RTV Fact Check: ఆర్టీవీపై పనికిమాలిన ఫేక్ ప్రచారాలు.. ఈ అసత్యాల వెనుక ఉన్న చెంచాగాళ్లు ఎవరంటే?

ఆర్టీవీపై ఈడీ దాడులు చేసిందంటూ ఓ ఫేక్‌ న్యూస్‌ను ప్రచారం చేస్తున్నారు ఫేక్‌గాళ్లు. సొంతంగా బురదజల్లే దమ్ములేక ఫేక్‌ యూట్యూబ్‌ ఛానెల్స్‌ ద్వారా తప్పుడు వార్తలు ప్రసారం చేయిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీవీకి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక ఇలాంటి ఫేక్‌ న్యూస్‌ అల్లుతున్నారు!

New Update
RTV Fact Check: ఆర్టీవీపై పనికిమాలిన ఫేక్ ప్రచారాలు.. ఈ అసత్యాల వెనుక ఉన్న చెంచాగాళ్లు ఎవరంటే?

ఒకరి ఎదుగుదలను చూసి ఓర్వ లేని కుళ్లుబోతులు మన కళ్ల ముందే తిరుగుతుంటారు. కొంతమంది టీవీల్లో కనిపిస్తుంటారు. నోటికి వచ్చింది మాట్లాడుతూ అడ్డగోళ్ల ప్రచారాలు చేస్తుంటారు. ఒకరి దూకుడును, గెలుపును ఎలా ఎదుర్కొవాలో తెలియక అసత్య ప్రచారాలు చేస్తుంటారు. తెలుగు నంబర్‌-1 యూట్యూబ్‌ ఛానెల్‌గా తెలుగునాట విశేష ఆదరణ పొందుతున్న ఆర్టీవీ(RTV)పైనా అదే 'అసత్య' అస్త్రంతో తప్పుడు వార్తలను చిత్రికరీస్తున్నారు. ఫేక్‌ ప్రచారాలు చేస్తూ కొన్ని యూట్యూబ్‌ ఛానెల్స్‌ పబ్బం గడుపుతున్నాయి.

ఈ చెంచా రాతలు ఎందుకు?
ఓ యూట్యూబ్‌ ఛానెల్‌, ఓ వెబ్‌సైట్‌, సోషల్‌మీడియాలో కొందరు పనిగట్టుకోని ఆర్టీవీపై ఫేక్‌ ప్రచారానికి తెరతీశారు. ఆర్టీవీపై ఈడి దాడులు చేసిందన్నది ఆ ఫేక్‌ న్యూస్‌ సారాంశం. నోటికి వచ్చింది చెబుతూ చేతికి వచ్చింది రాస్తూ అవే నిజాలని జనాల్ని బురిడి కొట్టించాలని అనుకుంటే ఎలా? ప్రజలేమీ అంత అమాయకులు కారు. ఆర్టీవీకి ఉన్న ఇంటిగ్రిటీ వారికి తెలియనిది కాదు. ఇలాంటి చెంచా రాతలు,కథనాలు ఎవరూ నమ్మరని ఈ తప్పుడు వార్తల వెనుక ఉన్నవారు తప్పకుండా తెలుసుకోవాల్సి ఉంటుంది.

ఎందుకీ ఫేక్‌ చెంచా వార్తలు?
నిజానికి మెయిన్‌స్ట్రీమ్‌ మీడియాలో కొందరు రాజకీయ పార్టీలకు చెంచాలగా మారారని ప్రజలందరికి తెలుసు. వారంతా ఎన్నికల సమయంలో ఆర్టీవీ దెబ్బకు జెండా ఎత్తేసినట్టే కనిపిస్తున్నారు. అటు ఏపీ, తెలంగాణ ఎన్నికల ఫలితాలను అంచనా వెయ్యడంలో ఆర్టీవీ మిగిలిన సంస్థల కంటే సక్సెస్ సాధించింది. అటు వ్యూయర్‌షిప్‌ విషయంలోనూ ఆర్టీవీ మిగిలిన ఛానెల్స్‌ను బీట్ చేసింది. దీన్ని చూసి ఓర్వలేని కొందరు కుళ్లుబోతులు పనిగట్టుకోని కొన్ని యూట్యూబ్‌ ఛానెల్స్‌తో ఆర్టీవీపై ఫేక్ ప్రచారాలు చేయిస్తున్నారు. ఆ ఫేక్‌ ప్రచారాన్ని కూడా సొంతంగా చేసుకోలేని దుస్థితి వారిది. అందుకే ఫేక్‌ యూట్యూబ్‌ ఛానెల్స్‌ను అడ్డుపెట్టుకోని దొంగనాటకాలు ఆడే ప్రయత్నం చేస్తున్నారు ఫేక్‌గాళ్లు. కానీ జనాలకు అన్ని తెలుసు.. ఇలా పక్కవాళ్ల మీద బురదజల్లే కార్యక్రమం మానుకోని వారి పని వారు చేసుకోని.. చేసిన తప్పులను రిపీట్ చేయకుండా చూసుకుంటే బెటర్. ఇలాంటి చెంచా మైండ్‌సెట్‌తో చెంచా ఫేక్‌ వార్తలు ప్రచారం చేస్తూ ప్రజలతో మనసుల్లో చెంచాలుగా మిగిలిపోవడం ఏ మాత్రం మంచిది కాదు కదా!

Also Read: టీమిండియా కెప్టెన్సీ రేసులో ఆ నలుగురు.. ఎవరికి ఎక్కువగా ఛాన్స్ ఉందంటే?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Aghori First Wife: అఘోరీని ఉరి తియ్యండి.. వాడికి భయంకరమైన శక్తులు- మొదటి భార్య సంచలన నిజాలు!

అఘారీ మొదటి భార్య రాధిక సెన్సేషనల్ వ్యాఖ్యలు చేసింది. అఘోరీకి ఉరిశిక్షే సరైన న్యాయమని తెలిపింది. ఆమెకు భయంకరమైన వశీకరణ శక్తులు ఉన్నాయని పేర్కొంది. తాను కూడా అఘోరీ ఏం చెప్తే అది వినేదాన్ని అని తెలిపింది. దీంతో ఆమె వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.

New Update

అఘోరీ అలియాస్ అల్లూరి శ్రీనివాస్ ఎపీసోడ్ హాట్ టాపిక్‌గా మారింది. పోలీసులు అతడ్ని అరెస్టు చేశారు. అనంతరం 14 రోజుల రిమాండ్‌ కోసం సంగారెడ్డి సబ్ జైలుకు తరలించారు. అయితే అక్కడ మరింత హైడ్రామా నడిచింది. అఘోరీ జండర్ తెలీకుండా జైల్లో ఉంచుకోమంటూ జైలు అధికారులు చెప్పడంతో మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ వైద్య పరీక్షల అనంతరం అఘోరీ ట్రాన్స్‌జెండర్‌గా నిర్దారించి జైల్లో ప్రత్యేక బ్యారక్‌లో ఉంచారు. 

Also Read :  ఎంత దారుణంగా చంపారంటే.. బయటకు వచ్చిన ఉగ్రదాడి ఫస్ట్ వీడియో!

పూర్తిగా జైల్లోకి వెళ్తేనే

ఈ నేపథ్యంలో అఘోరీ సంబంధించి చాలా మంది బాధితులు ఉన్నారు. ఇప్పుడిప్పుడే ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. మొదటి మోసపోయింది మాత్రం నేనే అంటూ అఘోరీ ఫస్ట్ వైఫ్ రాధిక మీడియా ముందుకు వచ్చారు. తాజాగా రాధిక మరోసారి RTVతో మాట్లాడింది. ఇందులో భాగంగా అఘోరీకి సంబంధించిన మరిన్ని విషయాలు పంచుకుంది. అఘోరీ అరెస్ట్ అవడం తనకు ఎంతో ఆనందంగా ఉంది అని తెలిపింది. కానీ ఇది కేవలం సగం మాత్రమేనని.. పూర్తిగా జైల్లోకి వెళ్లిన తర్వాతే తాను ఫుల్ హ్యాపీగా ఉంటానని తెలిపింది. 

Also Read : ఇకపై పాకిస్తాన్‌తో ఎలాంటి మ్యాచ్‌లు ఉండవు : బీసీసీఐ

పురుష బాధితులు

అఘోరీ దైవం అనే ముసుగులో వచ్చినపుడు దైవభక్తితోనే ఉండాలే తప్ప.. కూతురు, శిష్యురాలు అని చెప్పి పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదని తెలిపింది. అఘోరీ బాధితులు చాలా మందే ఉన్నారని పేర్కొన్నారు. ఆ లిస్టులో ఆడవారే కాకుండా మగవారు కూడా ఉన్నారని చెప్పుకొచ్చారు. అఘోరీ ఒక ట్రాన్సజెండర్.. అతడు తన మాటలతో ఎవరినైనా మాయ చేసేస్తాడు. ఎలాంటి వారినైనా లొంగదీసుకుంటాడు. అఘోరీ మాయలో పడిన వారు బయటకు రావడం చాలా కష్టం అని ఆమె తెలిపారు. 

ఉరిశిక్ష పడాల్సిందే

ఆయన మాటలకు ఎవరైనా పడిపోవలసిందే అని చెప్పుకొచ్చింది. ఇక అఘోరీకి కఠిన శిక్ష పడాలని.. అది కూడా ఉరిశిక్ష వేయాలని తెలిపింది. అదే అసలైన న్యాయం అని పేర్కొంది. అఘోరీకి వశీకరణ శక్తులు ఉండొచ్చని.. తాను కూడా అఘోరీ ఉన్నంత సేపు ఏం చెప్తే అదే వినేదాన్ని అని తెలిపింది. దీంతో ప్రస్తుతం ఆమె చెప్పిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. 

aghori Arrest | lady aghori arrest | lady aghori arrest news | lady aghori arrest updates | Radha Reaction On Aghori Arrest | latest-telugu-news | telugu-news | Aghori First Wife

Advertisment
Advertisment
Advertisment