ఆదేశించింది. ఏప్రిల్ 4 నుంచి ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్‌ యాక్ట్‌-2025 అమల్లోకి వచ్చింది. 

 today-latest-news-in-telugu | india | pakistan 


Also Read: Sitakka: నీ బిడ్డ కార్లలో తిరిగితే.. మా ఆడబిడ్డలు బస్సులో కూడా తిరగొద్దా?: కేసీఆర్ కు సీతక్క స్ట్రాంగ్ కౌంటర్!

Advertisment
Advertisment
Advertisment