NIMS: నిమ్స్‌ ఆస్పత్రి కీలక నిర్ణయం.. ఇకనుంచి ఆ చికిత్స ఉచితం

గుండె సిరలు దెబ్బతిన్న పేద రోగులకు ఉచితంగా గుండె కవాటాలను (హార్ట్‌ వాల్వ్‌) అందించేందుకు నిమ్స్‌ ఆస్పత్రి సిద్ధమైంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఆసుపత్రిలో హార్ట్‌ వాల్వ్‌ బ్యాంకును ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. త్వరలోనే దీన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

New Update
NIMS: నిమ్స్‌ ఆస్పత్రి కీలక నిర్ణయం.. ఇకనుంచి ఆ చికిత్స ఉచితం

నిజామ్స్‌ వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్‌).. గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారికి మరింత భరోసా కల్పించే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇలాంటి సమస్యలున్న పేద రోగుల్లో అవసరమైన వారికి ఉచితంగా గుండె కవాటా (హార్ట్‌ వాల్వ్‌)లను అందించేందుకు సిద్ధమైంది. గుండె సిరలు దెబ్బతిన్న వారికి ప్రస్తుతం నిమ్స్ ఆసుపత్రిలో కృత్రిమంగా తయారు చేసిన హార్ట్‌ వాల్వ్‌లను అమరుస్తున్నారు. అయితే దీనికి ఎక్కువ ఖర్చు అవుతుండటంతో పేదలకు పెను భారంగా మారింది. ఈ నేపథ్యంలోనే వారికి ఉచితంగా చికిత్స చేసేందుకు ఆస్పత్రిలో ప్రత్యేకంగా హార్ట్‌ వాల్వ్‌ బ్యాంకును ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే హార్ట్ వాల్వ్‌ బ్యాంకును వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో ప్రారంభించాలని యోచిస్తున్నారు.

Also Read: మరో 2 నెలల్లో కొత్త సార్లు.. కళకళలాడనున్న స్కూళ్లు, కాలేజీలు!

ప్రస్తుతం నిమ్స్‌ ఆస్పత్రి బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ల నుంచి అవయవాలను  సేకరిస్తోంది. మృతుని కుటుంబసభ్యుల అంగీకారం మేరకు కిడ్నీలు, కళ్లు, కాలేయం, గుండె, తదితర కీలక ఆర్గాన్స్‌ను సేకరిస్తోంది. అలాగే బ్రెయిన్ డెడ్‌కు గురైన వాళ్ల నుంచి హార్ట్‌ వాల్వ్‌లను సేకరించి.. వాటిని భద్రపరిచేందుకు ప్రత్యేక విభాగాన్ని (హార్ట్‌ వాల్వ్ బ్యాంకు)ను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ బ్యాంకులో భద్రపరిచిన గుండె కవాటాలను పూర్తిగా ఉచితంగా అందించడం వల్ల.. గుండె సమస్యతో నిమ్స్‌కు వచ్చే రోగులకు చాలావరకు ఖర్చు తగ్గుతుంది.

Also Read: వీర్యదాత, అండం ఇచ్చిన వారికి బిడ్డ పై హక్కు ఉండదు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Madhya Pradesh:క్షమించండి..దొంగతనం చేయాలనుకోలేదు..ఆరు నెలల్లో తిరిగి ఇచ్చేస్తాను..!

మధ్యప్రదేశ్‌ లో ఓ వింత దొంగతనం జరిగింది. అప్పుల వాళ్ల బాధలు భరించలేక దొంగతనం చేశాడు ఓ వ్యక్తి.అంతేకాకుండా తనని క్షమించాలని,ఆరు నెలల్లో ఆ డబ్బును తిరిగి ఇచ్చేస్తానని,లేని పక్షంలో పోలీసులకు పట్టించవచ్చని నిందితుడు ఓ లేఖను కూడా ఉంచాడు.

New Update
money

money

అప్పుల వాళ్ల వేధింపులు భరించలేకపోతున్నానంటూ ఓ బాధితుడు దుకాణంలో చోరీకి పాల్పడ్డాడు.అంతటితో ఆగకుండా..తనను క్షమించాలని,డబ్బును ఆర్నెళ్లలో తిరిగి ఇచ్చేస్తానని టైప్‌ చేసి ఉంచిన లేఖను సైతం వదిలి వెళ్లడం గమనార్హం.మధ్యప్రదేశ్‌ లోని ఖర్గోన్‌ జిల్లాల్లో ఓ వింత వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

Also Read: ఐదు విమానాల్లో అమెరికాకు ఐఫోన్లు.. ట్రంప్ సుంకాలకు అలా షాకిచ్చిన యాపిల్!

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ...స్థానికంగా ఓ దుకాణంలో ఆదివారం అర్థరాత్రి దొంగతనం జరిగింది. నిందితుడు రూ.2.45 లక్షలు ఎత్తుకెళ్లాడు.ఈ విషయాన్ని గురించిన యజమాని...ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకుని వెళ్లాడు. ఈ క్రమంలోనే దర్యాప్తు చేపట్టిన పోలీసులకు దుకాణంలో ఓ లేఖ దొరికింది.

Also Read: TRUMP Tariffs: టారీఫ్‌ల విషయంలో వెనక్కి తగ్గిన ట్రంప్.. ఈ దేశాలపై సుంకాలు రద్దు..!

తాను దొంగతనం చేయాలనుకోలేదని, కానీ ...వేరే మార్గం లేకపోయిందని నిందితుడు అందులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు.నేను పొరుగు ప్రాంతంలోనే ఉంటాను. కొంతకాలంగా అప్పుల వాళ్ల వేధింపులు ఎక్కువ అయ్యాయి. రామనవమి రోజు చోరీకి పాల్పడినందుకు క్షమాపణలు.నేను దొంగతనం చేయాలనుకోలేదు.

కానీ వేరే మార్గం లేకపోయింది. అవసరమైనంత డబ్బే తీసుకున్నాను. ఆరు నెలల్లో తిరిగి ఇచ్చేస్తాను.లేని పక్షంలో పోలీసులకు పట్టించొచ్చు.కానీ ఇప్పుడు మాత్రం ఈ డబ్బు తీసుకుని వెళ్లడం నాకు చాలా ముఖ్యం అని ఆ లేఖలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. దుకాణం యజమాని సైతం బ్యాగులో రూ. 2.84 లక్షలు భద్రపర్చగా..అందులో రూ.2.45 లక్షలు కనిపించడం లేదని చెప్పినట్ఉ తెలుస్తుంది.

నిందితుడ్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Also Read: Sharmila fires on YCP :  ప్రజలు చెప్పుతో కొట్టినా పద్ధతి మారలేదు.. వైసీపీపై షర్మిల సంచలన వ్యాఖ్యలు!

Also Read: Trump's another shock : హెచ్ 1బీ, ఎఫ్1 వీసాదారులు, గ్రీన్ కార్డు దరఖాస్తుదారులకు ట్రంప్ మరో షాక్..! హెల్ప్ డెస్క్ సస్పెండ్

 note | madhya-pradesh | madhya pradesh news | apology | steals money | police | letter | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates

Advertisment
Advertisment
Advertisment