అక్బరుద్దీన్ ఉంటే నేను ప్రమాణస్వీకారం చేయను.. రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

అక్బరుద్దీన్ ప్రోటెం స్పీకర్ గా ఉంటే తాను ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయనని తేల్చి చెప్పారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే వాళ్ళతో ఎంఐఎం కలిసిపోతుందని అన్నారు. రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి.

New Update
Raja Singh: మరో స్టాండప్‌ కమెడియన్‌ని టార్గెట్ చేసిన రాజాసింగ్..

Raja Singh Sensational Comments : గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్(Raja Singh) సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఎక్కువ రోజులు కాంగ్రెస్(Congress)   అధికారంలో ఉండదని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ వారు వాళ్లకు వాళ్లే కోట్లాడి ప్రభుత్వాన్ని పడగోడతారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని అన్నారు. ప్రస్తుతం రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో దుమారం లేపాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర చేస్తుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

రేపు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అసెంబ్లీ సమావేశాలు జరగనున్న విషయం తెలిసిందే. తెలంగాణ ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్యేలందరూ అసెంబ్లీలో ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అక్బరుద్దీన్ (Akbaruddin Owaisi) ప్రోటెం స్పీకర్ గా ఉంటే .. తాను ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయను అని తేల్చి చెప్పారు.

రేపు బీజేపీ నేతల భేటీ..

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy) అధ్యక్షతన ఎన్నికల్లో గెలిచిన 8 మంది బీజేపీ ఎమ్మేల్యేలు (BJP MLA's) హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో రేపు ఉదయం సమావేశం కానున్నారు. భాగ్యలక్ష్మి అమ్మవారిని బీజేపీ ఎమ్మెల్యేలు దర్శించుకోనున్నారు. కిషన్ రెడ్డి తో సమావేశం అయిన తరువాత తదుపరి కార్యచరణపై చర్చించనున్నారు. అయితే, బీజేపీ ఫ్లోర్‌ లీడర్‌గా రాజాసింగ్ పేరును బీజేపీ అధిష్టానం దాదాపు ఖరారు చేసినట్లు సమాచారం. ఈ ఎన్నికల్లో గెలిచిన 8 మంది బీజేపీ ఎమ్మెల్యేల కంటే రాజాసింగ్ సీనియర్ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

DC VS MI: ఢిల్లీకి బ్రేక్ పడింది..ఉత్కంఠ మ్యాచ్ లో గెలిచిన ముంబయ్

ఐపీఎల్ లో అంతా తారుమారు అవుతోంది. వరుసగా మ్యాచ్ లు గెలుస్తున్న టీమ్ లు అనూహ్యంగా ఓడిపోతున్నాయి. పాయింట్ల పట్టికలో అడుగున ఉన్న జట్లు మ్యాచ్ లు గెలుస్తున్నాయి. ఈరోజు  ఢిల్లీతో జరిగిన ఉత్కంఠ పోరులో ముంబయ్ విజయం సాధించింది. 

New Update
ipl

DC VS MI

ఢిల్లీ క్యాపిటల్స్ వరుస విజయాలకు బ్రేక్ పడింది. సూపర్ మ్యాచ్ లో ముంబయ్ విజయం సాధించింది. ఈరోజు ఐపీఎల్ లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, ముంబయ్ ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో ఎమ్ఐ 12 పరుగుల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబయ్ 206 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీకి ఇచ్చింది. తరువాత బ్యాటింగ్ కు దిగిన డీసీ బ్యాటింగ్‌కు దిగిన  19 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఢిల్లీ బ్యాటర్ కరుణ్‌ నాయర్‌  40 బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్స్‌లతో 89 పరుగులు చేశారు. ముంబయి బౌలర్లలో కర్ణ్‌ శర్మ 3, దీపక్‌ చాహర్‌ 1, బుమ్రా 1, శాంట్నర్‌ 1 వికెట్లు తీశారు. ముంబయ్ కు ఇది రెండో విజయం.

భారీ స్కోర్ ఇచ్చిన ముంబయ్..

అంతకు ముందు మొదట బ్యాటింగ్ చేసిన ముంబయ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. తిలక్‌ వర్మ హాఫ్‌ సెంచరీతో చెలరేగాడు. 33 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సులో 59 పరుగులు చేశాడు. రికెల్టన్ 41, సూర్యకుమార్ 40, నమన్ 38 పరుగులతో రాణించారు. విప్రజ్, కుల్దీప్ చెరో రెండు వికెట్లు తీశారు. మకేశ్ ఓ వికెట్ తీశారు. చివరి ఓవర్లో 11 రన్స్ చేశారు ముంబయ్ బ్యాటర్లు. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ(18) మరోసారి నిరాశపరిచాడు. ఐదో ఓవర్లో విప్రజ్‌ వేసిన చివరి బంతికి ఎల్బీగా వెనుదిరిగాడు. చివర్లో నమన్ దూకుడుగా ఆడి ముంబయ్ ఎక్కువ స్కోరు వచ్చలా చేశాడు. ఢిల్లీ  బౌలర్లలో విప్రజ్‌, కుల్దీప్‌ రెండేసి వికెట్లు.. ముకేశ్‌ ఒక వికెట్‌ తీశారు.    

today-latest-news-in-telugu | IPL 2025 | dc | delhi | mumbai-indians

Also Read: DRDO: భారత అమ్ములపోదిలో మరో అస్త్రం..లేజర్ వెపన్

Advertisment
Advertisment
Advertisment