Road Accident : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు బైకులు ఢీకొని! ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయనగరం జిల్లా రామభద్రాపురం కొటక్కి వద్ద రెండు బైకులు ఢీ కొనడంతో అక్కడికక్కడే ముగ్గురు దుర్మరణం చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. By srinivas 28 Mar 2024 in విజయనగరం టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి AP : ఏపీలో గురువారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. విజయనగరం(Vijayanagaram) జిల్లా రామభద్రాపురం కొటక్కి వద్ద రెండు బైకులు ఢీ కొనడంతో అక్కడికక్కడే ముగ్గురు దుర్మరణం చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టంకు, గాయపడ్డవారిని తరలించారు. ఇది కూడా చదవండి: Pub Accident : పబ్లో విషాదం.. ముగ్గురు దుర్మరణం అతివేగమే కారణం.. అయితే ఈ ప్రమాదానికి అతివేగమే(Over Speed) కారణమని పోలీసులు తెలిపారు. మృతుల కుటుంబాలకు సమాచారం అందించినట్లు తెలిపారు. ఇక వాహనదారులు డ్రైవింగ్(Driving) విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అతివేగంగా వాహనాలు నడపొద్దని హెచ్చరించారు. కుటుంబ సభ్యులను దృష్టిలో ఉంచుకుని వాహనాలు నడపాలని కోరారు. రూల్స్ అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. #three-people-died #road-accident #road-accident-in-ap #vijayanagaram-news సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి