Google : గూగుల్‌లో 1.2 కోట్ల ఖాతాల తొలగింపు.. ఏఐ మోసగాళ్ళకు చెక్

యాడ్స్‌ పేరుతో మోసాలకు పాల్పడుతున్న వారికి గూగుల్ చెక్ పెట్టింది. భారత దేశంలో మొత్తం 1.2 ఖాతాలను తొలగించింది. ఏఐ టెక్నాలజీతో యాడ్స్ చేస్తూ మోసాలు చేస్తున్న వారి అకౌంట్లన్నీ ఇక మీదట తొలగిస్తామని చెప్పింది.

New Update
Google : గూగుల్‌లో 1.2 కోట్ల ఖాతాల తొలగింపు.. ఏఐ మోసగాళ్ళకు చెక్

Google Ads : యాడ్స్ పేరుతో మోసాలు చేస్తున్న వారి మీద కఠిన చర్యలు తీసుకుంది గూగుల్. తమ అడ్వర్టైజింగ్ పాలసీలకు వ్యతిరేకంగా ప్రకటనలు చూపిస్తున్న ఖాతాలన్నింటినీ సీజ్ చేసేసింది. ఇండియాలో మొత్తం 1.2 కోట్ల అకౌంట్లను బ్లాక్ చేసింది. తొలగించిన ఖాతాలన్నింటిలో మాల్వేర్, డీప్‌ఫేక్‌ కంటెంట్‌(Deep Fake Content) లు ఉన్నాయని చెబుతోంది గూగుల్(Google). వీటి మీద తమకు బోలెడు నివేదికలు వచ్చాయని... వాటిన ఇపరిశీలించాకనే తొలగించామని ప్రకటించింది.

ఏఐతో సవాళ్ళు...

ఇప్పుడు ఎక్కడ చూసినా ఏఐ టెక్నాలజీ(AI Technology) నే కనిపిస్తోంది. దీన్ని సవ్యంగా వాడుతున్న వారి కంటే చెత్త పనులకు వాడుతున్నవారే ఎక్కువ అయిపోతున్నారు. ఏఐ ఉపయోగించి డీప్‌ఫేక్‌ వీడియోల తయారీ కూడా బాగా పెరిగిపోయింది. ఇలాంటి వాటిని అరికట్టేందుకే గూగుల్ చర్యలను ప్రారంభించింది. స్కామ్ ప్రకటనలు చేస్తూ వినియోగదారుల భద్రత, గోప్యతలతో ఆడుకుంటున్నారని..తాము ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయమని చెబుతోంది. స్కామ్ ప్రకటనల మీద గూగుల్ పోరాటం కొనసాగుతుందని తెలిపింది.

ఎన్నికల ప్రకటనలు...

ప్రస్తుతం ఇండియా(India) లో ఎన్నికల హడావుడి నడుస్తోంది. దీనికి సంబంధించి రోజులో ఎన్నో ప్రకటనలు వస్తున్నాయి. ఇలాంటి వాటన్నింటి మీద గూగుల్ దృష్టి పెట్టింది. ఎన్నికల ప్రకటనల్లో ఎక్కడా ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూసేందుకు ఏర్పాట్లు చేసింది. ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా పని చేస్తున్నామని తెలిపింది. 2023లో కంటే 2024లో ఎక్కువ ప్రకటనలు వస్తున్నాయని... వీటిలో దృవీకరణ కాని వాటిని తొలగిస్తున్నారు. ప్రస్తుతం 5000 కంటే ఎక్కువ ప్రకటనలు గూగుల్ ధృవీకరించింది. కానీ 7.3 మిలియన్ కంటే ఎక్కువ ప్రకటనలను తీసివేసింది. అయితే ఏఐ కారణంగా ఇది పెద్ద సవాల్‌గా మారుతోందని చెబుతోంది.

Also Read : Elections 2024 : రెండో దశకు టైమైంది..నేటి నుంచే నామినేషన్ల స్వీకరణ

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Vontimitta Temple: ఒంటిమిట్టలో రాములోరి కళ్యాణం.. ఏర్పాట్లు ఎలా ఉన్నాయంటే....

ఒంటిమిట్ట కోదండ రామస్వామి బ్రహ్మోత్స వాల్లో భాగంగా ఈనెల 11న జరిగే శ్రీరాముల కళ్యాణోత్సవానికి రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు విచ్చేయనున్న నేపథ్యంలో రాష్ట్ర మంత్రులు కడప జిల్లాఒంటిమిట్ట శ్రీరాముల కళ్యాణోత్సవం ఏర్పాట్లపై సమీక్షచేశారు.

New Update
Vontimitta Temple

Vontimitta Temple

Vontimitta Temple : ఒంటిమిట్ట కోదండ రామస్వామి బ్రహ్మోత్స వాల్లో భాగంగా ఈనెల 11న జరిగే శ్రీరాముల కళ్యాణోత్సవానికి రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు విచ్చేయనున్న నేపథ్యంలో రాష్ట్ర మంత్రులు ఒంటిమిట్టలో పర్యటించారు… కడప జిల్లాఒంటిమిట్ట శ్రీరాముల కళ్యాణోత్సవం ఏర్పాట్లపై మంత్రుల బృందం సోమవారం ఆరా తీశారు. దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నేతృత్వంలో మంత్రుల బృందం రోడ్డు రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత, ఎమ్మెల్సీ బి.రాంగోపాల్ రెడ్డి, కలెక్టర్ చామకూరి శ్రీధర్ లు పాల్గొన్నారు. వీరికి అర్చకులు టీటీడీ అధికారులు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికినారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఒంటి మిట్ట శ్రీరాముల కళ్యాణ మహోత్సవం ఏర్పాట్లు, ఆలయం వద్ద ఏర్పాట్లను మంత్రుల బృందం సమీక్షించి పరిశీలించారు.

Also Read: Vijay- Rashmika: ఒకేచోట విడివిడిగా ఫొటోలు.. ఇంకెన్ని రోజులు కొండన్న ఈ దాగుడు మూతలు!

దేవాదాయ శాఖామంత్రి ఆనం రామనారాయణ రెడ్డి.. దేవస్థానం సమీపంలోని శ్రీకోదండరామ స్వామి కల్యాణ వేదిక చేరుకుని అనంతరం అక్కడ జరుగుతున్న  ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించి.. కల్యాణ వేదిక, గ్యాలరీలు, రోడ్లు, బారికేడ్లు, పార్కింగ్, విద్యుత్, ఇతర క్లినింగ్ వంటి పనులపై అధికారులకు దిశానిర్దేశం చేసి సలహాలు, సూచనలు ఇచ్చినారు.. ఈ సందర్భంగా మంత్రి రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ… శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 11వ తేదీన సీతారాముల కల్యాణం మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగనుందని, అందుకు సంబంధించి ఇప్పటికే దాదాపు అన్ని పనులు పూర్తి చేయడం జరిగిందన్నారు. అందులో భాగంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు, అసౌకర్యం లేకుండా జిల్లా అధికారులు, టీటీడీ అధికారులు సంయుక్తంగా, సమన్వయంతో పనిచేసి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని మంత్రులు కోరారు.

Also Read: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. HCU విద్యార్థులకు ఊరట

 ముఖ్యంగా రాష్ట్రంలోని ప్రతి ఆలయంలో.. ఆగమ శాస్త్ర ప్రకారం, శాస్త్రోక్తంగా పూజా కైంకర్యాలు నిర్వహించడం జరుగుతోందన్నారు. ప్రతి ఆలయంలో ప్రతి రోజూ దీప దీప నైవేద్యాలు నిరంతరాయంగా జరిగేలా చర్యలు తీసుకోవడం జరుగుతోందన్నారు. అందుకే.. ప్రతి ఆలయంలో  దేదీప్యమానంగా పూజలు అందుతున్నాయన్నారు మంత్రి ఆనం.. 12 కెటగిరీలకు చెందిన 121 గ్యాలరీలలోకి వచ్చే దాదాపు 80 వేల మంది భక్తులకు సంతృప్తికరంగా 47,770 ప్యాకెట్ల అన్న ప్రసాదాలు మంచి అంద  చేయడం జరిగిందన్నారు. ప్రజా భద్రత  కోసం సుమారు 150 కి పైగా సిసి కెమెరాల నిఘా, డ్రోన్ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే కడప, రాజంపేట వైపు నుంచే ఆర్టీసీ బస్సులకు పార్కింగ్, అలాగే ఇతర జిల్లాలనుంచి ఎన్ని బస్సులు వస్తున్నాయో తెలుసుకుని పక్కాగా ప్లాన్ రూపొందించుకుని పార్కింగ్ ఏర్పాట్లు చేసుకోవడం జరిగిందన్నారు. ఒకవేళ పార్కింగ్ దూరంగా ఉంటే అక్కడి నుంచి కళ్యాణవేదిక వద్దకు భక్తులను తీసుకువచ్చేందుకు ఉచిత బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వాహనాల పార్కింగ్ వద్ద టోయింగ్ వాహనాలను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.

Also read :  మరికొన్ని రోజుల్లో పెళ్లి... కాబోయే భర్త కళ్లముందే యువతి మృతి!

Advertisment
Advertisment
Advertisment