Floods : ముంచెత్తిన వరదలు... 20 మంది మృతి!

నేపాల్ ను వరదలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాల కారణంగా కొండ చరియలు విరిగి పడటంతో పాటు, పిడుగులు పడటం వల్ల 20 మంది చనిపోయారు.కొండచరియలు విరిగిపడటంతో 3 ఇళ్లు వరదలల్లో కొట్టుపోగా...ఆ ఇళ్లలో ఇద్దరు చిన్నారులతో పాటు 4 గురు మరణించారని జిల్లా అధికారులు ప్రకటించారు.

New Update
Floods : ముంచెత్తిన వరదలు... 20 మంది మృతి!

Floods In Nepal : నేపాల్ (Nepal) ను వరదలు (Floods) ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాల (Heavy Rains) కారణంగా కొండ చరియలు విరిగి పడటంతో పాటు, పిడుగులు పడటం వల్ల 20 మంది చనిపోయారు. ఖాట్మండుకు పశ్చిమాన 125 కి.మీ దూరంలో ఉన్న లామ్‌ జంగ్‌ జిల్లాలో రాత్రిపూట కొండచరియలు విరిగిపడటంతో 3 ఇళ్లు వరదలల్లో కొట్టుపోగా... ఆ ఇళ్లలో ఇద్దరు చిన్నారులతో పాటు 4 గురు మరణించారని జిల్లా అధికారులు ప్రకటించారు.

రెండు రోజుల నుంచి పిడుగుపాటుకు మరో తొమ్మిది మంది మరణించారని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు 20 మంది చనిపోయినట్లుగా వెల్లడించారు. నేపాల్‌ కి ఆగ్నేయంగా 500 కి.మీ దూరంలో ఉన్న మోరాంగ్‌ జిల్లాలో మంగళవారం వరదలు కారణంగా నలుగురు ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు.

మరో పక్క కొండచరియలు విరిగిపడటంతో మరో ముగ్గురు మరణించారు. సహాయక సిబ్బంది రంగంలోకి దిగి చర్యలు చేపట్టాయి.

Also read: టార్గెట్ ఏవీ సుబ్బారెడ్డి.. అఖిల ప్రియ నెక్ట్స్ స్టెప్ ఇదేనా?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

TG crime : నీకు తక్కువ జీతం పిల్లనివ్వమని ఒకరు.. సంబంధం కుదరడం లేదని మరోకరు.!

ఇద్దరు బాగా చదువుకున్నారు. జీవతంలో బాగా స్థిరపడిపోయారు.  కానీ పెళ్లి కావడం లేదన్న బాధతో తమ జీవితానికి స్వస్తి పలికారు. వేరువేరు ప్రాంతాల్లో చోటుచేసుకున్న ఈ ఘటనలు కన్నవాళ్లకు కన్నీళ్లు మగిల్చాయి.

New Update
pelli

pelli

ఇద్దరు బాగా చదువుకున్నారు. జీవతంలో బాగా స్థిరపడిపోయారు.  కానీ పెళ్లి కావడం లేదన్న బాధతో తమ జీవితానికి స్వస్తి పలికారు. వేరువేరు ప్రాంతాల్లో చోటుచేసుకున్న ఈ ఘటనలు కన్నవాళ్లకు కన్నీళ్లు మగిల్చాయి. ఇక వివరాల్లోకి వెళ్తే..   వరంగల్‌ జిల్లా దుగ్గొండి మండలం వెంకటాపురానికి చెందిన వేణు(30) బీటెక్‌ కంప్లీట్ చేశాడు. హైదరాబాద్‌లో ఓ కంపెనీలో తక్కువ జీతానికి జాబ్ చేస్తున్నాడు. వేణుకు తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూడగా తక్కువ జీతం  అని పెళ్లి కూతురు తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదు. దీంతో తీవ్ర మనస్థాపానికి చెందిన వేణు ఇంట్లో ఎవరూ లేని టైమ్ లో ఇంట్లో ఉరేసుకున్నాడు. చేతికందొచ్చిన కొడుకు ఆత్మహత్యక పాల్పడడంతో వేణు తల్లిదండ్రులురాజేశ్వర్‌రావు, పద్మ దంపతులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

Also read :  అలా చేస్తే ఆస్పత్రుల లైసెన్స్ రద్దు.. సుప్రీంకోర్టు కీలక వార్నింగ్!

Also read :  మా హనీమూన్ అక్కడే.. పెళ్లి తర్వాత అఘోరి, వర్షిణీ జంట సంచలన వీడియో!

పెళ్లి కావట్లేదని ఏఆర్ మహిళా కానిస్టేబుల్ సూసైడ్ 

మరోవైపు జనగామ జిల్లాలో పెళ్లి కావట్లేదని-- ఏఆర్ మహిళా కానిస్టేబుల్ సూసైడ్ చేసుకుంది. వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో ఆర్మ్‌డ్ రిజర్వ్‌గా విధులు నిర్వహిస్తున్న నీలిమ ఇంట్లో ఉరేసుకుని చనిపోయింది. పెళ్లి సంబంధం కుదరడం లేదన్న మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడింది. కొడకండ్ల మండలం నీలిబండ తండాకు చెందిన నీలిమ  2020 బ్యాచ్‌. ప్రస్తుతం వరంగల్ కమిషనరేట్‌లో ఏఆర్ కానిస్టేబుల్ గా పనిచేస్తోంది. ఆమె ఉద్యోగంలో చేరినప్పటినుంచి క్రమశిక్షణగా పనిచేస్తుండేది. అందరితోనూ స్నేహంగా నడుచుకునేంది. అయితే ఆదివారం రోజు తన నివాసంలో ఆత్మహత్య చేసుకుంది.  కొడకండ్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

Also read : ఎక్కువ చేయొద్దు.. ఎంపీ చామలకు సీఎం రేవంత్ క్లాస్.. ఆ ఎమ్మెల్యేలకు కూడా..!.

Also read :  మహిళా కానిస్టేబుల్ సూసైడ్‌లో బిగ్ ట్విస్ట్.. డైరీలో బయటపడ్డ సంచలనాలు!

Advertisment
Advertisment
Advertisment