Ap Road Accident : కల్వర్టును ఢీకొన్న కారు.. నలుగురు అక్కడిక్కడే మృతి! తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చంద్రగిరి మండలం ఎం.కొంగరవారిపల్లి దగ్గర కల్వర్టును కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, ఇద్దరికీ గాయాలు అయ్యాయి. చనిపోయిన వారిని నెల్లూరుకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. By Bhavana 27 May 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి Tirupati : తిరుపతి జిల్లా (Tirupati District) లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. చంద్రగిరి మండలం ఎం.కొంగరవారిపల్లి దగ్గర కల్వర్టును కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి (4 People Dead) చెందగా, ఇద్దరికీ గాయాలు అయ్యాయి. చనిపోయిన వారిని నెల్లూరుకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వీరంతా కూడా తిరుమల (Tirumala) స్వామి వారిని దర్శించుకుని కాణిపాకం వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. Also read: ప్రారంభమైన ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్! #car-accident #chandragiri #tirupati #andhra-pradesh సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి