Crime: కీచక తండ్రికి 150 ఏళ్ల జైలు శిక్ష.. కేరళ కోర్టు సంచలన తీర్పు

16 ఏళ్ల కూతురిపై కన్న తండ్రి అత్యాచారానికి పాల్పడిన 2022 కేసులో కేరళ ఫాస్ట్‌ట్రాక్‌ స్పెషల్‌ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. పొక్సో, ఐపీసీ, జువైనల్‌ చట్టాల్లోని వివిధ సెక్షన్ల కింద మొత్తం 150 ఏళ్లు శిక్ష విధించింది. ఈ శిక్షలన్నీ ఏకకాలంలో అనుభవించాలని కోర్టు ఆదేశించింది.

New Update
Crime: కీచక తండ్రికి 150 ఏళ్ల జైలు శిక్ష.. కేరళ కోర్టు సంచలన తీర్పు

Kerala: మైనర్ కూతురిపై కన్న తండ్రి అత్యాచారానికి పాల్పడిన కేసులో కేరళ కోర్టు (Kerala court) సంచలన తీర్పు వెల్లడించింది. కన్నబిడ్డనే కాటేసిన దుర్మార్గుడికి తగిన శిక్ష విధించింది. ఈ మేరకు శుక్రవారం తుది విచారణ చేపట్టిన ఫాస్ట్‌ట్రాక్‌ (Fast track) స్పెషల్‌ కోర్టు-2 పలుసార్లు అఘాయిత్యానికి పాల్పడిన నేరానికి 150 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

2022లో సంఘటన..
ఇక వివరాల్లోకి వెళితే.. కేరళ రాష్ట్రంలోని మలప్పురం జిల్లాలోని కలికావు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో 2022లో ఈ దారుణ సంఘటన చోటుచేసుకుంది. 42 ఏళ్ల వ్యక్తి ముగ్గురు మహిళలను పెళ్లిచేసుకోగా.. అందులో ఒక భార్య కుతురి (16)పై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో అనేకసార్లు ఆమెను బెదిరించి దారుణానికి ఒడిగట్టాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రాగా గతంలో నిందితుడిని అరెస్ట్ చేశారు.

150 ఏళ్లు శిక్ష..
అయితే ఈ కేసును శుక్రవారం విచారించిన ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు.. పోక్సో, ఐపీసీ, జువైనల్‌ చట్టాల్లోని వివిధ సెక్షన్ల కింద మొత్తం 150 ఏళ్లు శిక్ష విధించింది.16 ఏళ్లలోపు బాలికపై అత్యాచారానికి పాల్పడినందుకు ఐపీసీ 376 (3) కింద 30 ఏళ్లు, 16 ఏళ్లలోపు చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడినందుకు పోక్సో చట్టంలోని సెక్షన్‌ 4(2) కింద 30 ఏళ్లు శిక్ష విధించింది.

ఇది కూడా చదవండి: Chiru: మెగా హీరో.. ‘పద్మ విభూషణ్‌’ చిరంజీవి ప్రస్థానమిదే!

భారీ జరిమానా..
అంతేకాదు పదే పదే చిన్నారిపై లైంగిక దాడి పాల్పడినందుకు, కుటుంబ సభ్యుడే ఈ అత్యాచారానికి పాల్పడిన నేరానికి పోక్సో చట్టంలోని వివిధ సెక్షన్ల కింద 40+40 ఏళ్లు చొప్పున శిక్ష వేసింది. జువైనల్‌ యాక్ట్‌ కింద గృహంలోకి అక్రమంగా చొరబడినందుకు 7 ఏళ్లు, చిన్నారిపై క్రూరంగా వ్యవహరించినందుకు మూడేళ్లు కలిపి 10 ఏళ్లు శిక్ష అమలు చేయబోతున్నట్లు తెలిపింది. నిందితుడు రూ.4 లక్షల రూపాయలు జరిమానా చెల్లించాలని, అందులో రూ.2 లక్షలు బాధితురాలికి పరిహారంగా చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఈ శిక్షలన్నీ ఏకకాలంలో అనుభవించాలని కోర్టు ఆదేశించింది. ఈ తీర్పుపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి దారుణాలకు పాల్పడే వారందరినీ కఠినంగా శిక్షిస్తేనే మళ్లీ ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా ఉంటాయంటున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

ఎంత దారుణంగా చంపారంటే.. బయటకు వచ్చిన ఉగ్రదాడి ఫస్ట్ వీడియో!

జమ్మూ కాశ్మీర్‌లోని ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరుగుతున్న వీడియో బయటకు వచ్చింది. కేవలం పర్యాటకులను మాత్రమే టార్గెట్ చేసుకుని కాల్పులు జరిపారు. అందులో కూడా మతం, పేర్లు అడిగి మరి కాల్పులు జరిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

New Update

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 28 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే పహల్గామ్‌లో ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరుగుతున్న వీడియో బయటకు వచ్చింది. కేవలం పర్యాటకులను మాత్రమే టార్గెట్ చేసుకుని కాల్పులు జరిపారు. అందులో కూడా మతం, పేర్లు అడిగి మరి కాల్పులు జరిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఇది కూడా చూడండి: TG Crime: కోడలిపై మోజుతో కొడుకును లేపేసిన తండ్రి.. రోకలి బండతో కొట్టి చంపి!

ఇది కూడా చూడండి: Betting Apps Pramotion Case : ప్రభుత్వం సంచలన నిర్ణయం..సెలబ్రిటీ బెట్టింగ్ యాప్స్ కేసు సీఐడీకి బదిలీ

మొత్తం 28 మంది..

ఇదిలా ఉండగా మినీ స్విట్జర్లాండ్‌గా పేరుపొందిన పహల్గాంలోని బైసారన్‌ ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో 28 మంది టూరిస్టులు మృతి చెందగా.. మరో 20 మందికి పైగా గాయాలపాలయ్యారు. మృతుల్లో ఇద్దరు విదేశీయులు కూడా ఉన్నారు. వాళ్లలో ఒకరు నేపాలీ కాగా మరొకరు యూఏఈ. మిగతావారు భారత్‌లోని మహారాష్ట్ర, గుజరాత్, యూపీ, హర్యానా, బీహార్, కర్ణాటక రాష్ట్రాలకు చెందినవారు ఉన్నారు.  

ఇది కూడా చూడండి: Indus River Agreement: 64 ఏళ్ళ ఒప్పందానికి స్వస్తి..ఎడారిగా మారనున్న పాకిస్తాన

ఇది కూడా చూడండి: Sunstroke: వడదెబ్బకు ఏడుగురు మృతి.. మరో రెండ్రోజులు వడగాల్పులు

Advertisment
Advertisment
Advertisment