Andhra Pradesh : ఏపీలో తిరిగి ప్రారంభం అయిన అన్న క్యాంటీన్లు.. ఎక్కడ,ఎవరు ప్రారంభించారంటే!

ఎమ్మెల్యేగా వరుసగా మూడోసారి గెలిచిన బాలయ్య బాబు ఈసారి తన పుట్టిన రోజు వేడుకలను హిందుపురంలోనే జరుపుకున్నారు. అయితే ఈ సారి పుట్టిన రోజు వేడుకల్లో ఓ ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. బాలకృష్ణ తన పుట్టినరోజు సందర్భంగా అన్న క్యాంటీన్ ను తిరిగి ప్రారంభించారు.

New Update
Andhra Pradesh : ఏపీలో తిరిగి ప్రారంభం అయిన అన్న క్యాంటీన్లు.. ఎక్కడ,ఎవరు ప్రారంభించారంటే!

Anna Canteens Re-Opened : నందమూరి నట సింహం బాలయ్య బాబు (Balakrishna) సోమవారం తన 64 వ పుట్టిన రోజు వేడుకలను (Birthday Celebrations) ఘనంగా జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో (General Elections) బాలయ్య బాబు హిందూపురం నుంచి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. బాలయ్య బాబు ప్రస్తుతం రాజకీయాలు, సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నారు.

ఎమ్మెల్యేగా ఈసారి హిందుపురం (Hindupuram) లోనే బాలయ్య బాబు తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నారు. అయితే ఈ సారి పుట్టిన రోజు వేడుకల్లో ఓ ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. హిందూపురంలో బాలకృష్ణ తన 64వ పుట్టినరోజు సందర్భంగా అన్న క్యాంటీన్ ను తిరిగి ప్రారంభించారు. 2014వ సంవత్సరంలో టీడీపీ ప్రభుత్వం అన్న క్యాంటీన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

2019లో ఎన్నికలకు కొద్ది నెలలు ముందు రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు (Anna Canteens) ఏర్పాటు చేశారు. అయితే పలు కారణాలతో 2019 ఎన్నికల్లో గెలిచిన వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాటిని మూసివేయించింది. అయితే తాము తిరిగి అధికారంలోకి వస్తే అన్నా క్యాంటీన్ తిరిగి ప్రారంభిస్తామని ప్రకటించిన కూటమి ఇప్పుడు బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రంలో మొదటి అన్న క్యాంటీన్ ని తిరిగి ప్రారంభించినట్లయింది.

Also read: మోదీ కేబినెట్‌ లో అతి చిన్న వయస్సున్న ఎంపీ తెలుగువాడే!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AP Government good news : రాష్ట్రంలో 2,260 టీచర్ పోస్టులు భర్తీ

ఏపీలో టీచర్ పోస్టులకు ప్రిపేర్ అవుతున్న ఉద్యోగార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 2260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులను సృష్టిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

New Update
Special Education Teachers |

Special Education Teachers |

AP Government good news : ఏపీలో టీచర్ పోస్టులకు ప్రిపేర్ అవుతున్న ఉద్యోగార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 2260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులను సృష్టిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల నియామకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో 1136 ఎస్జీటీలు, 1124 మందిని స్కూల్ అసిస్టెంట్ల పోస్టుల్లో నియమించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రాథమిక స్థాయిలో 1136 స్పెషల్ ఎడ్యుకేషన్ ఎస్జీటీ పోస్టుల భర్తీకి, సెకండరీ స్థాయిలో 1124 స్కూల్ అసిస్టెంట్ల పోస్టులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ ప్రత్యేక ఉపాధ్యాయులు ఆటిజం, మానసిక వైకల్యం వంటి ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థులకు విద్యను బోధించడానికి ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారు.

Also Read: గర్ల్‌ఫ్రెండ్‌ను సూట్‌కేసులో తీసుకెళ్లిన ఘటనలో బిగ్ ట్విస్ట్.. స్పందించిన యూనివర్సిటీ

డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా ప్రత్యేక విద్యా ఉపాధ్యాయుల నియామకానికి సంబంధించిన నోటిఫికేషన్ త్వరలోనే విడుదల చేయబడనుంది. ఈ ప్రక్రియ ద్వారా, విద్యార్థుల అవసరాలను పరిగణనలోకి తీసుకుని, అర్హత కలిగిన అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ నియామక ప్రక్రియలో అభ్యర్థుల విద్యా అర్హతలు, అనుభవం, ప్రత్యేక అవసరాలపై అవగాహన వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. ప్రత్యేక విద్యా ఉపాధ్యాయుల నియామకం, ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థుల విద్యా అభివృద్ధికి ఎంతో కీలకం. ఈ ఉపాధ్యాయులు, విద్యార్థుల వ్యక్తిగత అవసరాలను అర్థం చేసుకుని, వారికి అనుకూలమైన పాఠ్యక్రమాలను రూపొందిస్తారు. వారు విద్యార్థుల సామర్థ్యాలను పెంపొందించడంలో, వారి నైపుణ్యాలను అభివృద్ధి చేయడంలో, సమాజంలో సమానంగా ఉండేందుకు గల అవసరమైన నైపుణ్యాలను అందించడంలో కీలక పాత్ర పోషిస్తారు.

Also Read:  Tv Offers: వారెవ్వా ఆఫర్లు కుమ్మేశాయ్.. 40 ఇంచుల స్మార్ట్‌టీవీలు కేవలం రూ.15వేల లోపే!

రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థుల విద్యా హక్కులను పునరుద్ధరించడానికి తీసుకున్న ఒక ముఖ్యమైన నిర్ణయంగా చెప్పవచ్చు. విద్యా రంగంలో సమానత్వాన్ని ప్రోత్సహించడం, ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించడం ప్రభుత్వ లక్ష్యం. ఈ ప్రత్యేక ఉపాధ్యాయుల నియామకం ద్వారా, ప్రభుత్వం విద్యా వ్యవస్థలో సమగ్రతను పెంచాలని ఆశిస్తోంది. ప్రత్యేక విద్యా ఉపాధ్యాయుల నియామకం, రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి దోహదపడనుంది. ఈ నిర్ణయం, ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థులకు మరింత సౌలభ్యంగా ఉంటుంది. ఈ నిర్ణయం ద్వారా సమాజంలో ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలను అందించడంలో ప్రభుత్వం కృషి చేస్తోంది.ఏపీ ప్రభుత్వం చేపట్టబోయే డీఎస్సీ 2025 నోటిఫికేషన్ ఈ ఏప్రిల్ నెలలోనే విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు.

Also Read: Vijay: వక్ఫ్ సవరణ చట్టంపై హిరో విజయ్ సంచలన నిర్ణయం

Also Read: Group 1: గ్రూప్-1 అవకతవకలపై పోరాటం చేస్తాం.. TGPSCపై కేసు వేస్తా: రాకేశ్ రెడ్డి

    Advertisment
    Advertisment
    Advertisment
    తాజా కథనాలు