Delhi Metro: రైతుల ఉద్యమం పుణ్యమా అంటూ ఢిల్లీ మెట్రో రికార్డు సృష్టించింది!

రైతు సంఘాలు తమ డిమాండ్లను పరిష్కారించాలంటూ నిరసన కార్యక్రమాలతో భారీగా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడుతుంది. దీంతో ప్రయాణికులు మెట్రోను ఆశ్రయించారు. దీంతో ఒక్కరోజే ఢిల్లీ మెట్రోలో సుమారు 71.09 లక్షల మంది ప్రయాణించి రికార్డు సృష్టించారు.

New Update
Delhi Metro: రైతుల ఉద్యమం పుణ్యమా అంటూ ఢిల్లీ మెట్రో రికార్డు సృష్టించింది!

Delhi Metro: గత కొద్ది రోజులుగా రైతు సంఘాలు తమ డిమాండ్లను పరిష్కారించాలంటూ నిరసన వ్యక్తం (Farmers Protest) చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వారి నిరసన కార్యక్రమాలతో భారీగా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్‌ జామ్‌ (Traffic Jam) ఏర్పడుతుంది. అంతేకాకుండా కొన్ని రూట్లను ట్రాఫిక్‌ అధికారులు మూసి వేసి వేరే రూట్లలో వెళ్లాలని ప్రయాణికులకు, వాహనాదారులకు సూచిస్తున్నారు.

దీంతో పది నిమిషాల ప్రయాణానికి కూడా గంటల సమయం పడుతుండడంతో విసిగి పోయిన ప్రయాణికులు మెట్రోను ఆశ్రయిస్తున్నారు. దీంతో రోజువారీ కంటే అధికంగా మెట్రోలో (Metro)  ప్రయాణించేవారు ఎక్కువ అయ్యారు. కేవలం మంగళవారం ఒక్కరోజే ఢిల్లీ మెట్రోలో సుమారు 71.09 లక్షల మంది ప్రయాణించి రికార్డు సృష్టించారు.

ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) బుధవారం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో ఒక పోస్ట్‌లో డేటాను పంచుకుంది,. గత సెప్టెంబర్‌లో సాధించిన మునుపటి రికార్డును బద్దలు కొట్టినట్లు పేర్కొంది. గత ఏడాది సెప్టెంబర్ 4న ఢిల్లీ మెట్రోలో రోజువారీ ప్రయాణికుల సంఖ్య 71.03 లక్షలు కాగా, ఆగస్టు 29, 2023 నాటికి 69.94 లక్షలు.

మంగళవారం, ఢిల్లీకి రైతుల పాదయాత్రను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ మెట్రో తొమ్మిది స్టేషన్లలో కొన్ని గేట్లను చాలా గంటలపాటు మూసివేసి ప్రయాణికుల ప్రవేశ, నిష్క్రమణలను నియంత్రించింది. ప్రయాణికులు ఇతర గేట్ల ద్వారా ఈ స్టేషన్లలోకి ప్రవేశించడానికి, నిష్క్రమించడానికి అనుమతించడం జరిగింది.

ఢిల్లీ మెట్రో జాతీయ రాజధాని ప్రాంతంలో ప్రజా రవాణాలో ప్రధాన మార్గం అని ప్రయాణికులు నిరూపించారని DMRC ఒక ప్రకటనలో తెలిపింది. ఫిబ్రవరి 13న మెట్రోలోని వివిధ కారిడార్‌లలో రోజూ 71,09,171 మంది ప్రయాణికులు రైళ్లలో ప్రయాణించారు. డేటా ప్రకారం రెడ్‌లైన్‌లో 7,57,629 మంది, ఎల్లో లైన్‌లో 19,34,568 మంది, గ్రీన్‌లైన్‌లో 3,35,350 మంది, ర్యాపిడ్ మెట్రోలో 51,910 మంది ప్రయాణించారు.

Also read:  ఇక నుంచి బుర్జ్‌ ఖలీఫా మాత్రమే కాదు.. ఈ ఆలయం కూడా: మోడీ!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Waqf Amendment Act: అమలులోకి వక్ఫ్ బోర్డ్ సవరణ చట్టం 2025.. నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్రం

వక్ఫ్ బోర్డ్ సవరణ చట్టం 2025 నేటి (ఏప్రిల్ 8) నుంచి అమలులోకి వస్తోందని కేంద్రం ఓ నోటిఫికేషన్ రిలీస్ చేసింది. గతవారం పార్లమెంట్‌ ఉభయసభలు సవరణ చట్టాన్ని ఆమోదించాయి. ఆ బిల్లు నేడు రాష్ట్రపతి అమోదం పొందింది. దీంతో వక్ఫ్ భూముల నిర్వాహణలో చాలా మార్పులు వచ్చాయి.

New Update
Waqf Bill

Waqf Bill

Waqf Amendment Act: పార్లమెంట్‌లో వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు 2025 ఆమోదం పొందిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి బిల్లుకు ఆమోదం ఆమోదించగా.. ఎప్పటి నుంచి అమలులోకి వస్తుందన్న విషయం ప్రకటించలేదు. దీంతో కేంద్రం ఈ అంశంపై క్లారిటీ ఇస్తూ ఈరోజు ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈమేరకు నేటినుంచి (ఏప్రిల్ 8) నుంచి దేశంలో వక్ఫ్‌ సవరణ చట్టం అమలులోకి వచ్చింది. గతవారం పార్లమెంట్‌ ఉభయసభలు సవరణ చట్టాన్ని ఆమోదించి.. రాష్ట్రపతికి పంపిన విషయం తెలిసిందే. కేంద్రం పంపిన వక్ఫ్‌ చట్టం సవరణ బిల్లును ఏప్రిల్‌ 8న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బిల్లును ఆమోదించారు. 

Also read: 71మంది చనిపోయిన బాంబు బ్లాస్ట్ కేసులో నలుగురికి జీవిత ఖైదు

Also read: Pavan kalyan son : అప్పుడు తెలియలేదు.. విషయం ఇంత సీరియస్ అని : పవన్ కళ్యాణ్

రెండు బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారని న్యాయ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఏప్రిల్ 4న రాజ్యసభ బిల్లుకు అనుకూలంగా 128 ఓట్లు, వ్యతిరేకంగా 95 ఓట్లు రాగా, లోక్‌సభ సుదీర్ఘ చర్చ తర్వాత ఏప్రిల్ 3న బిల్లుకు ఆమోదం తెలిపింది. లోక్‌సబలో 288 మంది ఎంపీలు అనుకూలంగా, 232 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. గతంలో ఉన్న చట్టం1995లో సవరించినది. కొత్తగా తీసుకువచ్చిన చట్టం ప్రకారం.. ఎవరైనా వక్ఫ్ ఆస్తిగా ప్రకటించాలంటే ఆ వ్యక్తి కనీసం ఐదేళ్లు ఇస్లాం ఆచరించి ఉండాలి. ఆస్తి అతనికి మాత్రమే సొంతమై ఉండాలి. సవరణ చట్టంలో ‘వక్ఫ్ బై యూజర్’ నిబంధన తొలగించారు. 

Also read: 71మంది చనిపోయిన బాంబు బ్లాస్ట్ కేసులో నలుగురికి జీవిత ఖైదు

వక్ఫ్ భూముల సర్వే బాధ్యత సర్వే కమిషనర్ నుంచి కలెక్టర్‌కు బదిలీ చేశారు. వక్ఫ్ ఆస్తుల వివరాలు ఆరు నెలల్లో కేంద్రీయ పోర్టల్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. వక్ఫ్ బోర్డుల్లో ఇద్దరు స్త్రీలతో పాటు ఇద్దరు ముస్లిమేతర సభ్యులను సైతం చేర్చాల్సి ఉంటుంది. ట్రిబ్యునల్ నిర్ణయా మాత్రమే అంతిమం కాదు. 90 రోజుల్లో హైకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇకపై వక్ఫ్ బోర్డులకు ఏకపక్షంగా ఆస్తులను వక్ఫ్‌గా ప్రకటించే అధికారం ఉండబోదు.

Also read: BIG BREAKING: ‘సింగపూర్‌లో పవన్ కళ్యాణ్ కొడుక్కి ప్రధాని మోదీ సాయం’

Advertisment
Advertisment
Advertisment