Gadwala district: అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్టు

అంతర్రాష్ట దొంగల ముఠాను గద్వాల జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను మీడియా ముందు ప్రవేశ పెట్టిన జిల్లా ఎస్పీ.. నిందితుల నుంచి 12 ఆటోలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

New Update
Gadwala district: అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్టు

అంతర్రాష్ట దొంగల ముఠాను గద్వాల జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను మీడియా ముందు ప్రవేశ పెట్టిన జిల్లా ఎస్పీ.. నిందితుల నుంచి 12 ఆటోలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ నెల 2న గద్వాల పట్టణంలోని సుంకులమ్మ మెట్టు కాలనీకి చెందిన పకృద్దిన్‌ వృత్తి రిత్యా ఆటో డ్రైవరని అతను తన ఆటోను రాత్రి సమయంలో ఇంటి ముందు ఉంచినట్లు తెలిపారు. ఉదయం లేచి చూసే సరికి అక్కడ ఆటో లేకపోవడంతో కంగారు పడ్డ పకృద్దిన్‌ పోలీసులను ఆశ్రయించినట్లు ఎస్పీ సృజన తెలిపారు.

బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ పుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. మరోవైపు శుక్రవారం పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ వివరించారు. వారిని తమదైన స్టైల్లో విచారించగా.. అసలు విషయం బయటపడినట్లు పేర్కొన్నారు. నిందితులు హైదరాబాద్‌కు చెందిన వారిగా గుర్తించినట్లు తెలిపారు. వీరి నుంచి 12 ఆటోలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

వీరిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుల వెనుక ఎవరెవరు ఉన్నారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో దొంగలు రెచ్చిపోతున్నారు. దుండగులను అరికట్టేందుకు పోలీసులు ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా దుండగులు పోలీసుల ఎత్తుకు పైఎత్తు వేస్తూ సులువుగా దొంగతనాలకు పాల్పడుతున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Tractor accident: అదుపుతప్పి బావిలో పడ్డ ట్రాక్టర్.. ఏడుగురు మహిళా కూలీలు మృతి

వ్యవసాయ కూలీలను తీసుకెళ్తున్న ట్రాక్టర్ ట్రాలీ అదుపుతప్పి బావిలో పడింది. ఏడుగురు మహిళలు మృతి చెందగా.. ముగ్గురు గాయాలతో బయటపడ్డారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో ఈ విషాదం శుక్రవారం జరిగింది. మృతుల కుటుంబాలకు CM రూ.5 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.

New Update
tractor accident in MH

tractor accident in MH

కూలీలు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బావిలో పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మహిళా కూలీలు మరణించగా.. మరో ముగ్గురు గాయాలతో బయటపడ్డారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో ఈ సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. అసే గ్రామంలోని వ్యవసాయ క్షేత్రానికి మహిళా కూలీలను తీసుకెళ్తున్న ట్రాక్టర్ ట్రాలీ అదుపుతప్పింది. అక్కడున్న వ్యవసాయ బావిలో అది పడింది. అధికారులు రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టారు. బావిలో పడిన ట్రాక్టర్‌తోపాటు ట్రాలీని క్రేన్‌ సహాయంతో బయటకు తీశారు.  

Also read: KCR: సుప్రీం కోర్టు ముందు తెలంగాణ పరువు తీశారు

ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మోటారు పైపులతో నీటిని తోడారు. క్రేన్స్‌ను రప్పించి సహాయక చర్యలు చేపట్టారు. బావిలో పడిన ట్రాక్టర్‌తోపాటు ట్రాలీని బయటకు తీశారు. ఏడుగురు మహిళా కూలీల మృతదేహాలను వెలికితీశారు. ముగ్గురు మహిళలను రక్షించారు. మరమణించిన ఏడుగురు మహిళలు హింగోలి జిల్లాలోని గుంజ్ గ్రామానికి చెందినవారిగా గుర్తించారు. మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. మహారాష్ట్ర సీఎం కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.

Also read: PM Modi: ప్రధాని మోదీకి శ్రీలంక అత్యున్నత పురస్కారం మిత్ర విభూషణ

Advertisment
Advertisment
Advertisment