Ratnam : హీరో విశాల్ 'రత్నం'..మరో 5 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు

హీరో విశాల్, ప్రియా భవానీ శంకర్ జంటగా నటించిన తాజా చిత్రం రత్నం. 'సింగం' ఫేమ్ హరి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం ఏప్రిల్ 26 న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిపారు మేకర్స్.

New Update
Ratnam : హీరో విశాల్ 'రత్నం'..మరో 5 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు

Ratnam : హీరో విశాల్ లేటెస్ట్ చిత్రం 'రత్నం'. సింగం ఫేమ్ హరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో యంగ్ బ్యూటీ ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటించగా.. సముద్రఖని, యోగిబాబు మరియు గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రలు పోషించారు. ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం ఏప్రిల్ 26న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిపారు మేకర్స్.

ఈ సందర్భంగా తాజాగా శనివారం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మాట్లాడిన విశాల్ సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. సినిమాల పరంగా నేను మొదటి నుంచి ప్రయోగాలు, సాహసాలు చేస్తున్నా. ఈ క్రమంలో ఎన్నో సార్లు గాయపడ్డాను. అయినా సరే ప్రేక్షకులను మెప్పించేందుకు మంచి కథలనే ఎంచుకుంటున్నాను అని అన్నారు. ఇప్పుడు రత్నం కూడా అభిమానులకు నచ్చేలా ఉండబోతుంది. గతంలో హరి దర్శకత్వంలో చేసిన భరణి, పూజ సినిమాలు చేశానని.. అవి భారీ విజయాలు సాధించాయని. ఇప్పుడు 'రత్నం' కూడా మంచి విజయం సాధిస్తుందని విశాల్ నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అద్భుతమైన సంగీతం అందించారు.

 Also Read: Music Shop Murthy: 50 ఏండ్ల వ‌య‌సులో డీజే అవ్వాలని కోరిక .. ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ టీజర్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

MS Dhoni రొమాంటిక్ అవతార్ లో సినిమాల్లోకి ధోని ఎంట్రీ? వీడియో షేర్ చేసిన కరణ్ జోహార్

చిత్రనిర్మాత కరణ్ జోహార్ ఇండియన్ క్రికెటర్ ఎం. ఎస్ ధోని అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే ధోని ఓ కొత్త రొమాంటిక్ అవతార్ లో కనిపించబోతున్నట్లు వీడియో రిలీజ్ చేశారు. దీంతో ధోని హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

New Update
MS DHONI VIDEO

MS DHONI VIDEO

MS Dhoni టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎం. ఎస్ ధోని క్రికెట్ తో పాటు సినిమా రంగంలోకి కూడా అడుగుపెట్టారు. 2023లో  'లెట్స్ గెట్ మ్యారీడ్' అనే సినిమాకు డిస్ట్రిబ్యూటర్ గా పనిచేశారు. అయితే ఇప్పుడు ధోని హీరోగా కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి కారణం బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ షేర్ చేసిన వీడియో.  ధోని ఓ కొత్త రొమాంటిక్ అవతార్ లో కనిపించబోతున్నారు అంటూ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో ధోని హార్ట్  సింబల్ బెలూన్ చేతిలో పట్టుకొని కనిపించారు. దీంతో ఫ్యాన్స్ ధోని హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారా? అని అనుకుంటున్నారు. అంతేకాదు కరణ్ ఈ వీడియోను షేర్ చేయడంతో.. ధోనిని కరణ్ జోహార్ పరిచయం చేయబోతున్నారా అని కామెంట్లు పెడుతున్నారు. కానీ.. ఇంతలోనే అసలు విషయం బయటపడింది.

యాడ్ ఫిల్మ్ షూట్

 ఆ వీడియో ఒక యాడ్ ఫిల్మ్ షూట్ కి సంబంధించినదని తెలిసింది. ఈ వీడియోకి గల్ఫ్ ఆయిల్ కంపెనీని ట్యాగ్ చేయడంతో.. ఇది యాడ్ షూట్ కి సంబంధించిన వీడియో అని అర్థమైంది. ఏదేమైనా మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అయితే గతంలో కూడా ధోని సినిమాల్లో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి. ఇటీవలే రామ్ చరణ్ - బుచ్చిబాబు rc16 లో ధోని క్యామియో ఉన్నట్లు జోరుగా ప్రచారం జరిగింది. కానీ ఆ తర్వాత చిత్రబృందం అలాంటిదేమి లేదని చెప్పడంతో పుకార్లకు ఫుల్ స్టాప్ పడింది.  

ప్రస్తుతం ధోని  CSK కెప్టెన్‌గా గా వ్యవహరిస్తున్నారు. వరుసగా ఐదు మ్యాచుల పరాజయాల తర్వాత.. తాజాగా జరిగిన లక్నో సూపర్ జెయింట్స్‌ వర్సెస్ CSK మ్యాచ్ లి చెన్నై సూపర్ కింగ్స్ అద్భుత విజయం సాధించింది. ఈ విజయంలో ధోని కీలక పాత్ర పోషించడం విశేషం. 

telugu-news | latest-news | ms-dhoni | karan-johar

Advertisment
Advertisment
Advertisment