Union Budget 2024: మందుబాబులూ ఇది విన్నారా! బడ్జెట్ లో మీకోసం అదిరిపోయే గుడ్ న్యూస్!

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 పూర్తి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా మద్యం ధరలను తగ్గించే అవకాశాన్ని ప్రభుత్వం బడ్జెట్‌లో కల్పించిందని బడ్జెట్ అనంతర విశ్లేషణలో అర్ధం అవుతోంది. అలా ఎలా అని ఆశ్చర్యపోతున్నారా? ఈ ఆర్టికల్ చదివేయండి మరి.  

New Update
Union Budget 2024: మందుబాబులూ ఇది విన్నారా! బడ్జెట్ లో మీకోసం అదిరిపోయే గుడ్ న్యూస్!

Union Budget 2024: 2024-25 పూర్తి బడ్జెట్‌ను సమర్పిస్తున్నప్పుడు, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) కొత్త ఆదాయపు పన్ను విధానంలో అనేక ముఖ్యమైన మార్పులు చేశారు. ఒకవైపు స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని పెంచగా, మరోవైపు పన్ను శ్లాబ్‌ను కూడా మార్చారు. ఇప్పుడు మధ్యతరగతి వర్గాలకు ఇది ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చు కానీ.. ఆ బాధను మరచిపోయేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. దేశవ్యాప్తంగా మద్యం ధరలను తగ్గించే విధంగా బడ్జెట్‌లో మార్పు వచ్చింది.

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగాన్ని సమర్పించినప్పుడు, ప్రత్యక్ష పన్ను (ఆదాయపు పన్ను)తో పాటు, ఆమె అనేక పరోక్ష పన్నుల (కస్టమ్స్ డ్యూటీ మరియు GST మొదలైనవి) గురించి కూడా మాట్లాడారు. ఇందులో మద్యం చౌకగా లభించేలా ఒక్క నిబంధన ఉంది.

ENA పై సెంట్రల్ జీఎస్టీ ఉండదు..
 మానవ వినియోగం కోసం ఆల్కహాలిక్ పానీయాలను తయారు చేయడంలో ఉపయోగించే ముఖ్యమైన పదార్థాన్ని ENA అని పిలుస్తారు.  అంటే ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్. సెక్షన్ 9ని సవరించడం ద్వారా ప్రభుత్వం ఇప్పుడు దానిని సెంట్రల్ జీఎస్టీ పరిధి నుంచి తప్పించింది. ఇది మాత్రమే కాదు, దీని కోసం, CGST తో పాటు, ఇంటిగ్రేటెడ్ GST (IGST) కేంద్ర పాలిత ప్రాంతాల GST (UTGST) లలో కూడా అవసరమైన మార్పులు చేయాలని ప్రభుత్వం తెలిపింది.

Union Budget 2024: ఇలా చేయడం ద్వారా ప్రభుత్వం ఇప్పుడు దేశంలో అంతర్గత వాణిజ్యం..  విదేశాల నుండి దిగుమతి చేసుకునే ENA ఖర్చును తగ్గిస్తుంది. అయితే దీనిపై రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయనేది జీఎస్టీ కౌన్సిల్ తదుపరి సమావేశంలో తేలనుంది. ఖర్చు తగ్గింపు వల్ల ప్రజల జేబుల్లోకి ఎంత ప్రయోజనం చేరుతుందో అప్పుడే తెలుస్తుంది.

ఈఎన్‌ఏపై పన్ను రద్దు తర్వాత మద్యం చౌకగా మారుతుంది
Union Budget 2024: ఈఎన్‌ఏపై పన్ను రద్దు చేయడం వల్ల సామాన్యులకు లభించే మద్యం ధర ఎలా తగ్గుతుంది అని మీకు సందేహం రావచ్చు.   జిఎస్‌టి చట్టంలో ఒక నిబంధన ఉంది. భుత్వం ఏదైనా వస్తువుపై జిఎస్‌టి తగ్గిస్తే అప్పుడు దాని ప్రయోజనాలను ప్రజలకు విస్తరించడంతప్పనిసరి అని ఆ నిబంధన చెబుతుంది. అందువల్ల ఇప్పుడు ప్రభుత్వం ఈఎన్‌ఏపై పన్నును తొలగిస్తే మద్యం తయారీ కంపెనీల ధరలు తగ్గుతాయి. దీని ప్రయోజనాలను వినియోగదారులకు బదిలీ చేయాల్సి ఉంటుంది. 

ఆగండాగండి అయిపోలేదు.. ఇక్కడ ఇంకో తిరకాసు కూడా ఉంది.. అదేంటంటే, ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాలపై ఆధారపడి ఉంటుంది.  ఎందుకంటే మద్యంపై పన్ను రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోకి  కూడా వస్తుంది. అటువంటి పరిస్థితిలో, దానిపై అదనపు పన్ను విధించవచ్చు లేదా కేంద్ర ప్రభుత్వం తగ్గించిన పన్నునే విధించడం ద్వారా మద్యం ధరలను అదే స్థాయిలో ఉంచవచ్చు. ఒకవేళ ఆ టాక్స్ రాష్ట్రప్రభుత్వాలు తగ్గించాయని అనుకుంటే.. మందుబాబులకు తక్కువ ధరల్లోని మద్యం దొరుకుతుంది. రాష్ట్రాలు మేమివ్వం.. అని అన్నయ్యని అనుకోండి.. అప్పుడు రాష్ట్ర ఖజానాలకు మరింత ఆదాయం మందు ద్వారా వచ్చిపడుతుంది. రెండిటిలో ఏది జరిగినా మంచిదే కదా! 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

ఆర్బీఐ ఎఫెక్ట్.. ఈ కంపెనీల షేర్లు భారీగా పతనం

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్ల ప్రభావం గోల్డ్ లోన్ కంపెనీలపై భారీగా పడింది. ఆర్బీఐ ప్రకటించిన వెంటనే ముత్తూట్ ఫైనాన్స్ లిమిటెడ్, ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ లిమిటెడ్ షేర్లు దాదాపుగా 10 శాతం వరకు పడిపోయాయి.

New Update
Muthoot finance Shares

Muthoot finance Shares Photograph: (Muthoot finance Shares)

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లు తగ్గించిన విషయం తెలిసిందే. వరుసగా రెండోసారి రెపో రేటును 0.25 శాతం వరకు తగ్గిస్తున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా వెల్లడించారు. అయితే ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించడంతో గోల్డ్ లోన్ కంపెనీలపై భారీ ఎఫెక్ట్ పడింది. ముత్తూట్ ఫైనాన్స్ లిమిటెడ్, ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ లిమిటెడ్ షేర్లు అయితే దాదాపుగా 10 శాతం వరకు పడిపోయాయి.

ఇది కూడా చూడండి: Telangana: తెలంగాణ మందుబాబులకు అదిరిపోయే వార్త.. 604 కొత్త బ్రాండ్లు!

ఇది కూడా చూడండి: USA-China: చైనాకు ట్రంప్ భారీ షాక్..ఏకంగా 104 శాతం..

ఆర్బీఐ కీలక ప్రకటన చేసిన తర్వాత..

బంగారు ఆభరణాలపై బ్యాంకులు, ఎన్బీఎఫ్‌సీ వంటి నియంత్రిత సంస్థలు గోల్డ్ లోన్లు ఇస్తాయని గవర్నర్ తెలిపారు. అయితే వ్యక్తిగత సంస్థల రిస్క్ సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకుని గోల్డ్ లోన్ నిబంధనలను జారీ చేస్తామని ఆర్బీఐ గవర్నర్ వెల్లడించారు. ఈ నిర్ణయం వల్ల గోల్డ్ లోన్ కంపెనీల షేర్లపై ప్రభావం పడింది.

ఇది కూడా చూడండి: Rain Alert : తెలంగాణలో మూడురోజులు భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్‌ హెచ్చరిక

ముత్తూట్ ఫైనాన్స్ కోసం బంగారు రుణాలు కంపెనీ నిర్వహణలో ఉన్న మొత్తం ఆస్తులలో 98 శాతంగా ఉన్నాయి. అదే సమయంలో మణప్పురం ఫైనాన్స్‌లో 50 శాతం, ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్‌లో 21 శాతం ఏయూఎం గోల్డ్ లోన్స్ నుండి వస్తాయి. ఈ షేర్లు ధరలు 10 శాతం క్షీణించి రూ.2,063 వద్ద ముగిసింది. అదేసమయంలో ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ షేరు ధర 6.66 శాతం క్షీణించి రూ.311.25 వద్ద ముగిసింది. 

Advertisment
Advertisment
Advertisment