Tamilnadu rains: కుండపోతగా వర్షాలు..స్కూళ్లు, కాలేజీలు బంద్‌!

తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం నాడు అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలుండడంతో అధికారులు స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు.

New Update
IMD: ఈసారి వర్షపాతం అధికమే.. చల్లని కబురు చెప్పిన వాతావరణశాఖ!

భారీ వర్షాలతో తమిళనాడు(Tamialanadu) లో భారీ వర్షాలు (Heavy rains)  పడుతున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కుంభవృష్టి వాన కురుస్తుంది. దీంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కడలూర్‌, మైలాదుతురై, విల్లుపురం జిల్లాల్లో అన్ని విద్యా సంస్థలకు అధికారులు సెలవులు ప్రకటించారు.

ఇదిలా ఉంటే పుదుచ్చేరిలో మంగళవారం నాడు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో స్కూళ్లకు, కాలేజీలకు హాలీడే ఇచ్చారు. చెంగల్పట్టు, కాంచీపురం, విల్లుపురం, చుద్దలోర్‌ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశలున్నాయని అధికారులు తెలిపారు.

రాబోయే 24 గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. దీంతో సముద్ర తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఈ క్రమంలోనే ఏపీ ప్రజలకు కూడా వాతావరణ శాఖ అధికారులు గుడ్‌ న్యూస్‌ చెప్పారు.

రానున్న 2-3 రోజులు ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడే మరో అల్పపీడనం తీవ్ర అల్పపీడనం గా మారనుంది. ఇది 16 వ తేదీ నాటికి పశ్చిమ వాయువ్య దిశగా పయనించి దక్షిణ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం మారనుంది.

రానున్న రెండు మూడు రోజుల పాటు రాయలసీమ, ఉత్తరకోస్తాంధ్రలో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. నైరుతి బంగాళాఖాతంలో మరో తుఫాన్‌ ఆవర్తనం కూడా ఉన్నట్లు సమాచారం. నవంబర్ 15, 16 తేదీల్లో ఒడిశా, ఉత్తరాంధ్ర, పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో కూడా వర్షాలు పడనున్నాయి. అయితే బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం తుఫానుగా మారే అవకాశాలు కూడా లేకపోలేదని తెలుస్తోంది.

Also read: బాలల దినోత్సవం సందర్భంగా… మీ పిల్లలకు ఈ గిఫ్ట్ ఇవ్వండి..!!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Aghori - Sri Varshini: నా బావ జైలులో నన్ను వేసేయండి.. బోరున ఏడ్చేసిన వర్షిణీ

అఘోరీ అరెస్టు తర్వాత శ్రీవర్షిణి బోరున ఏడ్చేసింది. తన బావ జైలులోనే తనను కూడా ఉంచండి అంటూ రచ్చ రచ్చ చేసింది. తనను పంపిస్తే.. జైలుకు పంపించండి లేదా అత్త మామల దగ్గరకి పంపించండి అంటూ బోరున ఏడ్చేసింది. అంతేకాని తన తల్లిదండ్రుల వద్దకు పంపించొద్దని పేర్కొంది.

New Update

అఘోరీ, శ్రీవర్షిణీ లవ్‌కు బ్రేక్ పడింది. ప్రస్తుతం అఘోరీ అలియాస్ అల్లూరి శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం కోర్టు ఆదేశాలతో 14 రోజుల పాటు చంచల్‌గూడ జైల్లోకి పంపారు. అయితే అఘోరీని ఎప్పుడైతే అరెస్ట్ చేశారో.. ఆ తర్వాత శ్రీవర్షిణీ సంచలన వ్యాఖ్యలు చేసింది. అఘోరీతో పాటే తనను కూడా అరెస్టు చేయాలని కోరింది. తన బావ జైలులోనే తనను కూడా ఉంచండి అంటూ రచ్చ రచ్చ చేసింది. 

Also read :  పహల్గాంలో భయంకరమైన కాల్పుల లైవ్ వీడియోలు.. చూశారంటే గజగజ వణకాల్సిందే!

బోరున ఏడ్చేసిన వర్షిణి

అంతేకాకుడా తనను పంపిస్తే.. జైలుకు పంపించండి లేదా అత్త మామల దగ్గరకి పంపించండి అంటూ బోరున ఏడ్చేసింది. పోలీసులు ఎంత చెప్పినా వర్షిణీ అస్సలు వినిపించుకోలేదు. అఘోరీని జైలుకు పంపిన తర్వాత వర్షిణీకి కౌన్సిలింగ్ ఇచ్చేందుకు భరోసా కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడ వర్షిణికి పోలీసులు ఎంత నచ్చ చెప్పినా ఆమె వినిపించుకోలేదు. తాను మైనర్‌ని కాదని.. మేజర్‌నని.. ఎక్కడైనా ఉండే హక్కు తనకు ఉందని వర్షిణి అంటోంది. తాను కావాలనుకున్న చోటుకే తనను వదిలేయాలని చెబుతోంది. అంతేకాని తన తల్లిదండ్రుల వద్దకు పంపించొద్దని పేర్కొంది.

Also Read :  ఎంత దారుణంగా చంపారంటే.. బయటకు వచ్చిన ఉగ్రదాడి ఫస్ట్ వీడియో!

 

ఇందులో భాగంగానే వర్షిణికి పలు దఫాలుగా కౌన్సిలింగ్ ఇస్తూన్నా ఆమె మాత్రం ఎవ్వరి మాట వినడం లేదు. అయితే పోలీసులు దాదాపు 15 రోజుల పాటు వర్షిణీకి కౌన్సిలింగ్ ఇవ్వాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. మరోవైపు వర్షిణి తల్లిదండ్రులు తమ కూతురిని తమకే అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. అఘోరీ మాయమాటలకు వర్షిణి లోబడిందని.. తమ కూతురిని తామే ఇంటికి తీసుకెల్లిపోతామని అంటున్నారు.   

aghori sri varshini | lady aghori sri varshini relation | Lady Aghori Sri Varshini Marriage | Lady Aghori Sri Varshini Love Story | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
Advertisment