Unwanted Hair Pack: ఈ ప్యాక్‌తో అవాంఛిత రోమాలు మాయం

ప్రతి ఒక్కరు ముఖంపై అవాంఛిత రోమాలు ఎక్కువగా ఉన్నాయని బాధపడుతూ ఉంటారు. మహిళల విషయంలో అయితే చెప్పనవసరం లేదు. ఇంట్లో అరటిపండు, బొప్పాయి గుజ్జు-ప‌సుపు, నిమ్మకాయ రసం-షుగర్‌ వంటి ఫేస్‌ ప్యాక్‌ వేసుకుంటే అవాంఛిత రోమాలు పోతాయి.

New Update
Unwanted Hair Pack: ఈ ప్యాక్‌తో అవాంఛిత రోమాలు మాయం

Unwanted Hair Pack: మానవ శరీరంలో హార్మోన్ల అసమతుల్యత వల్ల ఇలా అవాంఛిత రోమాలు వస్తాయని నిపుణులు అంటున్నారు. ముఖం ఎంత తెల్లగా ఉన్నా ఇలా వెంట్రుకల వల్ల అందం అంతా పోతుంది. కొందరు ఈ సమస్యను గట్టెక్కేందుకు లేజర్‌ చికిత్సను ఆశ్రయిస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఫలితం బాగానే ఉన్నా చాలా ఖర్చు అవుతుంది. ఎలాంటి ఖర్చు లేకుండా ఇంట్లోనే సులభంగా అవాంఛిత రోమాలను నివారించే చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఫేస్‌ప్యాక్‌ వల్ల ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉండదు
మనకు ఇంట్లో అందుబాటులో ఉన్నవాటితో ఫేస్‌ ప్యాక్‌ చేసుకుని వాడుకోవచ్చంటున్నారు నిపుణులు. అంతేకాకుండా చాలా సులువుగా తయారు చేసుకోవచ్చని చెబుతున్నారు. ఫేస్‌ప్యాక్‌ వల్ల ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌, స్కిన్‌కు కూడా హాని జరగదని అంటున్నారు. ఇలా శరీరంపై అవాంఛిత రోమాలు ఉంటే ఓట్స్‌ను వాడి తగ్గించుకోవచ్చు. గిన్నెలో 2 చెంచాల ఓట్స్‌ను పొడిగా చేసుకుని తీసుకోవాలి. తర్వాత అరటిపండు వేసి పేస్ట్‌లా చేసుకోవాలి. దాన్ని ముఖానికి రాసుకుని పావుగంట పాటు స్మూత్‌గా మసాజ్‌ చేసుకోవాలి. ఆరిపోయాక ముఖాన్ని కడుక్కోవాలి. ఇలా చేస్తే అవాంఛిత రోమాలు పోతాయి. రోమాలతో పాటు స్కిన్‌పై ఉన్న మురికి, డెడ్‌ స్కిన్‌ సెల్స్‌ పోతాయి.
ఇది కూడా చదవండి: కొబ్బరి నీళ్లు ఎప్పుడు తాగితే మంచిది..?
అంతేకాకుండా గిన్నెలో కోడిగుడ్డు తెల్లసొన తీసుకుని దానిలో బియ్యం పిండి వేసి ఆ పేస్ట్‌ను ముఖానికి రాసి మర్దనా చేయాలి. ఒక 20 నిమిషాల తర్వాత కడుకుంటే ముఖంపై రోమాలు తొలగిపోతాయి. బొప్పాయి కూడా అవాంఛిత రోమాలను తొలగించడంలో బాగా ఉపయోగపడుతుంది. దీనిలోని పపైన్‌ అనే ఎంజైమ్‌ అవాంఛిత రోమాలను కుదుళ్ల నుంచి పెరగకుండా అరికడుతుంది. గిన్నెలో బొప్పాయి గుజ్జును తీసుకుని దానిలో కొంచెం ప‌సుపు వేసి ఆ పేస్ట్‌ను ఫేస్‌కు రాసుకోవాలి. పావుగంట తర్వాత కడుక్కోవాలి. ఇలా చేస్తే సమస్య తగ్గిపోతుంది. నిమ్మకాయ రసాన్ని గిన్నెలోకి తీసుకుని అందులో షుగర్‌ వేసి 4 నిమిషాలు వేడి చేయాలి..అందులో కొన్ని నీళ్లు పోసి వ్యాక్స్‌లా అయ్యేలా చేసుకోవాలి. అది వేడిగా ఉన్నప్పుడే రోమాలపై రాసుకోవాలి. తర్వాత వ్యాక్స్‌ పేపర్‌తో గట్టిగా ఒత్తిడి చేయాలి. ఆ తర్వాత పేపర్‌ను రివర్స్‌లో లాగాలి. ఇలా చేస్తే తొందరగా అవాంఛిత రోమాలు పోతాయి.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Raj Tarun: ఎట్టకేలకు అజ్ఞాతం వీడిన యంగ్ హీరో..

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ 'పాంచ్ మినార్'తో రీ ఎంట్రీ ఇస్తున్నాడు. సినిమా టీజర్ విడుదలై ప్రమోషన్స్ షురూ అయ్యాయి. గత వివాదాల తర్వాత పెద్దగా కనిపించలేదు రాజ్, తాజాగా మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మీడియా ముందు ప్రత్యక్షమయ్యాడు. 

New Update
Raj Tarun

Raj Tarun

Raj Tarun: టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రాజ్ తరుణ్ గురించి చెప్పాలంటే, అతని స్టైల్ కొంచెం ప్రత్యేకమే. కేవలం సినిమా ప్రమోషనన్స్ టైమ్ లో మాత్రమే కనిపించి, తర్వాత పూర్తిగా మాయమవ్వడం అతని అలవాటుగా కనిపిస్తోంది. మూవీ రిలీజ్ టైమ్ లో తప్ప మిగతా రోజుల్లో  ఏమాత్రం అప్‌డేట్స్ లేకుండా మాయమయిపోతుంటాడు.

Also Read: నరరూప రాక్షసుడిని చూస్తారు.. మే 1న థియేటర్లలో కలుద్దాం: నాని

అయితే ఇక్కడ విషయం ఏంటంటే, రాజ్ తరుణ్ లాగానే అతని సినిమాలు కూడా అంతే త్వరగా మాయమవుతాయి. ఏ ప్రాజెక్ట్ చేస్తున్నాడో, టైటిల్ ఏంటి, ఎప్పుడు విడుదలవుతుందో ఇవేమి ఎవరికీ తేలేదు. సడన్ గా కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తుంటాడు.

‘పాంచ్ మినార్’ ప్రమోషన్స్..

అయితే ఈ సారి కూడా అదే జరిగింది,  రాజ్ తన సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియా ముందుకొచ్చాడు. ‘పాంచ్ మినార్’(Paanch Minar) అనే సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు. చిత్ర బృందం టీజర్‌ను లాంచ్ చేసింది. ఇకపై సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్‌ను వరుసగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. విడుదల కూడా త్వరలోనే ఉండబోతుందట.

Also Read: ‘కేజీఎఫ్‌ చాప్టర్‌-2’: రాఖీ భాయ్ విధ్వంసానికి మూడేళ్లు!

ఇదంతా పక్కనపెడితే, గతంలో రాజ్ తరుణ్ పై వచ్చిన వ్యక్తిగత వివాదం అందరికీ గుర్తుండే ఉంటుంది. లావణ్య అనే మహిళ రాజ్ తరుణ్ తన భర్త అని మీడియా ముందుకొచ్చి సంచలనం సృష్టించింది. ఆ వివాదం పెద్ద చర్చకు దారితీసినా, చివరికి ఆమెనే మళ్లీ అతనికి క్షమాపణలు చెప్పింది. తన ఆరోపణలకు తానే క్లారిటీ ఇవ్వడంతో, రాజ్ తరుణ్ తిరిగి తెరపైకి వస్తాడని అందరూ భావించారు.

Also Read: బాలయ్య ఫ్యాన్స్ చొక్కాలు చింపుకునే న్యూస్..

అయితే ఆ వివాదం సద్దుమణిగాక  కూడా రాజ్ తరుణ్ మాత్రం మౌనం వీడలేదు, కావాలనే అజ్ఞాతం లోకి వెళ్ళాడో, లేదంటే ప్లాన్డ్ సైలెన్స్‌లో ఉన్నాడో ఎవ్వరికీ అర్థం కాలేదు. ఇప్పుడు మరోసారి సినిమా విడుదల దశకు చేరుకోవడంతో మీడియా ముందుకొచ్చిన రాజ్ తరుణ్, సినిమా ప్రమోషన్స్ ముగిసిన తర్వాత మళ్లీ మాయమవుతాడా? అన్నది ప్రెశ్నగా మారింది.

Also Read: ఒక్క మాటతో ప్రభాస్ 'స్పిరిట్'ని ఆకాశానికి ఎత్తేసిన రాజమౌళి..

Advertisment
Advertisment
Advertisment