TS Free Bus Scheme: మహిళలకు ఫ్రీబస్ తో మెట్రోకు షాక్.. ఎన్ని లక్షల మంది ప్రయాణికులు తగ్గారంటే?

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'మహాలక్ష్మీ పథకం' హైదరాబాద్​ మెట్రోపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మెట్రో ప్రయాణికుల సంఖ్య గతేడాది రోజూ 5 లక్షలకు పైగా ఉండగా.. ఇప్పుడు 4 లక్షలకు చేరినట్లు మెట్రో అధికారులు వెల్లడించారు. ఆర్టీసీలో 15 నుంచి 21 లక్షలకు పెరిగింది.

New Update
TS Free Bus Scheme: మహిళలకు ఫ్రీబస్ తో మెట్రోకు షాక్.. ఎన్ని లక్షల మంది ప్రయాణికులు తగ్గారంటే?

Metro : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'మహాలక్ష్మీ పథకం'లో ఒకటైన ఆర్టీసీలో ఉచిత ప్రయాణం హైదరాబాద్​ మెట్రోపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గతంలో ట్రాఫిక్ సమస్య కారణంగా మెట్రోను ఎంచుకునే జనాలు ఇప్పుడంతా ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణిస్తున్నారు. మహిళలు ఫ్రీ టికెట్ కావడంతో భర్తలు, పిల్లలను కూడా తమ వెంట తీసుకెళ్తున్నారు. దీంతో గతేడాది దాదాపు 5 లక్షలకు పైగా ఉన్న మెట్రో ప్రయాణికుల సంఖ్య 5 శాతం తగ్గినట్లు మెట్రో అధికారులు వెల్లడించారు. అయితే ఆర్టీసీలో మాత్రం ప్రయాణిస్తున్న మహిళల సంఖ్య మాత్రం 12 లక్షలకు చేరడం విశేషం.

5 నుంచి 4 లక్షలకు పడిపోయింది..
ఈ మేరకు 2017లో మొదలైన మెట్రోలో క్రమంగా ప్రయాణికుల సంఖ్య పెరిగింది. మొదట్లో రెండు లక్షలకు పైగా ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరేవారు. మహిళా ఉద్యోగులు, కాలేజీ అమ్మాయిలు మెట్రో ట్రైన్ లోనే ప్రయాణం చేసేవారు. రోజుకు సగటున 5.10 లక్షల మంది మెట్రోలో ప్రయాణించగా.. గతేడాది నవంబర్ నెలలో ఒకే 5.47 లక్షల మంది ప్రయాణించినట్లు లెక్కలు వెల్లడించారు. అయితే డిసెంబర్ లో మహాలక్ష్మీ స్కీమ్ మొదలవగానే మెట్రోలో ప్రయాణించేవారి సంఖ్య క్రమంగా తగ్గిందని, రోజుకు 4.80 లక్షల మంది ప్రయాణిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: India: 2025 నాటికల్లా భారతీయులందరికీ కనీస వేతనాలు!

సిటీ బస్సుల్లో 12 లక్షలు..
ఇక మహాలక్ష్మీ పథకం ఎఫెక్టుతో సిటీ ఆర్టీసీ బస్సుల్లో భారీగా రద్దీ పెరిగింది. ప్రస్తుతం సిటీలో 2800 ఆర్టీసీ బస్సులు నడుస్తుండగా.. మెట్రో లగ్జరీ, మెట్రో డీలక్స్​ బస్సులు పోను 2500 బస్సులు అందుబాటులో ఉంటున్నాయి. అయితే మహాలక్ష్మి స్కీమ్ కు ముందు ప్రతి రోజు సగటున 15 లక్షల మంది ప్రయాణించగా.. ఇప్పుడు ఆ సంఖ్య 21 లక్షలకు చేరినట్లు తెలిపారు. ఇందులో 12 లక్షల మంది జీరో టికెట్ ద్వారానే ప్రయాణించిచడం విశేషం.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

TTDలో నిజంగానే 100 ఆవులు చనిపోయాయా?: చైర్మన్ బీఆర్ నాయుడు కీలక ప్రకటన!

TTD ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గోశాలలో 100 ఆవులు చనిపోయాయన్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని చైర్మన్ BR నాయుడు స్పష్టం చేశారు. భూమన కరుణాకర్ రెడ్డి కల్పిత ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఇతర ప్రాంతాల్లో చనిపోయిన గోవుల ఫోటోలను ఇక్కడివిగా చిత్రీకరిస్తున్నారన్నారు.

New Update
TTD Cows Death

TTD Chairman Reaction Over Cows Death

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని నిర్వహించబడుడున్న ఎస్వీ గోశాలలో దాదాపు 100 గోవులు మృతి చెందాయని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి నిన్న ఆరోపించిన విషయం తెలిసిందే. అత్యంత దయనీయ పరిస్థితుల్లో ఆ ఆవులు చనిపోతున్నాయని.. ఇది మహా అపచారం అని ఆవేదన వ్యక్తం చేశారు. మృతి చెందిన ఆవులకు సంబంధించిన ఫొటోలను సైతం కరుణాకర్ రెడ్డి విడుదల చేశారు. ఈ అంశంపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు స్పందించారు. కరుణాకర్ రెడ్డి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారన్నారు. ఇలాంటి కల్పిత ఆరోపణలు అత్యంత విషాదకరమన్నారు. శ్రీవారి సేవలో నిమగ్నమై, హిందూ ధర్మ పరిరక్షణకు అంకితభావంతో టీటీడీ ట్రస్ట్ బోర్డు చేపడుతున్న పుణ్య కార్యక్రమాల పట్ల కంటకింపుతో ఈ తరహా చర్యలకు దిగడం చాలా బాధాకరమనర్నారు.

గోమాతకు హిందూ ధర్మంలో ఉన్న ప్రాముఖ్యత అనన్య సాధారణమన్నారు. వేదకాలం నుంచే గోమాతను దేవతలతో పూజిస్తూ వస్తున్నామన్నారు. ఏ ఒక్క గోవు యొక్క మృతి కూడా సామాన్యంగా తీసుకోలేమన్నారు. కానీ సహజంగా తప్పని అనారోగ్యం, వృద్ధాప్యం, ప్రమాదాలు వంటి కారణాల వల్ల  గోవుల మృతి జరిగే అంశాన్ని రాజకీయంగ, అబద్ధ ప్రచారానికి వాడుకోవడం అత్యంత అధర్మమని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇతర ప్రాంతాల్లోని ఫొటోలను ఇక్కడివిగా..

ఇంకా దుర్మార్గంగా, ఇతర ప్రాంతాల్లో చనిపోయిన గోవుల ఫోటోలను టీటీడీ గోశాలకు చెందినవిగా  చిత్రీకరించి ప్రజలను మోసగించేందుకు చేస్తున్న కుట్ర బాధాకరమన్నారు. ఇలాంటి వదంతులను ప్రజలు గుర్తించి, అవాస్తవాలపై నమ్మకం కలిగి మోసపోవద్దని కోరారు. గోసేవా అంటేనే గోదేవి సేవ అని అన్నారు. ఈ పవిత్రమైన సేవను రాజకీయ లబ్ధి కోసం మచ్చలేసే ప్రయత్నాలను భక్తులందరూ తిరస్కరించాలన్నారు. శ్రీవారి ఆశీస్సులతో, హిందూ ధర్మ పరిరక్షణలో టీటీడీ చేపడుతున్న గోరక్షణ, గోపోషణ కార్యక్రమాలపై భక్తుల విశ్వాసం మరింత బలపడాలని ఆకాంక్షించారు. 

(br naidu ttd chairman | telugu-news | latest-telugu-news | telugu breaking news)

Advertisment
Advertisment
Advertisment