Rain Alert: రాష్ట్రంలో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు..అత్యవసరం అయితేనే బయటకు రండి! ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో రానున్న ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.దీంతో రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశాలున్నట్లు వివరించారు. By Bhavana 16 Aug 2024 in Latest News In Telugu ఆదిలాబాద్ New Update షేర్ చేయండి Rain Alert: ఆవర్తనం...ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో రానున్న ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శుక్రవారం , శనివారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు తెలిపింది. శుక్రవారం మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణ పేట,ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది రేపు వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వివరించింది. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశాలున్నట్లు అధికారులు వివరించారు. ప్రజలు అవసరమైతే తప్ప బయటికి రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. Also Read: హార్ధిక్ పాండ్యా జాస్మిన్ వాలియాతో డేటింగ్ రూమర్లు..! #telangana #alert #rains సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి