Yuvraj Singh : క్రికెటర్లపై బీజేపీ కన్ను.. యువరాజ్‌ సింగ్‌ ట్వీట్ వైరల్!

టీమిండియా వరల్డ్‌కప్‌ హీరో యువరాజ్‌ సింగ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారన్న ప్రచారం జోరందుకున్న వేళ ఈ విషయంపై ఆయనే స్వయంగాఇ క్లారిటీ ఇచ్చారు. తాను ఎన్నికల్లో పోటీ చేస్తున్నానే వార్తలను తోసిపుచ్చారు. మరోవైపు సెహ్వాగ్‌కు ఢిల్లీలోని ఓ లోక్‌సభ స్థానం బరిలోకి దింపాలని బీజేపీ భావిస్తోంది.

New Update
Yuvraj Singh : క్రికెటర్లపై బీజేపీ కన్ను.. యువరాజ్‌ సింగ్‌ ట్వీట్ వైరల్!

Yuvraj Singh Clarifies on His Political Entry : లోక్‌సభ ఎన్నిక(Lok Sabha Elections) లలో హ్యాట్రిక్ విజయాన్ని సాధించేందుకు సినీ నటులతో పాటు క్రికెటర్లను(Cricketers) కూడా యూజ్ చేసుకోవాలని బీజేపీ(BJP) భావిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. క్రికెటర్లతో సహా ఇతర క్రీడా రంగాలకు చెందిన ప్రముఖ వ్యక్తులను బీజేపీ బరిలోకి దింపాలని ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం. క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్(Virender Sehwag), యువరాజ్ సింగ్‌(Yuvraj Singh) తో పాటు సినీ యాక్టర్లు అక్షయ్ కుమార్, జయప్రద లాంటి ప్రముఖులు వచ్చే ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం జోరందకుంది. ఎన్డీఏతో సంబంధం లేకుండా మెజారిటీ మార్క్‌ దాటాలదన్నదే బీజేపీ ఆలోచన. ఓవరాల్‌గా ఎన్డీఏ(NDA) తో కలుపుకోని 400కు పైగా సీట్లు సాధించాలనే లక్ష్యంతో బీజేపీ రాజకీయాలకు అతీతంగా ఇతర రంగాల నుంచి అనుభవజ్ఞులను రంగంలోకి దింపేందుకు సిద్ధమవుతోంది. అక్షయ్ కుమార్, యువరాజ్ సింగ్, పవన్ సింగ్, జయప్రద ఎన్నికల్లో పోటీ చేసేందుకు అంగీకరించారని, సెహ్వాగ్‌తో పాటు వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులతో చర్చలు జరుగుతున్నాయని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. కిరణ్ ఖేర్ స్థానంలో అక్షయ్ చండీగఢ్ నుంచి, సన్నీ డియోల్ స్థానంలో గురుదాస్‌పూర్ నుంచి యువరాజ్ సింగ్ బరిలోకి దిగవచ్చని ప్రచారం జరుగుతోంది. సెహ్వాగ్ అంగీకరిస్తే అతనికి ఢిల్లీ లేదా హర్యానాలో సీటు ఇచ్చేందుకు బీజేపీ సిద్ధంగా ఉందంట. అయితే జరుగుతున్న ప్రచారంలో నిజమెంతా?


పోటి చేయడం లేదు?
టీమిండియా(Team India) కు 2007 టీ20 వరల్డకప్‌(T20 World Cup), 2011 వన్డే ప్రపంచకప్‌ అందించిన ఆటగాడు యువరాజ్‌ సింగ్‌. ఈ సిక్సర్ల వీరుడు యువరాజ్‌ సింగ్‌ పంజాబ్‌(Punjab) నుంచి ఎంపీగా పోటికి దిగుతారన్న టాక్‌లో ఏ మాత్రం క్లారిటీ లేదని తేలిపోయింది. ఎందుకంటే దీనిపై ఈ స్టార్‌ ఆల్‌రౌండరే స్వయంగా క్లారిటీ ఇచ్చారు. తాను ఎన్నికల్లో పోటీ చేస్తున్నానే వార్తలను యువరాజ్ సింగ్ తోసిపుచ్చారు. మీడియా కథనాలకు విరుద్ధంగా ఆయన ట్వీట్‌ కనిపిస్తోంది. గురుదాస్‌పూర్ నుంచి ఎన్నికల్లో పోటీ చేయడం లేదని స్పష్టతనిచ్చారు యువీ.

సినీ ప్రముఖులకు ఎర?
మరోవైపు పశ్చిమ బెంగాల్‌లోని అసన్‌సోల్‌ సీటులో టీఎంసీ ఎంపీ, నటుడు శత్రుఘ్న సిన్హా పై భోజ్‌పురి స్టార్ పవన్ సింగ్‌ను పోటీకి దింపాలని బీజేపీ నిర్ణయించింది. అటు క్రీడలు, వ్యాపారం, సామాజిక సేవతో పాటు అనేక ఇతర రంగాలకు చెందిన ప్రముఖ వ్యక్తులతో బీజేపీ టచ్‌లో ఉందని సమాచారం. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో సినీ రంగానికి సంబంధించిన వారిని బరిలోకి దింపేందుకు ఒప్పించే పనిలో పార్టీ బిజీగా ఉంది. ఈ ఎన్నికల్లో బీజేపీ 50కు పైగా ప్రముఖులను బరిలోకి దించనుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Also Read : తిక్క కుదిరింది.. కంట్రాక్ట్‌ లిస్ట్‌ నుంచి అయ్యర్-కిషన్ ఔట్.. ఎందుకంటే?

#punjab #political-entry #yuvraj-singh #bjp
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు
తదుపరి కథనాన్ని చదవండి

India: పాకిస్తానీయులకు ముగిసిన డెడ్ లైన్..537 మంది...

India: పాకిస్తానీయులకు ముగిసిన డెడ్ లైన్..537 మంది వెనక్కు..

టెంపరరీ వీసాలతో భారత్ కు వచ్చిన పాక్ పౌరులకు భారత ప్రభుత్వం ఇచ్చిన గడువు ఈ రోజు తో ముగిసింది. దీంతో ఇప్పటి వరకు 537 మంది అట్టారీ-వాఘా సరిహద్దు మార్గంలో పాకిస్థాన్‌కు వెళ్ళారని తెలుస్తోంది. వీరిలో తొమ్మది మంది దౌత్య వేత్తలు, అధికారులు ఉన్నారు.

New Update
pak

Pakistan People

పాకిస్తానీయులు ఇండియాలో ఉండటంపై భారత ప్రభుత్వం సీరియస్ గా ఉంది. పహల్గామ్ లో దాడి జరిగిన తర్వాత పాక్ పౌరులు తమ దేశం నుంచి వెళ్ళిపోవాలని ఆదేశాలను జారీ చేసింది. ఏప్రిల్ 24న ఈ ఉత్తర్వులను ఇచ్చింది. దీంతో పాకిస్తానీయులు దేశం విడిచి వెళ్ళడం ప్రారంభించారు. ఇప్పటివరకు నాలుగు రోజుల్లో 537 మంది అట్టారీ-వాఘా సరిహద్దు మార్గంలో పాకిస్థాన్‌కు  వెళ్లిపోయినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఒక్క ఆదివారం రోజునే 287 మంది వెళ్ళారని సమాచారం . ఇందులో తొమ్మిది మంది దౌత్యవేత్తలు, అధికారులు ఉన్నట్లు చెప్పారు. కొంతమంది ఫ్లైట్స్ ద్వారా వెళ్ళారని..అయితే నేరుగా పాక్ కు విమాన సర్వీసులు లేవు కాబట్టి..ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ నుంచి వెళ్ళిపోయి ఉండవచ్చని చెప్పారు. ఇదే సరిహద్దు ద్వారా 850 మంది భారతీయులు పాకిస్థాన్‌ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చినట్లు చెప్పారు.

మూడు లక్ష జరిమానా..

పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్‌లో ఉంటున్న పాకిస్థానీయులను నిర్ణీత గడువులోగా వెళ్లిపోవాలని కేంద్రం ఆదేశించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘించి ఎవరైనా గడువు దాటినా కూడా ఇంకా భారత్‌లోనే ఉంటే చట్టం ప్రకారం వాళ్లని అరెస్టు చేయవచ్చు. దీనిపై దర్యాప్తు చేపట్టి.. మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా రూ.3 లక్షల జరిమానా, లేదా రెండు విధించే ఛాన్స్ కూడా ఉంటుంది.  సార్క్‌ వీసాల కింద ఇండియాలో ఉంటున్న పాకిస్థానీయులు ఏప్రిల్ 26లోగా దేశం విడిచి వెళ్లిపోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే మెడికల్ వీసాల కింద వచ్చినవాళ్లకు మాత్రం ఏప్రిల్ 29 వరకు గడువు ఇచ్చింది. స్టూడెంట్, బిజినెస్, విజిటర్ తదితర 12 విభాగాల్లో వీసాలు ఉన్నవాళ్లు మాత్రం ఏప్రిల్ 27 నాటికి వెళ్లిపోవాలని ఆదేశించింది. ఏప్రిల్ 4 నుంచి ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్‌ యాక్ట్‌-2025 అమల్లోకి వచ్చింది. 

 today-latest-news-in-telugu | india | pakistan 


Also Read: Sitakka: నీ బిడ్డ కార్లలో తిరిగితే.. మా ఆడబిడ్డలు బస్సులో కూడా తిరగొద్దా?: కేసీఆర్ కు సీతక్క స్ట్రాంగ్ కౌంటర్!

Advertisment
Advertisment
Advertisment