Hyderabad: హైదరాబాద్లో దారుణం.. పార్కింగ్ గొడవతో కక్షగట్టి ఏడాది తర్వాత హత్య హోటల్ వెనుక వాహనం పార్కింగ్ విషయంలో సంవత్సరం క్రితం జరిగిన గొడవతో కక్షకట్టిన ఓ వ్యక్తి ఈ దారుణ హత్యకు పాల్పడ్డాడు. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని గచ్చిబౌలి అంజయ్యనగర్లో జరిగింది. పూర్తి వివరాలకు ఈ కథనం చదివేయండి! By Bhavana 04 May 2024 in క్రైం Latest News In Telugu New Update షేర్ చేయండి ఏడాది క్రితం పార్కింగ్ విషయంలో గొడవ జరిగినదానిని మనసులో పెట్టుకుని ఓ హోటల్ యజమానిని హత్య చేశాడు ఓ వ్యక్తి. ఈ దారుణం హైదరాబాద్ లోని గచ్చిబౌలి లో జరిగింది. గురువారం సాయంత్రం అంతా చూస్తుండగానే ఇనుప రాడ్డుతో హోటల్లోకి ప్రవేశించిన ఓ వ్యక్తి యజమానిపై ఒక్కసారిగా దాడి చేశాడు. తలకు బలమైన గాయాలైన ఆయన ఐదు గంటలపాటు మృత్యువుతో పోరాడి ప్రాణాలు కోల్పోయాడు. హోటల్ వెనుక వాహనం పార్కింగ్ విషయంలో సంవత్సరం క్రితం జరిగిన గొడవతో కక్షకట్టిన ఓ వ్యక్తి ఈ దారుణ హత్యకు పాల్పడ్డాడు. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని గచ్చిబౌలి అంజయ్యనగర్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... యూసుఫ్గూడకు చెందిన చెల్లూరి శ్రీనివాస్(54) కొండాపూర్ వైట్ ఫీల్డ్స్ విల్లాస్లో ఉంటున్నారు. అంజయ్యనగర్లో తన కుమారుడు కేశవ్ వినయ్(28)తో కలిసి సీఎస్ డెలాయిట్ ఇన్ హోటల్ రన్ చేస్తున్నారు. ఆయన హోటల్ వెనుక స్టోర్ రూం కోసం గది అద్దెకు తీసుకున్నారు. ఏడాది క్రితం స్టోర్ రూం ఎదుట రోడ్డుపై ఆటో ట్రాలీ పార్క్ చేసి సరకులు దించుకుంటున్నారు. ఆటో ట్రాలీ అక్కడ ఆపడం వల్ల దారిలో రాకపోకలకు ఇబ్బంది కలుగుతుందని పక్కింట్లో ఉండే మహేందర్(35) అనే వ్యక్తి శ్రీనివాస్తో గొడవకు దిగాడు. గచ్చిబౌలిలో దారుణ హత్య.. లైవ్ వీడియో గచ్చిబౌలి అంజయ్య నగర్లో హోటల్ యజమాని శ్రీనివాస్ (54) తలపై ఇనుప రాడ్తో దుండగుడు ఒక్కసారిగా దాడి చేయడంతో మృతిచెందాడు. pic.twitter.com/kz2TEZtEk2 — Telugu Scribe (@TeluguScribe) May 3, 2024 ఆ సమయంలో స్థానికులు అతడినే వారించి గొడవ సద్దుమణిగేలా చూశారు. తన పరువు తీశాడని కక్ష కట్టిన మహేందర్ అప్పటి నుంచి అతన్ని ఎలాగైనా చంపేయాలని అనుకున్నాడు. గురువారం సాయంత్రం ఇనుప రాడ్డుతో హోటల్లోకి ప్రవేశించిన నిందితుడు అక్కడే సోఫాలో కూర్చొని ఉన్న శ్రీనివాస్పై రాడ్డుతో ఒక్కసారిగా బలంగా దాడి చేశాడు. అక్కడే ఉన్న శ్రీనివాస్ పెద్ద కుమారుడు కేశవ్, హోటల్ సిబ్బంది మహేందర్ను అడ్డుకుని శ్రీనివాస్ను చికిత్స కోసం కేర్ ఆసుపత్రికి తరలించారు. ఆయన చికిత్స పొందుతూ రాత్రి 11.45కు ప్రాణాలు కోల్పోయారు. కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. శ్రీనివాస్ మరణంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. Also read: ఏపీలో 47. 7 డిగ్రీల రికార్డు ఉష్ణోగ్రతలు.. నేడు 58 మండలాల్లో తీవ్ర వడగాల్పులు! #hyderabad #murder #gachibowli సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి