AUS vs BAN: బాబోయ్ ఆస్ట్రేలియా.. లాస్ట్‌ మ్యాచ్‌లోనూ ఉతికి ఆరేసిందిగా!

వరల్డ్‌కప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌పై ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. ఇప్పటికే సెమీస్‌ బెర్త్‌ను కన్ఫామ్‌ చేసుకున్న ఆసీస్‌ బంగ్లాదేశ్‌పై 8 వికెట్ల తేడాతో గెలిచింది. ఆసీస్‌ బ్యాటర్‌ మిచెల్ మార్ష్‌ 132బంతుల్లోనే 177 రన్స్ చేశాడు.

New Update
AUS vs BAN: బాబోయ్ ఆస్ట్రేలియా.. లాస్ట్‌ మ్యాచ్‌లోనూ ఉతికి ఆరేసిందిగా!

'ఆస్ట్రేలియా ఫైనల్‌కు వస్తే అంతే సంగతి... ఆరోసారి ఆరేస్తారు.. రెండో సెమీఫైనల్‌లో దక్షిణాఫ్రికానే గెలవాలి..' ఇది సగటు టీమిండియా అభిమాని ఆందోళన. పోరాటాలకు, నెవర్‌గిప్‌కు మరోపేరుగా నిలిచే ఆస్ట్రేలియా ఈ వరల్డ్‌కప్‌లో అదరగొడుతోంది. తన చివరి గ్రూప్‌ మ్యాచ్‌లోనూ గెలిచింది. బంగ్లాదేశ్‌పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.


అందరూ ఆకట్టుకున్నారు:
పూణే వేదికగా ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో ముందుగా బంగ్లా టైగర్స్‌ బ్యాటింగ్‌కు దిగారు. ఓపెనర్లు టన్జిద్‌ హసన్‌, లిట్టన్‌ దాస్‌ మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఇద్దరు తలో 36 పరుగులు చేశారు. 11.2 ఓవర్లలో 76 పరుగుల వద్ద బంగ్లాదేశ్‌ తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత 16.4 ఓవర్లలో 106 రన్స్ వద్ద బంగ్లాదేశ్‌ రెండో వికెట్ కోల్పోయింది. ఓపెనర్లిద్దరూ ఔటైన తర్వాత కెప్టెన్ షంటోతో టౌహిద్‌ జత కలిశాడు. ఇద్దరు వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదారు. హాఫ్‌ సెంచరీ వైపు అడుగులు వేస్తున్న షంటో రన్‌అవుట్ అయ్యాడు. ఆ తర్వాత మహ్మదుల్లా 28 బంతుల్లో 32 రన్స్ చేసి రన్ అవుట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత రహీమ్‌ సైతం 21 రన్స్‌కే అవుట్ అయ్యాడు. మరో ఎండ్‌లో టౌహిద్‌ అద్భుతంగా ఆడాడు. 79 బంతుల్లో 74 రన్స్ చేసిన టౌహిద్‌ను స్టోయినిస్‌ అవుట్ చేశాడు. బంగ్లాదేశ్‌ 300 పరుగులు దాటుతుందానన్న అనుమానం కలిగింది కానీ.. చివరిలో మిరాజ్‌ 20 బంతుల్లోనే 29 రన్స్ చేయడంతో ఆ మార్క్‌ను దాటింది


మార్ష్‌ వారేవ్వా:
307 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్‌ ఆరంభంలో దెబ్బ తగిలింది. ట్రావిస్‌ హెడ్‌ 10 రన్స్‌కే పెవిలియన్‌కు చేరాడు. టస్కిన్‌ అహ్మద్‌ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. వన్‌ డౌన్‌లో వచ్చిన మిచెల్ మార్ష్‌ బంగ్లా బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. మరో ఎండ్‌లో ఓపెనర్‌ వార్నర్‌ స్ట్రైక్‌ రొటేట్ చేస్తూ హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 22.1 ఓవర్లలో స్కోరు బోర్డు 132 వద్ద రెండో వికెట్‌ను కోల్పోయింది ఆస్ట్రేలియా. ముస్తాఫిజర్‌ బౌలింగ్‌లో వార్నర్‌ 53 రన్స్ వద్ద షంటోకి చిక్కి పెవిలియన్‌కు చేరాడు. అటు మిచెల్‌ మార్ష్‌ మాత్రం తన దూకుడును కొనసాగించాడు. ఇక మరో ఎండ్‌లో స్టిమ్‌ స్మిత్‌ స్ట్రైక్‌ రొటేట్ చేస్తూ ఎక్కువగా స్ట్రైకింగ్‌ మార్ష్‌కే ఇచ్చాడు. ఈ క్రమంలోనే మార్ష్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సెంచరీ తర్వాత మరింత రెచ్చిపోయాడు మార్ష్. స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అటు స్టీవ్‌ స్మిత్‌ హాఫ్‌ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. ఇక మార్ష్ వేగంగా ఆడడంతో ఆస్ట్రేలియా 44.4 ఓవర్లలోనే టార్గెట్‌ను ఛేజ్ చేసింది. 132 బంతుల్లో 177 రన్స్ చేసిన మార్ష్ నాటౌట్‌గా నిలిచాడు. మార్ష్ ఇన్నింగ్స్‌లో 17 ఫోర్లు, 9 సిక్సలు ఉన్నాయి. అటు 64 బాల్స్‌లో 63 రన్స్ చేశాడు స్మిత్‌. అతని ఇన్నింగ్స్‌లో ఒక సిక్సర్‌, నాలుగు ఫోర్లు ఉన్నాయి.

Also Read: దీపావళి రోజు పేలిన టీమిండియా టపాసులు.. మరిచిపోలేని జ్ఞాపకాలు..!

WATCH:

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

DC VS MI: ఢిల్లీకి బ్రేక్ పడింది..ఉత్కంఠ మ్యాచ్ లో గెలిచిన ముంబయ్

ఐపీఎల్ లో అంతా తారుమారు అవుతోంది. వరుసగా మ్యాచ్ లు గెలుస్తున్న టీమ్ లు అనూహ్యంగా ఓడిపోతున్నాయి. పాయింట్ల పట్టికలో అడుగున ఉన్న జట్లు మ్యాచ్ లు గెలుస్తున్నాయి. ఈరోజు  ఢిల్లీతో జరిగిన ఉత్కంఠ పోరులో ముంబయ్ విజయం సాధించింది. 

New Update
ipl

DC VS MI

ఢిల్లీ క్యాపిటల్స్ వరుస విజయాలకు బ్రేక్ పడింది. సూపర్ మ్యాచ్ లో ముంబయ్ విజయం సాధించింది. ఈరోజు ఐపీఎల్ లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, ముంబయ్ ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో ఎమ్ఐ 12 పరుగుల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబయ్ 206 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీకి ఇచ్చింది. తరువాత బ్యాటింగ్ కు దిగిన డీసీ బ్యాటింగ్‌కు దిగిన  19 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఢిల్లీ బ్యాటర్ కరుణ్‌ నాయర్‌  40 బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్స్‌లతో 89 పరుగులు చేశారు. ముంబయి బౌలర్లలో కర్ణ్‌ శర్మ 3, దీపక్‌ చాహర్‌ 1, బుమ్రా 1, శాంట్నర్‌ 1 వికెట్లు తీశారు. ముంబయ్ కు ఇది రెండో విజయం.

భారీ స్కోర్ ఇచ్చిన ముంబయ్..

అంతకు ముందు మొదట బ్యాటింగ్ చేసిన ముంబయ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. తిలక్‌ వర్మ హాఫ్‌ సెంచరీతో చెలరేగాడు. 33 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సులో 59 పరుగులు చేశాడు. రికెల్టన్ 41, సూర్యకుమార్ 40, నమన్ 38 పరుగులతో రాణించారు. విప్రజ్, కుల్దీప్ చెరో రెండు వికెట్లు తీశారు. మకేశ్ ఓ వికెట్ తీశారు. చివరి ఓవర్లో 11 రన్స్ చేశారు ముంబయ్ బ్యాటర్లు. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ(18) మరోసారి నిరాశపరిచాడు. ఐదో ఓవర్లో విప్రజ్‌ వేసిన చివరి బంతికి ఎల్బీగా వెనుదిరిగాడు. చివర్లో నమన్ దూకుడుగా ఆడి ముంబయ్ ఎక్కువ స్కోరు వచ్చలా చేశాడు. ఢిల్లీ  బౌలర్లలో విప్రజ్‌, కుల్దీప్‌ రెండేసి వికెట్లు.. ముకేశ్‌ ఒక వికెట్‌ తీశారు.    

today-latest-news-in-telugu | IPL 2025 | dc | delhi | mumbai-indians

Also Read: DRDO: భారత అమ్ములపోదిలో మరో అస్త్రం..లేజర్ వెపన్

Advertisment
Advertisment
Advertisment