Telangana: రెసిడెన్షియల్ పాఠశాలలు ఫుడ్ సేఫ్టీ అథారిటీ లైసెన్స్ తీసుకోవాలి - మంత్రి దామోదర రాజనర్సింహ

విద్యార్థుల ఆరోగ్యంతో చెలగాటమాడితే ఉపేక్షించేది లేదన్నారు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ. శాంపిల్స్ సేకరించి మొబైల్ ఫుడ్ ల్యాబ్స్లో పరీక్షలు నిర్వహించాలని దామోదర రాజనర్సింహ ఆదేశించారు.

New Update
Telangana: రెసిడెన్షియల్ పాఠశాలలు ఫుడ్ సేఫ్టీ అథారిటీ లైసెన్స్ తీసుకోవాలి - మంత్రి దామోదర రాజనర్సింహ

Minister Damodar Raja Narasimha: ఆహారం సరఫరా చేసే హోటళ్లు, బేకరీలు, రెస్టారెంట్లతో పాటు హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలలు ఫుడ్ సేఫ్టీ అథారిటీ లైసెన్స్ (Food Safety License) తీసుకోవాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. విద్యార్థుల ఆరోగ్యంతో చెలగాటమాడితే ఉపేక్షించేది లేదన్నారు. ఫుడ్ సేఫ్టీ నిబంధనలు, నాణ్యత పాటించకపోతే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. ప్రతిరోజు సుమారు 200 శాంపిల్స్ సేకరించి మొబైల్ ఫుడ్ ల్యాబ్స్లో పరీక్షలు నిర్వహించాలని దామోదర రాజనర్సింహ ఆదేశించారు.

రాష్ట్రంలో ఆహార భద్రతపై దృష్టి పెట్టామని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ఆహార కల్తీ కాకుండా ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని ప్రతినిధులకు సూచించారు. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి నగరాల్లో ఆహార కల్తీ లేకుండా చేయాలని వివరించారు. నాణ్యమైన ఆహార పదార్థాలు అందించడంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా ఉండాలన్నారు. వర్షాకాలం ఆహారం కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

Also Read: యూనివర్శిటీ ఇంఛార్జి వీసీల పదవీకాలం పొడిగింపు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

DC VS MI: ఢిల్లీకి బ్రేక్ పడింది..ఉత్కంఠ మ్యాచ్ లో గెలిచిన ముంబయ్

ఐపీఎల్ లో అంతా తారుమారు అవుతోంది. వరుసగా మ్యాచ్ లు గెలుస్తున్న టీమ్ లు అనూహ్యంగా ఓడిపోతున్నాయి. పాయింట్ల పట్టికలో అడుగున ఉన్న జట్లు మ్యాచ్ లు గెలుస్తున్నాయి. ఈరోజు  ఢిల్లీతో జరిగిన ఉత్కంఠ పోరులో ముంబయ్ విజయం సాధించింది. 

New Update
ipl

DC VS MI

ఢిల్లీ క్యాపిటల్స్ వరుస విజయాలకు బ్రేక్ పడింది. సూపర్ మ్యాచ్ లో ముంబయ్ విజయం సాధించింది. ఈరోజు ఐపీఎల్ లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, ముంబయ్ ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో ఎమ్ఐ 12 పరుగుల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబయ్ 206 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీకి ఇచ్చింది. తరువాత బ్యాటింగ్ కు దిగిన డీసీ బ్యాటింగ్‌కు దిగిన  19 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఢిల్లీ బ్యాటర్ కరుణ్‌ నాయర్‌  40 బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్స్‌లతో 89 పరుగులు చేశారు. ముంబయి బౌలర్లలో కర్ణ్‌ శర్మ 3, దీపక్‌ చాహర్‌ 1, బుమ్రా 1, శాంట్నర్‌ 1 వికెట్లు తీశారు. ముంబయ్ కు ఇది రెండో విజయం.

భారీ స్కోర్ ఇచ్చిన ముంబయ్..

అంతకు ముందు మొదట బ్యాటింగ్ చేసిన ముంబయ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. తిలక్‌ వర్మ హాఫ్‌ సెంచరీతో చెలరేగాడు. 33 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సులో 59 పరుగులు చేశాడు. రికెల్టన్ 41, సూర్యకుమార్ 40, నమన్ 38 పరుగులతో రాణించారు. విప్రజ్, కుల్దీప్ చెరో రెండు వికెట్లు తీశారు. మకేశ్ ఓ వికెట్ తీశారు. చివరి ఓవర్లో 11 రన్స్ చేశారు ముంబయ్ బ్యాటర్లు. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ(18) మరోసారి నిరాశపరిచాడు. ఐదో ఓవర్లో విప్రజ్‌ వేసిన చివరి బంతికి ఎల్బీగా వెనుదిరిగాడు. చివర్లో నమన్ దూకుడుగా ఆడి ముంబయ్ ఎక్కువ స్కోరు వచ్చలా చేశాడు. ఢిల్లీ  బౌలర్లలో విప్రజ్‌, కుల్దీప్‌ రెండేసి వికెట్లు.. ముకేశ్‌ ఒక వికెట్‌ తీశారు.    

today-latest-news-in-telugu | IPL 2025 | dc | delhi | mumbai-indians

Also Read: DRDO: భారత అమ్ములపోదిలో మరో అస్త్రం..లేజర్ వెపన్

Advertisment
Advertisment
Advertisment