Telangana Rains: తెలంగాణకు చల్లటి కబురు.. రేపటి నుంచి వానలే వానలు!

ఎండలతో ఉక్కురిబిక్కిరి అవుతున్న తెలంగాణ ప్రజలకు చల్లని కబురు చెప్పింది వాతావరణ శాఖ. రేపటి నుంచి 5 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. ద్రోణి ప్రభావంతో పలు జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు అధికారులు.

New Update
Telangana Rains: తెలంగాణకు చల్లటి కబురు.. రేపటి నుంచి వానలే వానలు!

Rain Alert to Telangana: గత కొన్ని రోజులుగా తెలంగాణలో ఎండల తీవ్రత విపరీతంగా పెరిగిన విషయం తెలిసిందే. ప్రతీరోజు భానుడు భగభగ మండుతూ నిప్పులు కురిపిస్తున్నాడు. ఉదయం 7 తర్వాత ఇంటి నుంచి బయటకు రావడానికి ప్రజలు భయపడుతున్నారు. తీవ్రమైన వేడి, వడగాలులతో ప్రజలు అల్లాడుతున్న ఈ సమయంలో తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం చల్లటి కబురు చెప్పింది. పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది.

పిడుగులతో కూడిన వర్షాలు:

రాబోయే మూడు రోజులు రెయిన్ అలర్ట్‌ను జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. రేపు రాష్ట్రంలో భారీ వర్షం పడే అవకాశం ఉందని తెలిపారు. ద్రోణి ప్రభావంతో ఈదురు గాలులతో కూడిన.. అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. 10వ తేదీ వరకూ వర్ష సూచన ఉంటుందన్నారు. వరంగల్, హనుమకొండ, నల్గొండ, మహబూబాబాద్, జనగాం, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.

క్యుములోనింబస్ మేఘాల వల్ల ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు, దక్షిణ జిల్లాలు, ఈశాన్య జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడే అవకాశం ఉందన్నారు అధికారులు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఆరెంజ్ అలర్ట్, పలు జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. తెలంగాణలో నిన్న 47 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు, జగిత్యాల జిల్లా వెల్గటూర్‌లో అత్యధికంగా 47.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యాయి.

ఇది కూడా చదవండి:  వాల్‌నట్‌తో ఇంట్లోనే ఫేస్ స్క్రబ్‌ను ఇలా తయారు చేసుకోండి.. తేడా గమనించండి!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

SRH VS PBKS: వాట్ ఏ కమ్ బ్యాక్..ఎస్ఆర్హెచ్ దుమ్ము దులిపేసింది మామా..

ఐపీఎల్ 2025లో ఈరోజు అద్భుతమైన మ్యాచ్ జరిగింది. హైదరాబాద్ ఉప్పల్ లో ఈరోజు పంజాబ్ కింగ్స్, హైదరాబాద్ సన్ రైజర్స్ నువ్వా నేనా అన్నట్టు ఆడారు. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 246 పరుగుల టార్గెట్ ఇస్తే దాన్ని ఎనిమిది వికెట్ల తేడాతో ఛేదించింది. 

author-image
By Manogna alamuru
New Update
ipl

SRK VS PBKS

హైదరాబాద్ సన్ రైజర్స్ అద్భుతమైన కమ్ బ్యాక్ ఇచ్చింది. ఐదు మ్యాచ్ లు ఓడిపోయిన తర్వాత ఈరోజు పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ చితక్కొట్టేసింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ లు విజృంభించి ఆడేశారు. పజాబ్ కింగ్స్ ఇచ్చిన 246 పరుగుల భారీ టార్గెట్ ను 8 వికెట్ల తేడాతో సునాయాసంగా ఛేదించింది. ఓపెనర్లు అభిషేక్ వర్మ 141 పరుగులు, ట్రావిస్ హెడ్ 66 పరుగులతో ఇరగదీసారు. ఇద్దరూ కలిసి మ్యాచ్ ను గెలిపించేశారు. 150 పరుగుల ముందు అభిషేక్ వర్మ వికెట్ కోల్పోవడం కొంత నిరాశ కలిగించినా...అతను ఈరోజు ఆడిన తీరుతో ఉప్పల్ స్టేడియం మొత్తాన్ని ఉర్రూతలూగించాడు. అభిషేక్ శర్మ ఏకంగా 10 సెక్స్లతో చెలరేగిపోయాడు.  అతను కొట్టిన బంతులను గ్రౌండ్ స్టాఫ్ వెతుక్కోవడంతోనే సరిపోయింది.  

పంజాబ్ కూడా దుమ్మ రేపింది..

అంతకు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు చెలరేగిపోయింది. తొలి ఇన్నింగ్స్ చేసి కింగ్స్ జట్టు నిర్దేశించిన 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 245 పరుగులు సాధించింది. దీంతో SRH ముందు 246 భారీ టార్గెట్ ఉంది. హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో ఈ మ్యాచ్ జరుగుతోంది. మొదట టాస్ గెలిచిన పంజాబ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్స్‌గా క్రీజులోకి ప్రభ్‌మన్ సింగ్‌, ప్రియాంశ్‌ ఆర్య మొదటి నుంచి దంచి కొట్టారు. బాల్‌ టు బాల్ ఫోర్లు, సిక్సర్లతో దుమ్ము దులిపేశారు. ఉప్పల్ స్టేడియంలో పరుగుల వరద పెట్టించారు. సన్ రైజర్స్ జట్టు బౌలర్లకు చెమటలు తెప్పించారు. ఇక హర్షల్‌ పటేల్‌ బౌలింగ్‌లో (3.6) ప్రియాంశ్‌ ఆర్య (36) నితీశ్‌ రెడ్డికి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.  ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన శ్రేయస్ అయ్యార్ దుమ్ము దులిపేశాడు. పరుగులు రాబడుతూ అదరగొట్టేశాడు. ఫోర్లు, సిక్సర్లతో కెవ్ కేక అనిపించాడు. అతడు 36 బంతుల్లో 82 పరుగులు చేసి ఔటయ్యాడు. అలాగే వధేరా 22 బంతుల్లో 27 పరుగులు, శశాంక్ సింగ్ 3 బంతుల్లో 2 పరుగులు, మాక్స్‌వెల్ 7 బంతుల్లో 3 పరుగులు, స్టొయినీస్ 11 బంతుల్లో 34 పరుగులు చేశారు. 

 today-latest-news-in-telugu | IPL 2025 | srh-vs-pbks

Also Read:  USA: యాపిల్ కు అండగా ట్రంప్..సుంకాల నుంచి ఫోన్లు, కంప్యూటర్లు మినహాయింపు

Advertisment
Advertisment
Advertisment