సముద్రంలో చేపల వేటకు వెళ్లి రాత్రికిరాత్రే కోటీశ్వరుడైన మత్స్యకారుడు..

పాకిస్థాన్‌లోని కరాచీ తీర ప్రాంతంలో అరేబియా సముద్రంలోకి చేపల వేటకు వెళ్లిన ఓ వ్యక్తి రాత్రికి రాత్రే కోటీశ్వరుడైపోయాడు. అతని వలలో 10 గోల్డ్‌ ఫిష్‌ (సోవా) లు పడ్డాయి. వాటిని కరాచీ హర్బర్‌లో వేలం వేయగా రూ.7 కోట్లకు అమ్ముడుపోయాయి. ఒక్కో చేప రూ.70 లక్షల ధర పలికింది.

New Update
సముద్రంలో చేపల వేటకు వెళ్లి రాత్రికిరాత్రే కోటీశ్వరుడైన మత్స్యకారుడు..

కాలం ఎవరికి ఎప్పుడు, ఎలా ఉంటుందో ఎవరూ ఊహించలేరు. కొంతమంది రాత్రికి రాత్రే సెలబ్రిటీలు అయిపోతుంటారు. మరికొందరు కోటీశ్వరులైపోతుంటారు. ఇక ఇంకొందరు ఉన్న ఆస్తులు పొగొట్టుకుంటారు. ఇలాంటి ఊహించని పరిణామాలు ప్రపంచంలో ఎక్కడో ఓ చోట నిత్యం జరుగుతూనే ఉంటాయి. మన ఇండియాలో కూడా ఈ మధ్య ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి. కొందరికి లాటరీలు తగిలి అప్పటికప్పుడే కోటీశ్వరులైపోతున్న వారి గురించి వార్తల్లో కూడా చూస్తున్నాం. అయితే తాజాగా ఇలాంటిదే కాస్త భిన్నంగా జరిగింది. సముద్రంలో ఓ చేప దొరికి మత్స్యకారుడు రాత్రికి రాత్రే కోటీశ్వరుడైపోయాడు. ఈ ఘటన పాకిస్థాన్‌లో చోటుచేసుకుంది. ఇంతకీ ఏం జరిగిందో తెలియాలంటే ఈ వీడియో చూడాల్సిందే.

ఇక వివరాల్లోకి వెళ్తే.. కరాచీ తీరంలోని ఇబ్రహీం హైదరి గ్రామానికి చెందిన హజీ బలోచ్‌ అనే వ్యక్తి సముద్రంలో చేపలు పట్టుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే సోమవారం రాత్రి ఎప్పటిలాగే తన వద్ద పనిచేసే మత్స్యకారులతో కలిసి అరేబియా మహాసముద్రంలోకి వేటకి వెళ్లాడు. అయితే అలా వెళ్తుండగా.. అంతలోనే 10 గోల్డ్‌ఫిష్‌ (సోవా)లు అతడి వలకు చిక్కాయి. ఇక శుక్రవారం నాడు ఈ చేపలను కరాచీ హర్బర్‌లో వేలం వేయగా.. అవి మొత్తం ఏకంగా రూ.7 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి. ఒక్కో సోవా చేప రూ.70 లక్షల ధర పలికింది.

Also read: అదానీ సంస్థ రూ.13 వేల కోట్ల కుంభకోణానికి పాల్పడింది.. మొయిత్రా సంచలన ఆరోపణలు..

అయితే ఈ సోవా చేప పొట్ట నుంచి వచ్చే పదార్థాలు అనేక ఔషధ గుణాలు ఉంటాయని స్థానికులు చెప్పారు. ఈ చేపల నుంచి తీసే దారం లాంటి పదార్థాన్ని ఆపరేషన్లలో వినియోగిస్తారని తెలిపారు. సాధారణంగా ఈ చేప 20 నుంచి 40 కిలోల బరువు ఉంటుందని.. 1.5 మీటర్ల వరకు పెరుగుతుందన్నారు. అయితే ఈ సోవా చేపలు తూర్పు ఆసియా దేశాల్లో చాలా ఎక్కువగా దొరుకుతాయని వెల్లడించారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Israel-Gaza: గాజాను ఎడారిగా మార్చేయండి.. కుక్కల్నీ కూడా వదలొద్దు!

అక్టోబరు 7 నాటి హమాస్ దాడికి ప్రతీకారంగా గాజాపై యుద్ధం ప్రకటించిన ఇజ్రాయేల్.. అత్యంత దుర్మార్గపు చర్యలకు తెగబడుతోంది. గాజాను మరుభూమిగా మారుస్తోంది.పాలస్తీనియన్ పౌరులు తిరిగి రావడానికి అక్కడ ఏమీ మిగలదని ఇజ్రాయేల్ సైనికులే చెబుతున్నారు.

New Update
12

గాజాను ఇజ్రాయేల్ సైనికులు ఎడారిగా మారుస్తున్నారా? పాలస్తీనియన్లకు అక్కడ నిలువ నీడ లేకుండా చేస్తున్నారా? వారి మౌలిక సదుపాయాలను ధ్వంసం చేస్తున్నారా? నివాసానికి పనికి వచ్చే ప్రతి భవనాన్ని కూల్చి వేస్తున్నారా? వ్యవసాయ భూములను కూడా నాశనం చేస్తున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. కొంతమంది ఇజ్రాయేల్ సైనికులు తమకు పైనుంచి ఆదేశాలు ఉన్నాయని చెబుతున్నారు. పాలస్తీనియన్లు తిరిగి రాలేని విధంగా వారి ఆస్తులను ధ్వంసం చేస్తున్నామని సైనికులు అంటున్నారు. 

Also Read: Telangana: తెగ తాగేసిన మందు బాబులు..గతేడాది కంటే తెలంగాణలో భారీగా పెరిగిన మద్యం అమ్మకాలు!

ఇప్పటికే గాజాలోని దాదాపు 50 శాతం భూభాగాన్ని ఇజ్రాయేల్ తన ఆధీనంలోకి తెచ్చుకున్నట్లు తెలుస్తుంది. ఆ ప్రాంతాన్ని మిలిటరీ బఫర్ జోన్‌గా మారుస్తోంది. హమాస్‌ నాశనం చేసిన తర్వాత గాజాలో భద్రతా నియంత్రణ తమదే అని ఇజ్రాయేల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు ఇదివరకే ప్రకటించారు. కాగా, కూల్చివేతల్లో పాల్గొన్న ఒక సైనికుడు మాట్లాడుతూ.. ‘వారు ఇక్కడకు తిరిగి రావడానికి ఇంకా ఏమీ మిగల్లేదు.. ఇక వారు ఎప్పటికీ తిరిగి రాలేరు’ అని అన్నాడు. ఆ నేల బంజరు భూమిగా మారిపోతోందని ఆయన చెప్పాడు.

Also Read: Ap Kurnool MLA:ఏపీ ఎమ్మెల్యే అత్యుత్సాహం.. సీతమ్మ మెడలో తాళి కట్టిన వైనం.. వీడియో వైరల్

వేలాది మంది పాలస్తీనియన్లు నివసించే ప్రాంతాన్ని ఇజ్రాయేల్ బఫర్ జోన్‌గా మార్చింది. ఈ జోన్‌లో వ్యవసాయ భూములు కూడా ఉన్నాయి. నీటి వసతి సౌకర్యాలను, పంటలను, చెట్లను నాశనం చేయమని తమకు ఆదేశాలు వచ్చాయని  ఇజ్రాయేల్ సైనికులు తెలిపారు. బఫర్ జోన్‌ను కిల్‌ జోన్‌గా మార్చామని మరో సైనికుడు వెల్లడించాడు ‘మాపై దాడిచేసి చంపడంతో మేం ఇక్కడకు వచ్చాం. ఇప్పుడు వారిని చంపుతాం. కేవలం వారిని మాత్రమేకారు వారి భార్యలను, చిన్నారులు, పిల్లులు, కుక్కలను కూడా చంపుతున్నాం’ అని ఇంకో సైనికుడు అన్నాడు.

‘ఇజ్రాయేల్ సరిహద్దుల్లోని బఫర్ జోన్‌లోదాదాపు గాజా పౌరులు ఖాళీ చేసిన తర్వాత ప్రాథమికంగా ఇళ్లను లేదా శిథిలాల తొలగింపునకు సంబంధించిన మిషన్లను ప్రారంభించాం’ అని చెప్పాడు. ఇది మా దినచర్య అని వివరించాడు. ‘ప్రతి ప్లాటూన్‌కు ఐదు, ఆరు లేదా ఏడు ప్రదేశాలు, ఏడు ఇళ్లు కేటాయిస్తారు.. ఉదయం లేచినప్పటి నుంచి అక్కడే మేము పని చేయాలి. ధ్వంసం చేస్తున్న ప్రదేశాల గురించి లేదా ఎందుకు చేస్తున్నామో మాకు పెద్దగా తెలియదు. బహుశా ఇవి చట్టబద్ధమైనవి కావు అని నేను భావిస్తున్నాను’ అని ఆ సైనికుడు వివరించారు. అయితే, అక్కడ ఎవ్వరూ ఉండకూడదని భావిస్తోన్న ఇజ్రాాయేల్.. పూర్తిగా ఆ ప్రాంతాన్ని పూర్తిగా నాశనం చేస్తోన్నట్టు తెలుస్తోంది.

Also Read: BIG BREAKING: ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ కు పెను ప్రమాదం.. విడిపోయిన బోగీలు.. వివరాలివే!

Also Read: South Central Railway: తిరుమలకు 32 ప్రత్యేక రైళ్లు!

hamas | gaza | israel | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates

Advertisment
Advertisment
Advertisment