Manchirial Crime: చెరువులో దూకి ప్రాణాలు తీసుకున్న గురుకుల టీచర్.. వాయిస్ రికార్డులో వారి పేర్లు?

ఈ మధ్య గురుకులంలో ఊహించని ఘటనలు జరుగుతున్నాయి. ఒక ఘటన మరువకముందే.. మరొక ఘటన వెలుగులోకి వస్తోంది. విధి నిర్వహణలో సమస్యలు వస్తే అండగా నిలవాల్సిన తోటి టిచర్లు రాక్షసుల మారుతున్నారు. ఓ మహిళా ప్రిన్సిపల్‌ తోడు ఉండకపోగా.. పనిగట్టుకొని సమస్యలు సృష్టించారు. ఆపై ఆమెను సూటిపోటి మాటలతో బాధించి చివరకు ప్రాణం తీసేలా చేశారు. సహచరుల తీరుతో తీవ్ర ఆవేదనకు గురైన ఆ టీచర్‌ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది.

New Update
Manchirial Crime: చెరువులో దూకి ప్రాణాలు తీసుకున్న గురుకుల టీచర్.. వాయిస్ రికార్డులో వారి పేర్లు?

మంచిర్యాల జిల్లా చెన్నూరులో విషాదం చోటుచేసుకుంది. పెద్ద చెరువులో దూకి గురుకులంలో జూనియర్‌ లెక్చరర్ తిరుమలేశ్వరి ఆత్మహత్య చేసుకుంది. ప్రిన్సిపల్‌ వేధింపుల వల్లే తాను చనిపోతున్నట్టు వాయిస్‌ రికార్డ్ చేయడం కలకలం సృష్టిస్తోంది. గురుకులంలో సిబ్బంది వేధింపులు భరించలేకే తిరుమలేశ్వరి చనిపోయిందని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. వివరాళ్లోకి వెళ్తే.. మృతురాలు తిరుమలేశ్వరి(35) ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. అయితే తన చావుకు ప్రిన్సిపల్‌, తోటి ఉపాధ్యాయురాళ్ల వేధింపులే కారణమని వాయిస్‌ రికార్డులో పేర్కొన్నారు. తిరుమలేశ్వరి స్వగ్రామం మంచిర్యాల జిల్లా నస్పూర్‌ గ్రామం.. ఆమెకు భర్త సంపత్‌, కూతురు ఉన్నారు. కరీంనగర్‌ జిల్లాలోని గురుకుల పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఆమె నాలుగేళ్ల క్రితం డిప్యుటేషన్‌పై చెన్నూరు గురుకుల పాఠశాలకు వచ్చింది. భర్త సందీప్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గురుకుల పాఠశాలలో జరుగుతున్న జోనల్‌స్థాయి ఆటల పోటీల్లో పాల్గొంటున్న 1275 మంది క్రీడాకారులు, మరో సహాయ సిబ్బందికి సంబంధించి భోజన ఏర్పాట్ల బాధ్యతలను తిరుమలేశ్వరికి అప్పగించారు.

అయితే.. ఏర్పాట్లలో ఆమెకు సహాయంగా ఉండేందుకు కమిటీలోని మరో పది మందిని నియమించగా.. గత 4 రోజులుగా తిరుమలేశ్వరి ఈ బాధ్యతల్లో ఉన్నారు. పని విషయంతో ఆమెకు కమిటీ సభ్యుల్లో ఏ ఒక్కరూ సహకరించలేదు. భోజన ఏర్పాట్ల బాధ్యతను చూసుకోవటంలో తిరుమలేశ్వరి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తనకు సహకరించాల్సిందిగా కమిటీలోని సభ్యులను అడిగినా.. వారు ససేమిరా అన్నారు. నిన్న టిఫిన్‌, భోజనం ఆలస్యం కావటంతో అందరూ తిరుమలేశ్వరినే తప్పుబట్టారు. విధి నిర్వహణలో భాగంగా భర్త సంపత్‌ తిరుమలేశ్వరిని గురుకులంలో దింపి వెళ్లాడు.. గంట తర్వాత భర్త ఫోన్‌ చేయగా ఆమె లిఫ్ట్‌ చేయలేదు. వరుసగా ఫోన్‌ చేశాడు. అప్పుడే ఓ వ్యక్తి లిఫ్ట్‌ చేసి పెద్ద చెరువు కట్టపై బ్యాగు ఉందని చెప్పాడు. ఫోన్‌ మోగడంతో లిఫ్ట్‌ చేశానని చెప్పాడు. సంపత్‌ వెంటనే చెరువు కట్ట దగ్గరకు వెళ్లగా.. అప్పటికే తిరుమలేశ్వరి చెరువులో దూకినట్లు గుర్తించారు. జాలర్ల సహాయంతో చెరువులో గాలించగా తిరుమలేశ్వరి మృతదేహం లభ్యమైంది.

ఆ ఐదుగురుపై కేసు నమోదు

గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ రాజమణి, పీఈటీలు రేష్మ, శిరీష, పుష్పలత, అసిస్టెంట్‌ కేర్‌ టేకర్‌ స్రవంతి వేధించడం వల్లే తన భార్య తిరుమలేశ్వరి ఆత్మహత్య చేసుకుందంటూ భర్త సంపత్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భోజనాల ఏర్పాట్ల రూపంలో అదనపు బాధ్యతలు అప్పగించి.. తనకు సహకరించకపోగా సూటిపోటి మాటలతో ఇబ్బందులకు గురిచేస్తున్నారని పేర్కొన్నాడు. మృతురాలి ఫోన్‌లో ప్రిన్సిపల్‌ సహా.. మరో ఐదుగురి వేధింపులపై వాయిస్‌ రికార్డు ఉందని సీఐ వాసుదేవరావు వెల్లడించారు.

ఇది కూడా చదవండి:  అత్యాధునిక పరికరాలతో ఏటీఎం దొంగతనాలు.. ముఠా ఆట కట్టించిన తిరుపతి పోలీసులు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

🔴Live News Updates: కాల్పులు ప్రారంభించిన పాకిస్తాన్..

Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!

author-image
By Lok Prakash
New Update
Live News Updates in Telugu

Live News Updates

🔴Live News Updates: 

Hyderabad Metro: వివాదంలో  హైదరాబాద్ మెట్రో రైలు యాజమాన్యం

హైదరాబాద్ మెట్రో రైళ్లలో బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్లపై హైకోర్టు సీరియస్ అయింది. ఈ వ్యవహారంలో హెచ్‌ఎంఆర్‌ఎల్ ఎండీకి నోటీసులు జారీ చేసింది. బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్లకు సంబంధించిన వివరాలతో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.

Hyderabad metro
Hyderabad metro

 

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో రైల్..  వివాదంలో చిక్కుకుంది. హైదరాబాద్ మెట్లో రై ళ్లలో యథేచ్ఛగా జరుగుతున్న బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్లపై తెలంగాణ హైకోర్టు సీరియస్‌ అయ్యింది. ఈ వ్యవహారంలో హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్‌ ఎన్వీఎస్ రెడ్డికి  నోటీసులు జారీ చేసింది. బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్లకు సంబంధించిన సమగ్ర వివరాలతో కౌంటర్ అఫిడవిట్‌ను తక్షణమే దాఖలు చేయాలని ఆదేశించింది. 

Also Read: Air india:పహల్గాం ఉగ్రదాడి...కీలక ప్రకటన చేసిన ఇండిగో,ఎయిర్‌ ఇండియా!

మెట్రో రైళ్లలో చట్టవిరుద్ధంగా బెట్టింగ్ యాప్‌లను ప్రోత్సహిస్తున్నారని ఆరోపిస్తూ.. హైకోర్టులో అడ్వకేట్ నాగూర్ బాబు ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. రోజుకు సుమారు 5 లక్షల మంది ప్రయాణించే మెట్రో రైలులో నిబంధనలను ఖతారు చేయకుండా అధికారులు ఎలా బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్లకు అనుమతులు ఇస్తారని ఆయన ప్రశ్నించారు. ఇది యువతను తప్పుదారిలోకి మళ్లించే ప్రమాదం ఉందని అన్నారు.

Also Read: Ind-Pak: సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసిన పాక్..అసలేంటీ ఒప్పందం..భారత్ మీద ఇంపాక్ట్ ఎలా?

మరోవైపు.. తెలంగాణ గేమింగ్ యాక్ట్ 2017 స్పష్టంగా అమల్లో ఉన్నప్పటికీ, HMRL తో పాటు దాని  అనుబంధ సంస్థలు కూడా ఈ చట్టాన్ని ఉల్లంఘించి ఇల్లీగల్ బెట్టింగ్ యాప్‌లను ప్రోత్సహించడానికి భారీగా ముడుపులు అందుకున్నారని పిటిషన్‌లో ఆరోపించారు. ఈ అక్రమ లావాదేవీలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చేత సమగ్ర విచారణ జరిపించాలని ఆయన కోరారు. ఈ కుంభకోణంలో ఎంత మంది అధికారులు, ప్రైవేట్ వ్యక్తులు లాభం పొందారో తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ పిటిషన్‌పై గురువారం  తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి కీలక విచారణ చేపట్టారు. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు విన్న అనంతరం, ప్రతివాదులైన HMRL ఎండీకి నోటీసులు జారీ చేశారు. పూర్తి ఆధారాలు, వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేశారు. దీంతో ఈ కేసులో రానున్న రోజుల్లో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నట్లు న్యాయ నిపుణులు అంటున్నారు. హైకోర్టు ఈ వ్యవహారాన్ని ఎంత సీరియస్‌గా తీసుకుంటుందో చూడాల్సి ఉంది. ఒకవేళ ఇది HMRL నిర్లక్ష్యం తేలితే కఠిన చర్యలు తప్పకపోవచ్చని తెలుస్తోంది.

Also Read:RCB Vs RR: దుమ్ము దులిపేసిన కోహ్లీ, పడిక్కల్.. ఆర్సీబీ భారీ స్కోర్ - రాజస్థాన్ టార్గెట్ ఇదే

Also Read: All-party Meeting: ముగిసిన ఆల్ పార్టీ మీటింగ్.. కశ్మీర్‌లో రాహుల్ గాంధీ పర్యటన

  • Apr 25, 2025 08:23 IST

    BIG Breaking: కాల్పులు ప్రారంభించిన పాకిస్తాన్..

    బోర్డర్ దగ్గర పాకిస్తాన్ అప్పుడే కాల్పులను ప్రారంభించేసింది. నిన్న రాత్రి కూడా పలు చోట్ల కాల్పులు జరిపిన  దాయాది దేశం ఈరోజు ఉదయం నుంచి మరింత వేగం పెంచింది. అయితే దీనిపై ఇంకా అధికారికంగా ప్రకటన మాత్రం రాలేదు. 

    india
    Pakistan Started Firing

     



  • Apr 25, 2025 07:45 IST

    TTD: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్‌.. ఇకపై ఉచితంగానే..!

    తిరుమల శ్రీవారి భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. అన్నమయ్య సంకీర్తనలను యూట్యూబ్ ద్వారా ప్రజలకు అందించాలని ఈవో జె. శ్యామలరావు అధికారులను ఆదేశించారు. వేసవిలో భక్తులకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు

    Tirumala Tirupati Devasthanams .
    Tirumala Tirupati Devasthanams .

     



  • Apr 25, 2025 07:44 IST

    Retro Pre Release: సూర్యా 'రెట్రో' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో.. ఎవరో తెలుసా?

    సూర్యా నటించిన 'రెట్రో' సినిమా మే 1న విడుదలకు సిద్ధమవుతోంది. తమిళ్,తెలుగు వర్షన్లకు ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. విజయ్ దేవరకొండతో ప్రీ-రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా రానుండటం తో సినిమాపై హైప్ పెరిగిపోయింది.

    Retro Pre Release
    Retro Pre Release

     



  • Apr 25, 2025 06:51 IST

    RCB VS RR: హుర్రే..ఓన్ గ్రౌండ్ లో ఆర్సీబీ గెలిచింది..ఆరఆర్ పై విక్టరీ

    మొత్తానికి సొంతగడ్డపై బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మ్యాచ్ గెలిచింది. ఐపీఎల్ 18 సీజన్ లో బెంగళూరు చినస్వామి స్టేడియంలో ఆర్సీబీ గెలవడం ఇదే మొదటిసారి. రాజస్థాన్ రాయల్స్ మీద ఆర్సీబీ 11 పరుగులు తేడాతో విజయం సాధించింది. 

    ipl
    RCB VS RR

     



  • Apr 25, 2025 06:50 IST

    Ind-Pak: భారత్-పాక్ యుద్ధమే జరిగితే గెలుపెవరిది? ఎవరి బలం ఎంతుంది?

    కాశ్మీర్ ఉగ్రదాడి భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలకు దారి తీసింది.అపార నష్టంతో కుమిలిపోతున్న మనం రగిలిపోతుంటే..పాకిస్తాన్ మాత్రం పొగరుతో కాలు దువ్వుతోంది. యుద్ధం తప్పదనే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకవేళ అదే కనుక జరిగితే గెలుపెవరిది?ఎవరి బలం ఎంతుంది?

    Indian Army
    Indian Army

     



  • Apr 25, 2025 06:50 IST

    Air india: పహల్గాం ఉగ్రదాడి... కీలక ప్రకటన చేసిన ఇండిగో,ఎయిర్‌ ఇండియా!

    టాటా గ్రూపునకు చెందిన విమానయాన సంస్థ ఎయిరిండియా కీలక ప్రకటన చేసింది.భారత్‌కు చెందిన విమానాలకు పాక్‌ తమ గగన తలాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ఇక పై ప్రత్యామ్నాయ మార్గంలో విమానాలు నడపనున్నట్లు వెల్లడించింది.

    Air India
    Air India

     



Advertisment
Advertisment
Advertisment