Delhi: ఆరోగ్య బీమా పై జీఎస్టీ తగ్గింపు–కేంద్రం నిర్ణయం

ఆరోగ్య బీమాపై జీఎస్టీ తగ్గించాలని కేంద్రం నిర్ణయించింది. కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షత సమావేశమైన జీఎస్టీ కౌన్సిల్ దీనిపై చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే విదేశీ విమానయానాల మీద కూడా జీఎస్టీ తగ్గే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది.

New Update
BUDGET 2024: భూముల పరిరక్షణ కోసం కొత్త పథకం.. కీలక ప్రకటన

ఆరోగ్య బీమాపై జీఎస్టీ తగ్గించాలని కేంద్రం నిర్ణయించింది. కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షత సమావేశమైన జీఎస్టీ కౌన్సిల్ దీనిపై చర్చించినట్లు తెలుస్తోంది.అలాగే 2,000 కంటే ఎక్కువ ఆన్‌లైన్ చెల్లింపులపై పన్ను విధించే ప్రతిపాదన ఇంకా జీఎస్టీ నుండి విదేశీ విమానయాన సంస్థలకు ఉపశమనం కలిగించాలని వంటి కీలక నిర్ణయాలను ప్యానెల్ తీసుకున్నట్టు సమాచారం. ఈ సమావేశానికి వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో పాటు ఆర్థిక శాఖకు చెందిన కీలక అధికారులు హాజరయ్యారు.

ఇన్సూరెన్స్ పాలసీలకు జీఎస్టీ తగ్గించే అంశంపై అక్టోబర్ నెలాఖరు నాటికి జీఎస్టీ కౌన్సిల్ నివేదిక ఇవ్వనుంది. GOM ఇచ్చిన నివేదికపై నవంబర్లో జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. దాని తరువాత క్యాన్సర్ ఔషధాలపై జిఎస్టి తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.  క్యాన్సర్ ఔషధాలపై 12 శాతం ఉన్న జీఎస్టీని ఐదు శాతానికి తగ్గించినట్లు తెలిపింది. 2026 మార్చి తర్వాత జీఎస్టీ పరిహార సెస్ ను కొనసాగించాలా వద్దా అనే దానిపై మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేయాలని జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయించారు.

Also Read:

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

GT VS SRH: హైదరాబాద్ ఇక ఇంటికి వెళ్ళిపోయినట్లే...వరుసగా నాలుగో ఓటమి

హైదరాబాద్  సన్ రైజర్స్ ఇంక ఇంటికి వెళ్ళిపోయినట్లే. ఈరోజు కూడా గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడిపోయి వరుసగా నాలుసార్లు ఓటమిని చవి చూసింది. ఏడు వికెట్ల తేడాతో హైదరాబాద్ మ్యాచ్ ను పోగొట్టుకుంది. 

New Update
ipl

GT VS SRH

సొంత గ్రౌండ్ లో హైదరాబాద్ మళ్ళీ ఓడిపోయింది. గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. హైదరాబాద్ ఇచ్చిన 153 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ 16.4 ఓవర్లలో కేవలం 3 వికెట్లు కోల్పోయి పూర్తి చేసింది.  గుజరాత్ కెప్టెన్ శుభ్ మన్ గిల్ 61 పరుగులు, వాషింగ్టన్ సుందర్ 49 పరుగులతో రాణించారు. హైదరాబాద్ బౌలర్స్ లో షమీ 2, రమిన్స్ ఒక వికెట్ తీశారు.  

గుజరాత్ బౌలర్లు తాట తీశారు..

అంతకు ముందు ఉప్పల్ స్డేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్ తో జరుగుతోన్న మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 8 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన సన్‌రైజర్స్ ను గుజరాత్ టైటాన్స్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ దారుణంగా దెబ్బకొట్టాడు. నాలుగు ఓవర్లలో  కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి కీలకమైన నాలుగు వికెట్లు తీశాడు.  ట్రావిస్ హెడ్ (8), అభిషేక్ శర్మ (18) లను మొదట్లోనే  వెనక్కి పంపిన సిరాజ్.. డేంజరెస్ ఆటగాడు అనికెత్ వర్మ(18) ను ఎల్బీగా వెనక్కి పంపించాడు. సన్‌రైజర్స్ ఆటగాళ్లలో నితీష్ కుమార్ రెడ్డి(31), హెన్రిచ్ క్లాసెన్(27), పాట్ కమ్మిన్స్ (22) పరుగులు చేశారు.  గుజరాత్ బౌలర్ లో మహమ్మద్ సిరాజ్ నాలుగు వికెట్లు తీయగా.. ప్రసిద్ధ్ కృష్ణ, సాయి కిషోర్ చెరో రెండు వికెట్లు తీశారు.  

today-latest-news-in-telugu | IPL 2025 | gt-vs-srh 

Also Read: Jibli Trend: జిబ్లీలో ఫోటోలు అప్ లోడ్ చేస్తున్నారా..అయితే జాగ్రత్త

Advertisment
Advertisment
Advertisment