Road Accident: తెల్లవారుజామునే ఘోరరోడ్డు ప్రమాదం..ఐదుగురు మృతి..!!

ఏపీలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. కర్నాటకలోని బెళగావికి చెందిన భక్తులు తిరుమలకు వచ్చి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అన్నమయ్య జిల్లాల్లోని కేవీపల్లి దగ్గర భక్తుల వాహనాన్ని ఓ లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడిక్కడే మరణించారు. మరో 11 మందికి తీవ్రగాయాలు అయ్యాయి.

New Update
మద్యం మత్తులో  ఎమ్మార్వో కుమారుడి డ్రైవింగ్...యువకుడు మృతి

తెల్లవారుజామునే ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడిక్కడే మరణించారు. కర్నాటకలోని బెళగావికి చెందిన భక్తులు తిరుమలకు వచ్చి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అన్నమయ్య జిల్లాల్లోని కేవీపల్లి దగ్గర భక్తుల వాహనాన్ని ఓ లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు.

పోలీసులు తెలిపిన పూర్తి వివరాల ప్రకారం...కర్నాటకలోని బెళగావికి చెందిన పలువురు తుఫాన్ వాహనంలో తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చారు. దర్శనం అనంతరం తమ స్వరాష్ట్రానికి తిరుగు ప్రయాణమయ్యారు. అయితే ఈ వాహనం అన్నమయ్య జిల్లాలోని కేవీపల్లి మండలం దగ్గరికి చేరుకుంది. అక్కడ తుఫాన్ వాహనం ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొట్టింది.

ఇది కూడా చదవండి: ఢిల్లీ హైకోర్టు సంచలన నిర్ణయం..విడాకులు తీసుకున్న కూతురుకు తండ్రి ఆస్తిపై హక్కు లేదంటూ తీర్పు.!!

ఈ ఘటనలో తుఫాన్ వాహనంలో ఉన్న ప్రయాణీకులకు తీవ్ర గాయాలయ్యాయి. సంఘటనాస్థలంలోనే ఐదుగురు ప్రయాణికులు మరణించారు. మరో 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలియాల్సి ఉంది.

ఇది కూడా చదవండి: భావితరాల ఇంజనీర్లకు ఇంజనీర్స్ డే శుభాకాంక్షాలు..!!

Advertisment
Advertisment
తాజా కథనాలు