Skin Care: అందానికి కొబ్బరి క్రీమ్‌.. ఈ సమ్మర్‌లో బెస్ట్‌ చిట్కా!

ఇంట్లో కొబ్బరి క్రీమ్‌ను తయారు చేయడం చాలా సులభం. మీ చర్మాన్ని అందంగా మార్చుకునేందుకు కొబ్బరి క్రీమ్‌ చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఆలస్యం చేయకుండా కొబ్బరి క్రీమ్ ఎలా తయారు చేయాలో ఈ ఆర్టికల్‌ మొత్తం చదివి తెలుసుకోండి.

New Update
Skin Care: అందానికి కొబ్బరి క్రీమ్‌.. ఈ సమ్మర్‌లో బెస్ట్‌ చిట్కా!

Summer Skin Tips: వాతావరణంలో మార్పులు మొదలయ్యాయి. ఎండలు దంచికొడుతున్నాయి. పగటిపూట వచ్చే బలమైన సూర్యరశ్మి కారణంగా చర్మ సమస్యలు రావొచ్చు. గ్లో కూడా పోవచ్చు. ఈ సీజన్‌లో చర్మాన్ని సంరక్షించుకోవడం చాలా ముఖ్యం. ఈ సీజన్ లో చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోకపోతే రాబోయే కాలంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. నేటి కాలంలో చర్మానికి సంబంధించిన ప్రతి సమస్యకు పార్లర్లను విజిట్ చేస్తున్నారు అమ్మాయి. స్కిన్ కేర్ ట్రీట్ మెంట్స్ అందుబాటులో ఉన్నా హోం రెమెడీస్ ను ఫాలో అవ్వడం బెటర్. మీరు కూడా ఇక నుంచి మీ చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోవాలనుకుంటే, ఈ రోజు ఇంట్లో కొబ్బరి క్రీమ్‌ని యూజ్ చేయండి. దీన్ని ఎలా తయారు చేయాలో తెలుసుకోండి.

క్రీమ్ తయారీ ఇన్‌గ్రేడియంట్స్:

--> 1 కప్పు కొబ్బరి నూనె
--> 1 టీస్పూన్ నేచురల్ అలోవెరా (1 టీస్పూన్)
--> 1 నుంచి 2 చుక్కల ఎసెన్షియల్ ఆయిల్

ఎలా తయారు చేయాలి:
కొబ్బరి క్రీమ్ తయారు చేయడానికి మొదట కరిగించిన కొబ్బరి నూనె, తాజా కలబంద జెల్ ను ఒక గిన్నెలో తీసుకోండి. వాటిని బాగా కలపాలి. అప్పుడు అది కరిగిపోతుంది. కావాలనుకుంటే హ్యాండ్ మిక్సర్ ను ఉపయోగించి తయారు చేసుకోవచ్చు. మీ అవసరాన్ని బట్టి కొన్ని చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ జోడించండి. కావాలనుకుంటే లావెండర్, పిప్పరమింట్ లేదా సిట్రస్ ఆయిల్‌ను ఎంచుకోవచ్చు. వీటిని బాగా కలపాలి. మీ కొబ్బరి క్రీమ్ ఇప్పుడు సిద్ధమవుతుంది. పొడి చర్మం ఉన్నవారికి ఈ రెమెడీ ఒక వరం. ఈ క్రీమ్ ను ఉపయోగించడం వల్ల చర్మం మృదువుగా మారుతుంది. ఈ క్రీమును 10 రోజులకు మించి ఉపయోగించకూడదు.

Also Read: దీపికా కూడా సరోగసీ ద్వారానే బేబీని కనబోతుందా? ఇందులో నిజమెంత?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Babu Mohan : రాజకీయాల నుంచి సేవారంగంవైపు... బాబుమోహన్‌ కీలక నిర్ణయం

 ప్రముఖ సినీ నటుడు బాబు మోహన్ తెలియనివారుండరు. తన హాస్యనటనతో ఎందరినో అలరించిన ఆయన ఆ తర్వాత రాజకీయరంగ ప్రవేశం చేశారు. మంత్రిగా కూడా పనిచేశారు. ఈ రోజు సేవా రంగంలోకి అడుగుపెట్టారు. తన కుమారుడి జ్ఞాపకార్థం ‘పవన్ బాబు మోహన్ ఛారిటబుల్ ట్రస్ట్’ను స్థాపించారు.

New Update
Babu Mohan

Babu Mohan

 ప్రముఖ సినీ నటుడు, మాజీ మంత్రి బాబు మోహన్ తెలియనివారుండరు. తన హాస్యనటనతో ఎందరినో అలరించిన ఆయన ఆ తర్వాత రాజకీయరంగ ప్రవేశం చేశారు. తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచి మంత్రిగా కూడా పనిచేశారు. తెలంగాణ రాష్ట్రఏర్పాటు తర్వాత బీఆర్‌ఎస్‌ లో చేరి ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ అనుకోని కారణాల వల్ల ప్రస్తుతం ఆయన ఏ పదవిలో లేరు. అయితే ఆయన ఈ రోజు మరో రంగంలోకి అడుగుపెట్టారు. అదే సేవా రంగం. అవును తన కుమారుడి జ్ఞాపకార్థం ‘పవన్ బాబు మోహన్ ఛారిటబుల్ ట్రస్ట్’ను స్థాపించారు. ఈ ట్రస్ట్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న నిరుపేదలకు చేయూత అందిస్తామని ఆయన ప్రకటించారు. సోమవారం బషీర్ బాగ్‌ ప్రెస్ క్లబ్‌లో జరిగిన ఆవిర్భావ సమావేశంలో బాబు మోహన్ ట్రస్ట్ లక్ష్యాలు, కార్యక్రమాలను వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి అనుమతి పొందిన ఈ ట్రస్ట్.. నిరుపేదలకు విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలను కల్పించడంపై ప్రధానంగా దృష్టి సారిస్తుందని ఆయన తెలిపారు. నిరుద్యోగులకు చేయూత అందించడం కూడా ట్రస్ట్ ముఖ్య లక్ష్యాలలో ఒకటిగా పేర్కొన్నారు.

Also Read :  నీకు తక్కువ జీతం పిల్లనివ్వమని ఒకరు.. సంబంధం కుదరడం లేదని మరోకరు.!
 
బాబు మోహన్ మాట్లాడుతూ.. తన కుమారుడి పేరుతో ఏర్పాటు చేసిన ఈ ట్రస్ట్ ద్వారా సమాజంలోని బలహీన వర్గాలకు సహాయం అందించాలనేది తన చిరకాల కోరిక అని అన్నారు. పేదరికం నుంచి బయటపడటానికి విద్య ఒక ముఖ్యమైన సాధనమని ఆయన నొక్కి చెప్పారు. అందుకే.. ట్రస్ట్ ద్వారా నిరుపేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు.. వారికి నాణ్యమైన విద్యను అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తామని ఆయన తెలిపారు.అలాగే.. సరైన వైద్యం అందక ఇబ్బందులు పడుతున్న వారికి సహాయం అందించడం కోసం.. వైద్య శిబిరాలు నిర్వహించడం, ఆసుపత్రి ఖర్చుల కోసం ఆర్థిక సహాయం చేయడం వంటి కార్యక్రమాలను ఈ ట్రస్ట్ చేపడుతుందని బాబు మోహన్ తెలిపారు. ఉపాధి లేని యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి.. వారు ఉద్యోగాలు పొందేలా సహాయం చేస్తుందన్నారు.

Also Read :  HIT 3 బాహుబలి, RRR రికార్డులను మించి.. ట్రెండింగ్ లో 'హిట్ 3' ట్రైలర్.. ఎన్ని మిలియన్ల వ్యూస్ అంటే!
 
ట్రస్ట్ ద్వారా సహాయం పొందాలనుకునే వారు కోఆర్డినేటర్ రాజ్ కుమార్‌ను 8919511215 నెంబర్‌ ద్వారా సంప్రదించవచ్చని బాబు మోహన్ తెలిపారు. ఈ సందర్భంగా.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం బండారు గూడెం కోయజాతికి చెందిన సమీప అనే విద్యార్థి ఎంటెక్ చేయడానికి, గ్రూప్స్ కోచింగ్ తీసుకోవడానికి బాబు మోహన్ తన ట్రస్ట్ ద్వారా ఆర్థిక సహాయం అందజేశారు.

Also Read :  కడుపుతో ఉన్న భార్యను ఎందుకు చంపాడంటే.. షాకింగ్ విషయాలు చెప్పిన విశాఖ పోలీసులు.. !


బాబు మోహన్ కుమారుడు పవన్ కుమార్ 2003 అక్టోబర్ 12న జరిగిన హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. స్పోర్ట్స్ బైక్ అదుపుతప్పి డివైడర్‌ని ఢీ కొట్టడంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు. కొడుకు మరణంతో బాబు మోహన్ ఎంతగానో కుంగిపోయారు. కొడుకు పేరిట సేవా కార్యక్రమాలు చేపట్టాలని తాను ఎంతో కాలంగా భావిస్తున్నానని.. కానీ రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల కుదరలేదన్నారు. తాను ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉండటం వల్ల పూర్తి స్థాయిలో ట్రస్ట్ కోసం పని చేస్తానని ఆయన చెప్పారు.

 Also Read :  ముగ్గురు భార్యలు జంప్.. నాలుగో పెళ్లికి రెడీ.. నీ కష్టం పగోడికి కూడా రావొద్దురా!

Advertisment
Advertisment
Advertisment