Nallamala Forest:నల్లమల్ల అడవుల్లో రగిలిన కార్చిచ్చు

పచ్చటి ప్రకృతికి ఆలవాలమైన నల్లమల అడవుల్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంట రేంజ్ లోని కొల్లంపెంట, కొమ్మనపెంట, పల్లెబైలు, నక్కర్ల పెంట ప్రాంతాల్లో కార్చిచ్చు వ్యాపించింది.

New Update
Nallamala Forest:నల్లమల్ల అడవుల్లో రగిలిన కార్చిచ్చు

Fire in Nallamala Forest:నల్లమల అడవుల్లో అగ్నికీలలు మరోసారి ఎగిసిపడ్డాయి. నల్లమల అడవుల్లో తరచు అగ్నిప్రమాదాలు అందోళన కలిగిస్తున్నాయి. ఇప్పుడు నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంట రేంజ్ లోని.. కొల్లంపెంట, కొమ్మనపెంట, పల్లెబైలు, నక్కర్ల పెంట ప్రాంతాల్లోని అడవుల్లో మంటలు అంటుకున్నాయి. దాదాపు 50 హెక్టార్ల విస్తీర్ణంలో అడవి దగ్ధమై ఉంటుందని అధికారుల అంచనా వేస్తున్నారు. మంటలను ఆర్పేందుకు అటవీ సిబ్బంది చర్యలు చేపట్టింది. మంటలు విస్తరించకుండా అటవీశాకాధికారులు ఫైర్ లైన్లు ఏర్పాటు చేస్తున్నారు. పచ్చికొమ్మలు, బ్లోయర్లు, ఇతర అధునాతన యంత్రాలతో సిబ్బంది మంటల్ని నియంత్రిస్తున్నారు.

Also Read:Petrol Prices in Budget : లీటర్‌ పెట్రోల్‌పై రూ.10 తగ్గింపు..? మధ్యంతర బడ్జెట్‌వైపే అందరి చూపు!

మానవతప్పిదమే అయుంటుంది...

మానవతప్పిదాల కారణంగానే అడువుల్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగుతున్నాయని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. నల్లమల అటవీ ప్రాంతం సుమారు రెండున్నర లక్షల హెక్టార్లలో విస్తరించి ఉంటుంది. ఇందులో లక్షా 75వేల హెక్టార్లు పులుల అభయారణ్యం. చెట్లరాపిడి వల్ల నిప్పు పుట్టేంత పెద్దవృక్షాలు నల్లమల అడవుల్లో లేవని అధికారులంటున్నారు. ఎవరైనా నిప్పు రవ్వల్ని వదిలితేనే... గడ్డి అంటుకుని, వేగంగా ఇతర ప్రాంతాలకు మంటలు విస్తరిస్తున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. నల్లమలలో జరిగే అగ్ని ప్రమాదాల వలన అరుదైన వృక్ష జాతి అంతా నాశనం అయిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అటవీశాఖాధికారులు. దీంతో పాటూ అక్కడ నివసించే జంతుజాలం మనుగడ కూడా కష్టమవుతుందని అంటున్నారు. మరోవైపు కొల్లంపెంట, కొమ్మనపెంట, పల్లెబైలు, నక్కర్ల పెంట ప్రాంతాల్లోని గిరిజనుల తండాలను ఖాళీ చేయిస్తున్నారు. మంటలవల్ల వారికి ఏం ప్రమాదం జరగకుండా చూసుకుంటున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

చనిపోయిన పందిని మళ్లీ బతికించారు ..!

చైనా శాస్త్రవేత్తలు అద్భుతాన్ని సృష్టించారు. చనిపోయిన పంది మెదడును మళ్లి బతికించారు. 50 నిమిషాల పాటు పనిచేయకుండా పోయిన పంది మెదడు మళ్లి పని చేయడం వైద్య శాస్త్రంలో అద్భుతం అని చెప్పవచ్చు.

author-image
By Archana
New Update

Life Style: ఇదొక మెడికల్ మిరాకిల్ అనే పదం వినే ఉంటారు. ఇప్పుడు ఇలాంటి సంఘటనే చైనాలో చోటుచేసుకుంది. చైనా శాస్త్రవేత్తలు అద్భుతాన్ని సృష్టించారు. చనిపోయిన పంది మెదడును మళ్ళీ బతికించారు. 50 నిమిషాల పాటు పనిచేయకుండా పోయిన పంది మెదడు మళ్లి పని చేయడం వైద్య శాస్త్రంలో అద్భుతం అని చెప్పవచ్చు. సాధారణంగా గుండె ఆగిపోయినప్పుడు.. మెదడు రక్తప్రసరణ కూడా ఆగిపోతుంది. ఆ తర్వాత కొన్ని నిమిషాల్లోనే మెదడు కణాలు చనిపోవడం ప్రారంభిస్తాయి. ఈ పరిస్థితి ఇస్కీమియాకు దారితీస్తుంది. ఇస్కీమియా అనేది శరీరంలో కొంత భాగానికి రక్త ప్రవాహం తక్కువగా ఉండడం. సరైన రక్త ప్రవాహం లేకపోవడం వల్ల కణజాలాలకు అవసరమైన ఆక్సిజన్‌ అందదు. ఇలాంటి పరిస్థితిల్లో మెదడుకు రక్త సరఫరా నిలిచిపోయి శాశ్వతంగా మెదడు క్షీణించటం మొదలవుతుంది. అంతేకాదు  గుండెపోటు గుండెపోటు, స్ట్రోక్స్ వంటి ప్రాణాంతక పరిస్థితులకు దారితీస్తుంది.

Also Read: 'ఆ కట్ అవుట్ చూసి అన్ని నమ్మేయాలి డ్యూడ్'! మెగాస్టార్ ట్వీట్ చూస్తే ఫ్యాన్స్ కు పూనకాలే

చైనా శాస్త్రవేత్తలు అద్భుతం 

ఇప్పుడు చైనా శాస్త్రవేత్తలు చనిపోయిన పంది మెదడును బతికించిన ఫలితాలు .. మెదడుకు రక్త సరఫరా నిలిచిపోయిన నిమిషాల వ్యవధిలోనే మెదడు శాశ్వతంగా క్షీణించటం మొదలవుతుందనే భావనను సవాలు చేసేలా ఉన్నాయి. అయితే పందులు చనిపోయిన తర్వాత నాలుగు గంటల అనంతరం వాటి మెదళ్లను పాక్షికంగా పునరుద్ధరించిన ఘటన 2019లోనూ జరిగింది. 

బ్రెయిన్ డెడ్ అంటే ఏమిటి? 

మెదడుకు రక్తం లేదా ఆక్సిజన్ సరఫరా ఆగిపోయినప్పుడు బ్రెయిన్ డెత్ సంభవిస్తుంది.

బ్రెయిన్ డెడ్ కారణాలు

  • మెదడుకు తీవ్రమైన గాయమైనప్పుడు
  • మెదడులో రక్తస్రావం జరగడం (ఇంట్రాసెరెబ్రల్ హెమరేజ్) 
  • ఇస్కీమిక్ స్ట్రోక్ ( సరైన ఆక్సిజన్ అందకపోవడం) 
  • గుండెపోటు
  • మెనింజైటిస్ లేదా ఎన్సెఫాలిటిస్ వంటి ఇంట్రాక్రానియల్ ఇన్ఫెక్షన్లు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Also Read: గంగవ్వకు బిగ్ బాస్ షాక్! పాపం అవ్వ.. ఇలా జరిగిందేంటి

Advertisment
Advertisment
Advertisment