Bhadrachalam : 44.4 అడుగులు దాటి ప్రవహిస్తున్న గోదావరి..రెండో ప్రమాద హెచ్చరిక..!

తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద నీటి వల్ల భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 44.4 అడుగులకు చేరింది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.లోతట్టు ప్రాంతాల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారులు ఆదేశించారు.

New Update
Bhadrachalam : భద్రాచలం వద్ద తగ్గుతున్న గోదావరి!

Emergency Alert Issued As Godavari Water Rises : రెండు తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు (Heavy Rains) ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద నీటి వల్ల భద్రాచలం (Bhadrachalam) వద్ద గోదావరి నీటి మట్టం 44.4 అడుగులకు చేరింది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారులు ఆదేశించారు. నీటిమట్టం పెరగడంతో గోదావరి నది స్నానఘట్టాల ప్రాంతంలో మెట్లు వరద నీటిలో మునిగిపోయాయి.

వరద నీరు పెరగడంతో మత్స్యకారులు, ప్రజలు గోదావరి పరివాహక ప్రాంతాల వద్దకు వెళ్లవద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. నీటి ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతుండడంతో అధికారులు త్వరలోనే రెండో ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేయనున్నారు. ఉదయం 7 గంటలకు 37 అడుగులకు చేరుకున్న గోదావరి, మధ్యాహ్నం 1 గంటకు 39.5 అడుగులకు చేరింది. అనంతరం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో 40.5 అడుగులకు చేరింది. అక్కడి నుంచి సాయంత్రం 4 గంటలకు 41.03 అడుగులకు చేరడంతో, 8.61 లక్షల క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు.

సాయంత్రం 6 గంటలకు 41.09 అడుగులకు నీటిమట్టం చేరుకోవడంతో 8.85 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు అధికారులు వదిలిపెట్టారు. సాయంత్రం 8 గంటల వరకు 43.6 అడుగులకు చేరి మొదటి ప్రమాద స్థాయిని దాటి గోదావరి నీరు ప్రవహిస్తోంది. భద్రాచలం వద్ద తొమ్మిది లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. సాయంత్రం 9.30 గంటలకు 44.4 అడుగులకు చేరుకుంది.

దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఈ ప్రవాహం ఇంకా పెరిగే అవకాశం ఉందని నీటి పారుదల శాఖ అధికారులు వివరించారు. భద్రాచలం ఎగువన ఉన్న చర్ల మండలంలోని తాళిపేరు జలాశయానికి వరద నీరు భారీగా వచ్చి చేరుతుంది. దీంతో అధికారులు ఈ జలాశయం 25 గేట్లను ఎత్తి నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. దుమ్ముగూడెం మండలం వద్ద ఉన్న గుబ్బల మంగి వాగు, సీత వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో పర్ణశాల వద్ద నార చీరల ప్రాంతం వరద నీటిలో మునిగింది.

గోదావరి (Godavari) దిగువన ఉన్న ఉపనది శబరి పోటెత్తడంతో భద్రాచలం వద్ద నీటిమట్టం తక్కువ వేగంతో కిందకు ప్రవహిస్తుంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో పాటు దిగువన ఉన్న వరద పోటు వల్ల భద్రాచలం వద్ద నీటిమట్టం ఇంకా పెరిగే అవకాశం ఉందని కేంద్ర జలవనరుల శాఖ అధికారులు వివరించారు.

Also read:రైలులో పొగలు..బయటకు దూకిన ప్రయాణికులు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Ap Rain Alert:ఏపీకి వాతావరణశాఖ చల్లని కబురు.. ఈ జిల్లాల్లో వానలు!

ఉత్తరాంధ్రలో శని, ఆదివారాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అయితే, శ్రీకాకుళం, విజయనగరంలో వడగాలులు తీవ్రంగా ఉంటాయి. ఐదు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 నుంచి 45 డిగ్రీల మధ్య నమోదవుతాయని తెలిపారు.

New Update
Rains

Rains

ఏపీ ప్రజలకు ఎండల నుంచి కాస్త ఉపశమనం కలిగిస్తూ వాతావరణశాఖ చల్లని కబురు మోసుకొచ్చింది. రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని ఐఎండీ చెప్పింది. శని, ఆదివారాల్లో ఉత్తరాంధ్రలో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో-4, విజయనగరం జిల్లాలో-5, పార్వతీపురం మన్యం జిల్లాలో-8.. మొత్తం 17 మండలాల్లో తీవ్రవడగాలులు, 21 మండలాల్లో వడగాలులు ప్రభావంచూపే అవకాశం ఉన్నట్లు తెలిపారు. 

Also Read: Pahalgam Attack: పహల్గామ్ ఉగ్రదాడిలో హమాస్ హస్తం..ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్

దోర్నిపాడులో 43.8 , పెద్దదోర్నాలలో 43.8 , కడపలో 43.6 , విజయనగరంలో 42.8 డిగ్రీల చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపారు. అలాగే 139 ప్రాంతాల్లో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డు అయినట్లు సమాచారం. వచ్చే ఐదు రోజుల్లో రాయలసీమలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 నుంచి 45 డిగ్రీల మధ్యలో నమోదవుతాయని అధికారులు చెబుతున్నారు. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Also Read: Telangana: నిప్పుల కుంపటిల రాష్ట్రం.. రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

మరోవైపు మే తొలి వారంలో అల్పపీడన ద్రోణి, ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ చెబుతుంది. వాతావరణశాఖ. వచ్చే నెల రోజుల్లో ఎల్‌నినో తటస్థంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. మే మొదటి వారంలోనే సాధారణం లేదా సాధారణం కంటే ఎక్కువ వానలు పడే అవకాశాలు ఉన్నాయి.  ఏపీలోని ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి వానలకు అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఉమ్మడి కర్నూలు జిల్లాలో భానుడి భగభగలకు జనాలు అల్లాడిపోతున్నారు. గత కొద్దిరోజులుగా ఉష్ణోగ్రతలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. గురువారం దొర్నిపాడులో 43.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. 'పాణ్యం 42.5, గడివేముల 42.4, కర్నూలు అర్బన్, కొత్తపల్లి, నంద్యాలలో 42.3 , గోస్పాడు, రుద్రవరంలో 43.4, బండి ఆత్మకూరు 42.2, బనగానపల్లి, కోవెలకుంట్ల, ఉయ్యాలవాడ 42.0, డోన్, ప్యాపిలి 41.9, బేతంచెర్ల 41.6, కోడుమూరు, ఆళ్లగడ్డ 42.8, కౌతాళం 42.7,  నమోదైనట్లు అధికారులు తెలిపారు. నందికొట్కూరు, శిరివెళ్ల 41.3, శ్రీశైలం 41.2, కోసిగి, మద్దికెర, పగిడ్యాల 41.1, ఓర్వకల్లు, తుగ్గలి, చాగలమర్రి,మంత్రాలయం,  సంజామల, ఆత్మకూరు, కొలిమిగుండ్ల, పాములపాడు 41.7, కల్లూరు,  మిడుతూరులో 41.0 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి' అని అధికారులు తెలిపారు. 

Also Read: Ap Govt:ఏపీలో వారికి జీతాలు పెంచిన ప్రభుత్వం..

Also Read: ఆయుధాలతో శ్రీనగర్‌లోకి భారీగా విదేశీయులు.. ఎవిడెన్స్ ఉన్నాయంటున్న పాక్

 

ap | rain-alert | ap rain alert | heavy rain alert ap | rains | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates

Advertisment
Advertisment
Advertisment