Manipur : మణిపూర్‌లో మళ్ళీ కాల్పులు..నలుగురు అదృశ్యం..రాహుల్ న్యాయ యాత్ర డౌటే..

మణిపూర్‌లో మళ్ళీ అల్లర్లు జరిగాయి. నలుగురు అదృశ్యమయ్యారు. దీంతో కాల్పులు కూడా చోటు చేసుకున్నాయి. బిష్ణుపూర్ జిల్లాలోని కుంబి, తౌబల్ జిల్లాలోని వాంగూ మధ్య కాల్పుల ఘటన జరిగింది.

New Update
Manipur : మణిపూర్‌లో మళ్ళీ కాల్పులు..నలుగురు అదృశ్యం..రాహుల్ న్యాయ యాత్ర డౌటే..

Manipur Riots : నిన్న మణిపూర్‌(Manipur) లో జరిగిన కాల్పులు కలకలం రేపాయి. బిష్ణుపూర్ జిల్లాలోని కుంబి, తౌబల్ జిల్లాలోని వాంగూ కమ్యూనిటీ మధ్య గొడవ జరిగింది. దాని తర్వాత కాల్పులు జరిగిన ప్రాంతానికి సమీపంలో అల్లం కోయడానికి వెళ్లిన నలుగురు వ్యక్తులు అదృశ్యం అయ్యారు. ఆ తరువాత వెంటనే భద్రతా బలగాలు సంఘటనా స్థలానికి చేరుకుని కూంబింగ్ నిర్వహించాయి. నలుగురిని ఓయినమ్ రోమెన్ మైతేయి (45), అహంతేమ్ దారా మైతేయి (56), తౌడమ్ ఇబోమ్చా మైతేయి (53), తౌడం ఆనంద్ మైతేయి (27)గా గుర్తించారు. ఈ కాల్పుల వల్ల 100 మందికి పైగా మహిళలు, పిల్లలు మరియు వృద్ధులు సురక్షిత ప్రాంతాలకు పారిపోయారు.

Also read:నేడే ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్.. BRS కు షాక్.. రెండూ కాంగ్రెస్ ఖాతాలోకే!

జనవరి 1వ తేదీన కూడా...

అంతకు ముందు మణిపూర్‌లో మరోసారి హింసాత్మక ఘటన వెలుగు చూసింది. సోమవారం సాయంత్రం తౌబాల్ జిల్లా (Thoubal District)లో ముగ్గురు వ్యక్తులు కాల్చి చంపబడ్డారు. ఐదుగురు గాయపడ్డారు. దీంతో రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో మళ్లీ కర్ఫ్యూ విధించారు. ఈ మేరకు అధికారులు సమాచారం అందించారు. అయితే దాడి చేసిన వారిని ఇంకా గుర్తించలేదని అధికారులు తెలిపారు. లిలాంగ్ చింగ్జావో (Lilong Qingzhao) ప్రాంతంలో స్థానిక ప్రజలను లక్ష్యంగా చేసుకుని దుండగులు కాల్పులు జరిపారని ఆయన చెప్పారు. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, ఐదుగురు గాయపడ్డారు.

క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. దాడి అనంతరం ఆగ్రహించిన స్థానికులు మూడు వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ ఘటన తర్వాత తౌబాల్, ఇంఫాల్ ఈస్ట్, ఇంఫాల్ వెస్ట్, బిష్ణుపూర్ జిల్లాల్లో మళ్లీ కర్ఫ్యూ విధించినట్లు ఆయన తెలిపారు. గతేడాది మేలో, మణిపూర్‌లోని ఇంఫాల్ లోయలో నివసిస్తున్న మెజారిటీ మెయిటీ(Majority Meitei), కొండ ప్రాంతాలలో నివసించే కుకీ కమ్యూనిటీల మధ్య జాతి హింస చెలరేగింది.అప్పటి నుంచి మణిపూర్‌లో హత్యలు జరుగుతూనే ఉన్నాయి.

రాహుల్ న్యాయ్ యాత్ర అనుమతి...

ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్‌(Congress) నేత రాహుల్‌ గాంధీ(Rahul Gandhi), కాంగ్రెస్‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర జరిగే సూచనలు కనిపించడం లేదు. ఈనెల 14వ తేదీ మణిపూర్‌ నుంచి ప్రారంభించాలనుకున్న రాహుల్‌ యాత్రకు అనుమతి లేనట్టేనని సమాచారం. రాహుల్‌ యాత్రకు అనుమతి అంశంలో పరిశీలనలో ఉంది. ఈ విషయంపై వివిధ భద్రతా సంస్థల నుండి నివేదికలు తీసుకుంటున్నాము. వారి నుండి నివేదికలు అందిన తర్వాత ఖచ్చితమైన నిర్ణయం తీసుకుంటామన్నారు. అయితే తాజా ఘటనలతో దాదాపుగా న్యాయ్ యాత్రకు అనుమతి అవకాశాలు లేనట్టేనని తెలుస్తోంది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

SRH VS PBKS: వాట్ ఏ కమ్ బ్యాక్..ఎస్ఆర్హెచ్ దుమ్ము దులిపేసింది మామా..

ఐపీఎల్ 2025లో ఈరోజు అద్భుతమైన మ్యాచ్ జరిగింది. హైదరాబాద్ ఉప్పల్ లో ఈరోజు పంజాబ్ కింగ్స్, హైదరాబాద్ సన్ రైజర్స్ నువ్వా నేనా అన్నట్టు ఆడారు. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 246 పరుగుల టార్గెట్ ఇస్తే దాన్ని ఎనిమిది వికెట్ల తేడాతో ఛేదించింది. 

author-image
By Manogna alamuru
New Update
ipl

SRK VS PBKS

హైదరాబాద్ సన్ రైజర్స్ అద్భుతమైన కమ్ బ్యాక్ ఇచ్చింది. ఐదు మ్యాచ్ లు ఓడిపోయిన తర్వాత ఈరోజు పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ చితక్కొట్టేసింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ లు విజృంభించి ఆడేశారు. పజాబ్ కింగ్స్ ఇచ్చిన 246 పరుగుల భారీ టార్గెట్ ను 8 వికెట్ల తేడాతో సునాయాసంగా ఛేదించింది. ఓపెనర్లు అభిషేక్ వర్మ 141 పరుగులు, ట్రావిస్ హెడ్ 66 పరుగులతో ఇరగదీసారు. ఇద్దరూ కలిసి మ్యాచ్ ను గెలిపించేశారు. 150 పరుగుల ముందు అభిషేక్ వర్మ వికెట్ కోల్పోవడం కొంత నిరాశ కలిగించినా...అతను ఈరోజు ఆడిన తీరుతో ఉప్పల్ స్టేడియం మొత్తాన్ని ఉర్రూతలూగించాడు. అభిషేక్‌ శర్మ 55 బంతుల్లో 14 ఫోర్లు, 10 సిక్స్‌లsy 141 పరుగులు చేసి పంజాబ్‌ బౌలర్లకు చుక్కలు చూపించాడు. వరుస ఫోర్లు, సిక్సర్లతో ఉప్పల్ మైదానంలో పరుగుల వరద పారించాడు. అభిషేక్ ధాటికి పంజాబ్ ఏకంగా ఎనిమిది మందితో బౌలింగ్‌ చేయించింది.  మరోవైపు అతను కొట్టిన బంతులను గ్రౌండ్ స్టాఫ్ వెతుక్కోవడంతోనే సరిపోయింది.  ట్రావిస్ హెడ్ 37 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 66 పరుగులు చేసి అభిషేక్ కు మంచి సపోర్ట్ ఇచ్చాడు.  చివర్లో క్లాసెన్ 14 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌ తో 21, ఇషాన్ కిషన్ 9*; 6 బంతుల్లో 1 సిక్స్ కొట్టి మ్యాచ్ ను గెలిపించారు. 

పంజాబ్ కూడా దుమ్మ రేపింది..

అంతకు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు చెలరేగిపోయింది. తొలి ఇన్నింగ్స్ చేసి కింగ్స్ జట్టు నిర్దేశించిన 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 245 పరుగులు సాధించింది. దీంతో SRH ముందు 246 భారీ టార్గెట్ ఉంది. హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో ఈ మ్యాచ్ జరుగుతోంది. మొదట టాస్ గెలిచిన పంజాబ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్స్‌గా క్రీజులోకి ప్రభ్‌మన్ సింగ్‌, ప్రియాంశ్‌ ఆర్య మొదటి నుంచి దంచి కొట్టారు. బాల్‌ టు బాల్ ఫోర్లు, సిక్సర్లతో దుమ్ము దులిపేశారు. ఉప్పల్ స్టేడియంలో పరుగుల వరద పెట్టించారు. సన్ రైజర్స్ జట్టు బౌలర్లకు చెమటలు తెప్పించారు. ఇక హర్షల్‌ పటేల్‌ బౌలింగ్‌లో (3.6) ప్రియాంశ్‌ ఆర్య (36) నితీశ్‌ రెడ్డికి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.  ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన శ్రేయస్ అయ్యార్ దుమ్ము దులిపేశాడు. పరుగులు రాబడుతూ అదరగొట్టేశాడు. ఫోర్లు, సిక్సర్లతో కెవ్ కేక అనిపించాడు. అతడు 36 బంతుల్లో 82 పరుగులు చేసి ఔటయ్యాడు. అలాగే వధేరా 22 బంతుల్లో 27 పరుగులు, శశాంక్ సింగ్ 3 బంతుల్లో 2 పరుగులు, మాక్స్‌వెల్ 7 బంతుల్లో 3 పరుగులు, స్టొయినీస్ 11 బంతుల్లో 34 పరుగులు చేశారు. 

 today-latest-news-in-telugu | IPL 2025 | srh-vs-pbks

Also Read:  USA: యాపిల్ కు అండగా ట్రంప్..సుంకాల నుంచి ఫోన్లు, కంప్యూటర్లు మినహాయింపు

Advertisment
Advertisment
Advertisment