Fire accident: బయ్యారంలో భారీ అగ్ని ప్రమాదం.. కాలి బూడిదైన మొక్కజొన్న పంట!

మహబూబ్ నగర్ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సాంబా తండాలో గుర్తు తెలియని వ్యక్తులు అడవి ప్రాంతంలో మంటపెట్టడంతో అది మొక్కజొన్న పంటకు అంటుకుని పూర్తిగా కాలి బూడిదైంది. ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు.

New Update
Fire accident: బయ్యారంలో భారీ అగ్ని ప్రమాదం.. కాలి బూడిదైన మొక్కజొన్న పంట!

Mahaboobnagar: మహబూబ్ నగర్ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సాంబా తండాలో గురువారం అనుకోకుండా చెలరేగిన మంటల కారణంగా భారీ మొత్తంలో 5ఎకరాల మొక్కజొన్న పంట కాలి బూడిదైంది. కళ్లముందే చేతికొచ్చిన పంట మంటల్లో మాడిపోతుంటే రైతులు కన్నీరుమున్నీరయ్యారు.

గుండెలు బాదుకున్న రైతులు..
ఈ మేరకు స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భూక్య శ్రీ రాములు అనే రైతు పంట 2 ఎకరాలు, బోడ లస్కర్ 1ఎకరం, బోడమంగి లాల్ 2ఎకరాలు కాలిపోయాయి. కూలీలతో కంకులు పొట్టుతీసి పొలంలో కుప్పలు పోసి ఇంటికి వెళ్లారు. అయితే సాయంత్రం సమయంలో తిరిగి పొలం వద్దకు వచ్చేసరికి మొక్క జొన్న అంటుకున్నది గమనించి ఆర్పేందుకు చాలా ప్రయత్నించారు. అయినప్పటికీ కంట్రోల్ కాలేదని, ఏమీ చేయలేక గుండెలు బాదుకుంటూ కన్నీరు మున్నీరయ్యారని తెలిపారు.

ఇది కూడా చదవండి: Parineeti: ఆ బట్టలేసుకుంటే ప్రెగ్నెంట్ అయినట్లేనా.. పరిణీతి ఫైర్!

ఇక దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు.. నర్సాపురం అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు తునికాకు ప్రూనింగ్ కాంట్రాక్టర్ కూలీలు అటవి ప్రాంతంలో నిప్పు పెట్టడంతో గాలి వాటానికి తమ మొక్క జొన్న పంటకు అంటిపోవడంతో కాలి బూడిద అయినట్లు తెలిపారు. రైతులు తీవ్రంగా నష్ణ పోయామంటూ ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

RCB Vs RR: దుమ్ము దులిపేసిన కోహ్లీ, పడిక్కల్.. ఆర్సీబీ భారీ స్కోర్ - రాజస్థాన్ టార్గెట్ ఇదే

ఆర్ఆర్‌తో మ్యాచ్‌లో ఆర్సీబీ జట్టు తొలి ఇన్నింగ్స్ పూర్తయింది. నిర్దేశించిన 20 ఓవర్లలో ఆర్సీబీ 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. దీంతో ఆర్ఆర్ ముందు 206 టార్గెట్ ఉంది. కోహ్లీ 70 పరుగులు, పడిక్కల్ 50 పరుగులతో చెలరేగిపోయారు.

New Update
RCB Vs RR

RCB Vs RR

టార్గెట్ ఎంతంటే?

చిన్నస్వామి స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య రసవత్తరమైన మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ జట్టు తొలి ఇన్నింగ్స్ పూర్తయింది. నిర్దేశించిన 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. దీంతో ఆర్ఆర్ ముందు 206 టార్గెట్ ఉంది. 

ఎవరెన్ని కొట్టారంటే?

ఫిల్ సాల్ట్ 23 బంతుల్లో 26 పరుగులు, విరాట్ కోహ్లీ 42 బంతుల్లో 70 పరుగులు, పడిక్కల్ 27 బంతుల్లో 50 పరుగులు, కెప్టెన్ రజత్ పాటిదార్ 3 బంతుల్లో 1 పరుగు చేశాడు. అలాగే మ్యాచ్ ఆఖరి వరకు ఆడిన డేవిడ్ 15 బంతుల్లో 23 పరుగులు, జితేశ్‌ శర్మ 10 బంతుల్లో 20 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 

Also read :  పహల్గాంలో భయంకరమైన కాల్పుల లైవ్ వీడియోలు.. చూశారంటే గజగజ వణకాల్సిందే!

కోహ్లీ పరుగుల వరద

32 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత కూడా దూకుడుగానే ఆడుతూ రన్స్ రాబట్టాడు. అప్పటికే రెండు సిక్సులు కొట్టి ఫ్యాన్స్‌కు మంచి ఊపు తెప్పించాడు. కానీ మరో షార్ట్ ఆడే క్రమంలో క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో 42 బంతుల్లో 70 పరుగులు చేసి ఔరా అనిపించాడు. అయితే ఈ మ్యాచ్‌లో రెండు సిక్సులు కొట్టిన కోహ్లీ.. మరో సిక్స్ కొట్టుంటే అరుదైన రికార్డు క్రియేట్ చేసి ఉండేవాడు. 

Also Read :  ఎంత దారుణంగా చంపారంటే.. బయటకు వచ్చిన ఉగ్రదాడి ఫస్ట్ వీడియో!

రికార్డు మిస్

కోహ్లీ మొత్తంగా మూడు సిక్స్‌లు కొడితే ఎవరికీ అందనంత అగ్రస్థానాన్ని కైవసం చేసుకునేవాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ మూడు సిక్స్‌లు బాదితే టీ20 క్రికెట్‌లో (ఛాంపియన్స్ లీగ్, ఐపీఎల్‌) 300 సిక్స్‌లు కొట్టిన తొలి ఆర్సీబీ బ్యాటర్‌గా కొత్త రికార్డును క్రియేట్ చేసేవాడు. కానీ మూడు సిక్సుల్లో రెండు మాత్రమే కొట్టడంతో ఆ రికార్డు మరో మ్యాచ్‌ కోసం షిఫ్ట్ అయింది. దీంతో ఇప్పుడు కోహ్లీ పేరిట 299 సిక్సులు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లో మరొక ప్లేయర్ హాఫ్ సెంచరీ చేశారు. దేవ్‌దత్‌ పడిక్కల్‌ (50) చేసి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు.

telugu-news | virat-kohli | IPL 2025 | rcb-vs-rr | latest-telugu-news 

Advertisment
Advertisment
Advertisment