Hyderabad:నువ్వు చేయాల్సిందేంటీ..చేస్తున్నదేంటీ..బస్సులో మహిళా క్రికెటర్ల కోచ్ జై సింహ నిర్వాకం

హైద‌రాబాద్ మ‌హిళా క్రికెట‌ర్లకు చేదు అనుభ‌వం ఎదురైంది. వాళ్ళకు సరైన మార్గాన్ని చూపించాల్సిన కోచ్ అసభ్యంగా ప్రవర్తించాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనతో కోచ్‌ను సస్పెండ్ చేసింది హెచ్సీఏ.

New Update
Hyderabad:నువ్వు చేయాల్సిందేంటీ..చేస్తున్నదేంటీ..బస్సులో మహిళా క్రికెటర్ల కోచ్ జై సింహ నిర్వాకం

Hyderabad woman cricketers coach misbehave:హైదరాబాద్ మహిళా క్రికెట్ జట్టుకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. తమ ఆటను మెరుగుపరుస్తూ..నిత్యం తమతో ఉండే కోచ్‌ నుంచే వారికి అనుకోని సంఘటన ఎదురైంది. ట్రైనింగ్ ఇవ్వాల్సిన కోచ్ అసభ్యంగా ప్రవర్తించిన చేదు అనుబవం ఎదురయ్యింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందీ ఘటన. మ్యాచ్ కోసం మ‌హిళా క్రికెట‌ర్ల హైద‌రాబాద్ నుంచి విజ‌య‌వాడ‌కు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వారు విమానంలో రావాల్సి ఉంది. అయితే.. కావాల‌నే కోచ్ జైసింహా ఆల‌స్యం చేయ‌డంతో ప్లైట్ మిస్ అయింది. దీంతో వారంతా బ‌స్‌లో విజవాడ నుంచి హైదరాబాద్‌ వచ్చారు. వస్తున్న దారిలో జైసింహ బస్సులోనే మందు తాగాడు. తమ ముందు తాగొద్దని ఎంత చెబుతున్నా వినలేదు. పైగా కోపంతో నానా మాటలు మాట్లాడాడు. బండ బూతులు తిట్టాడు. తనను ఎవరైనా ఎదిరిస్తే టీమ్‌లో నుంచి తీసేస్తానని బెదిరించాడు కూడా.

Also Read:Hyderabad:మరీ ఇంత క్రూరమా? కోట్లకు కోట్లు కట్నం తీని కూడా హింస పెట్టి చంపేశారు!

హెచ్సీఏలో పిర్యాదు..
సంఘటన జరిగాక హైదరాబాద్ వచ్చిన క్రికెటర్లు వెంటనే హచ్సీఏలో ఫిర్యాదు చేశారు. బస్సులో తతంగం అంతా జరుగుతున్నప్పుడు సెల‌క్షన్ క‌మిటీ మెంబ‌ర్ పూర్ణిమ‌రావు బ‌స్‌లోనే ఉన్నారు. తాను ఒక మమిళ అయి ఉండి ఆమె.. జై సింహాను అడ్డుకోలేదు స‌రిక‌దా ఇంకా ఎంక‌రేజ్ చేసింది. వీళ్ళిద్దరి మీద మహిళా క్రికెటర్లు కంప్లైంట్ చేశారు. పూర్నిమా రావు, జైసింహల మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. క్రికెటర్ల తల్లిదండ్రులు బీసీసీఐ కు కూడా ఫిర్యాదు చేశారు. అయితే హెచ్సీఏ ఈ విషయం మీద కాస్త ఆలస్యంగా స్పందించింది. ఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత కోచ్ పదవి నుంచి జై సింహాను తక్షణమే తప్పిస్తూ అధ్యక్షుడు జగన్మోహన్ రావు నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు అతని మీద క్రిమినల్ కేసు కూడా పెడతామనిచెప్పారు. మహిళా క్రికెటర్ల రక్షణకు భంగం వాటిల్లితే ఊరుకునేది లేదని చెబుతున్నారు జగన్మోహనరావు. ఇప్పుడు జరిగిన సంఘటన మీద పూర్తిస్థాయి విచారణ జరపాలని కోరుతామని తెలిపారు. దాంతో పాటూ విచారణ ముగిసే వరకూ జైసింహను సస్పెండ్ చేశారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

SRH VS PBKS: వాట్ ఏ కమ్ బ్యాక్..ఎస్ఆర్హెచ్ దుమ్ము దులిపేసింది మామా..

ఐపీఎల్ 2025లో ఈరోజు అద్భుతమైన మ్యాచ్ జరిగింది. హైదరాబాద్ ఉప్పల్ లో ఈరోజు పంజాబ్ కింగ్స్, హైదరాబాద్ సన్ రైజర్స్ నువ్వా నేనా అన్నట్టు ఆడారు. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 246 పరుగుల టార్గెట్ ఇస్తే దాన్ని ఎనిమిది వికెట్ల తేడాతో ఛేదించింది. 

author-image
By Manogna alamuru
New Update
ipl

SRK VS PBKS

హైదరాబాద్ సన్ రైజర్స్ అద్భుతమైన కమ్ బ్యాక్ ఇచ్చింది. ఐదు మ్యాచ్ లు ఓడిపోయిన తర్వాత ఈరోజు పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ చితక్కొట్టేసింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ లు విజృంభించి ఆడేశారు. పజాబ్ కింగ్స్ ఇచ్చిన 246 పరుగుల భారీ టార్గెట్ ను 8 వికెట్ల తేడాతో సునాయాసంగా ఛేదించింది. ఓపెనర్లు అభిషేక్ వర్మ 141 పరుగులు, ట్రావిస్ హెడ్ 66 పరుగులతో ఇరగదీసారు. ఇద్దరూ కలిసి మ్యాచ్ ను గెలిపించేశారు. 150 పరుగుల ముందు అభిషేక్ వర్మ వికెట్ కోల్పోవడం కొంత నిరాశ కలిగించినా...అతను ఈరోజు ఆడిన తీరుతో ఉప్పల్ స్టేడియం మొత్తాన్ని ఉర్రూతలూగించాడు. అభిషేక్‌ శర్మ 55 బంతుల్లో 14 ఫోర్లు, 10 సిక్స్‌లsy 141 పరుగులు చేసి పంజాబ్‌ బౌలర్లకు చుక్కలు చూపించాడు. వరుస ఫోర్లు, సిక్సర్లతో ఉప్పల్ మైదానంలో పరుగుల వరద పారించాడు. అభిషేక్ ధాటికి పంజాబ్ ఏకంగా ఎనిమిది మందితో బౌలింగ్‌ చేయించింది.  మరోవైపు అతను కొట్టిన బంతులను గ్రౌండ్ స్టాఫ్ వెతుక్కోవడంతోనే సరిపోయింది.  ట్రావిస్ హెడ్ 37 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 66 పరుగులు చేసి అభిషేక్ కు మంచి సపోర్ట్ ఇచ్చాడు.  చివర్లో క్లాసెన్ 14 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌ తో 21, ఇషాన్ కిషన్ 9*; 6 బంతుల్లో 1 సిక్స్ కొట్టి మ్యాచ్ ను గెలిపించారు. 

పంజాబ్ కూడా దుమ్మ రేపింది..

అంతకు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు చెలరేగిపోయింది. తొలి ఇన్నింగ్స్ చేసి కింగ్స్ జట్టు నిర్దేశించిన 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 245 పరుగులు సాధించింది. దీంతో SRH ముందు 246 భారీ టార్గెట్ ఉంది. హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో ఈ మ్యాచ్ జరుగుతోంది. మొదట టాస్ గెలిచిన పంజాబ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్స్‌గా క్రీజులోకి ప్రభ్‌మన్ సింగ్‌, ప్రియాంశ్‌ ఆర్య మొదటి నుంచి దంచి కొట్టారు. బాల్‌ టు బాల్ ఫోర్లు, సిక్సర్లతో దుమ్ము దులిపేశారు. ఉప్పల్ స్టేడియంలో పరుగుల వరద పెట్టించారు. సన్ రైజర్స్ జట్టు బౌలర్లకు చెమటలు తెప్పించారు. ఇక హర్షల్‌ పటేల్‌ బౌలింగ్‌లో (3.6) ప్రియాంశ్‌ ఆర్య (36) నితీశ్‌ రెడ్డికి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.  ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన శ్రేయస్ అయ్యార్ దుమ్ము దులిపేశాడు. పరుగులు రాబడుతూ అదరగొట్టేశాడు. ఫోర్లు, సిక్సర్లతో కెవ్ కేక అనిపించాడు. అతడు 36 బంతుల్లో 82 పరుగులు చేసి ఔటయ్యాడు. అలాగే వధేరా 22 బంతుల్లో 27 పరుగులు, శశాంక్ సింగ్ 3 బంతుల్లో 2 పరుగులు, మాక్స్‌వెల్ 7 బంతుల్లో 3 పరుగులు, స్టొయినీస్ 11 బంతుల్లో 34 పరుగులు చేశారు. 

 today-latest-news-in-telugu | IPL 2025 | srh-vs-pbks

Also Read:  USA: యాపిల్ కు అండగా ట్రంప్..సుంకాల నుంచి ఫోన్లు, కంప్యూటర్లు మినహాయింపు

Advertisment
Advertisment
Advertisment