PITHAPURAM: పిఠాపురంలో హైటెన్షన్.. రెచ్చిపోయిన వైసీపీ, జనసేన కార్యకర్తలు! పిఠాపురం నియోజకవర్గం విరవలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. వైసీపీ అభ్యర్థి వంగా విశ్వనాథ్ పోలింగ్ కేంద్రం దగ్గర ప్రచారం నిర్వహించడంతో జనసేన కార్యకర్తలు విశ్వనాథ్ ను అడ్డుకుని ఆందోళనకు దిగారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళన కారులను చెదరగొట్టారు. By srinivas 13 May 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి PITHAPURAM: పిఠాపురం నియోజకవర్గం విరవలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. వైసీపీ అభ్యర్థి వంగా విశ్వనాథ్(Vanga Geetha Viswanatham) పోలింగ్ కేంద్రం దగ్గర ప్రచారం నిర్వహించడంతో జనసేన కార్యకర్తలు విశ్వనాథ్ ను అడ్డుకుని ఆందోళనకు దిగారు. దీంతో వైసీపీ, జనసేన కార్యకర్తలమధ్య వాగ్వాదం ముదరడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళన కారులను చెదరగొట్టారు. ఈ క్రమంలోనే జనసేన సానుభూతిపరుల ఓట్లు తొలగించారని పిఠాపురం మండలం గోకవాడలోనూ జనసైనికులు నిరసనలు చేపట్టారు. కొత్తపల్లి మండలం నాగులపల్లి, ఇసుకపల్లి గ్రామాల్లోనూ అవకతవకలు జరిగాయంటూ నిరసనకు దిగారు. వైసీపీ నాయకుడు వడిశెట్టి నారాయణరెడ్డిని జనసైనికులు అడ్డుకోవడంతోపాటు నారాయణ రెడ్డి కారును సైతం జనసైనికులు వెంబడించించారు. Read Also: Chandrababu: వంద కాదు వేయి శాతం గెలుస్తాం.. చంద్రబాబు సంచలన ఇంటర్వ్యూ #pitapuram #janasena #ycp సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి