Kerala: కూతురిపై తండ్రి అత్యాచారం కేసు.. కోర్టు సంచలన తీర్పు! కన్న తండ్రి కూతురిపై లైంగిక దాడి చేసిన కేసులో కేరళ ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. నిందితుడికి 104 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు లక్ష జరిమానా విధించింది. జరిమానా మొత్తాన్ని బాధితురాలికి అందివ్వాలని ఆదేశించింది. By srinivas 22 Jun 2024 in క్రైం Latest News In Telugu New Update షేర్ చేయండి Rape case: కేరళలో ఇటీవల కన్న కూతురిపైనే తండ్రి లైంగిక దాడికి పాల్పడిన కేసులో కేరళ ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 17 ఏళ్ల కూతురిని బలవంతంగా లొంగదీసుకుని దారుణానికి పాల్పడినందుకు నిందితుడికి 104 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు లక్ష జరిమానా విధించింది. నిందితుడు చెల్లించే జరిమానా మొత్తాన్ని బాధితురాలికి ఇవ్వాలని ఆదేశించింది. నిందితుడిని తవనూరు సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ కేసు వివరాల్లోకి వెళితే.. కేరళలోని అరికోడ్ కి చెందిన ఓ వ్యక్తికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2006లో జన్మించిన తన కుమార్తెకు పదేళ్లు వచ్చినప్పటినుంచి తండ్రి నిత్యం లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. ఈ విషయం బయటకి చెప్తే చంపేస్తానని బెదిరించేవాడు. దీంతో ఆ బాలిక దారుణాన్ని బయటకు చెప్పలేదు. బాధితురాలు అనారోగ్యానికి గురి కావడంతో తండ్రి ఆసుపత్రి తీసుకెళ్లాడు. బాలికను పరీక్షించిన వైద్యులు కోజీకొడ్ లోని మెడికల్ కాలేజీకి రిఫర్ చేశారు. వైద్యుల సలహా మేరకు మెడికల్ కాలేజీలో ఆ బాలికకు అబార్షన్ చేశారు. ఆ తర్వాత ధైర్యం చేసిన బాలిక తండ్రి చేస్తున్న అకృత్యాలపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుడిని అదుపులోకి తీసుకొన్న పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. అంతేగాక నిందుతుడికి బెయిల్ ఇస్తే బాలికకు ప్రమాదం తలపెట్టే అవకావం ఉందని కోరడంతో కోర్టు నిందుడికి బెయిల్ ఇవ్వలేదు. #kerala-court #sexually-assaults #daughter #father సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి