Explainer: కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి ఇచ్చింది రుణమా..? గ్రాంటా...?

అమరావతి నిర్మాణానికి రూ.15,000 కోట్లు ఇస్తామని నిన్న కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన నాటి నుంచి ఏపీలో కొత్త చర్చ మొదలైంది. ఈ నిధులు ఇస్తానన్నది ఏ రూపంలోనన్నది క్లారిటీ లేకపోవడం పలు విమర్శలకు, గందరగోళానికి కారణమైంది. ఇందుకు సంబంధించిన విశ్లేషణను ఈ ఆర్టికల్ లో చదవండి.

New Update
Explainer: కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి ఇచ్చింది రుణమా..? గ్రాంటా...?

Union Budget 2024: కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి ఇచ్చింది రుణమా..? గ్రాంటా...? రాష్ట్రవ్యాప్తంగా ఇప్పుడిదే హాట్‌ డిబెట్‌.. రాజధాని అమరావతికి (Capital Amaravati) కేంద్రం ఇచ్చింది లోన్‌ అని వైసీపీ వాదిస్తుండగా.. కాదు కాదు గ్రాంటేనని తెలుగుతమ్ముళ్లు చెబుతున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రాజధాని నిర్మాణానికి 15,000 కోట్లు, రానున్న సంవత్సరాల్లో అదనపు నిధులు ఏర్పాటు చేస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా (Nirmala Sitharaman) చెప్పడం వరకు బాగానే ఉంది కానీ అసలు నిధులు ఇస్తానన్నది ఏ రూపంలోనన్నది క్లారిటీ లేకపోవడం పలు విమర్శలకు, గందరగోళానికి కారణమైంది. ఇంతకీ ఏపీకి కేంద్రం నుంచి దక్కేది రుణమా? గ్రాంటా?

నిజానికి టీడీపీ వర్గాలు సైతం కేంద్రం ఇచ్చింది గ్రాంటేనని బలగుద్ది చెప్పలేపోతున్నారు. అమరావతి నిర్మాణానికి రాష్ట్రానికి ఎలాంటి సాయం అందించాలనే ప్రస్తావన బడ్జెట్‌లో లేనేలేదు. ఇక బడ్జెట్‌ సెషన్‌ ముగిసిన తర్వాత జరిగిన మీడియా మీట్‌లోనూ నిర్మాల ఈ విషయం గురించి క్లారిటీ ఇవ్వని సమాధానం చెప్పరన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే ప్రపంచ బ్యాంకు, ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంకు లాంటి ఏజెన్సీల ద్వారా దీర్ఘకాలిక రుణాల మంజూరుకు కేంద్రం గ్యారెంటీగా నిలుస్తుందని టీడీపీ వర్గాలు అంటున్నాయి. అంటే లోన్ ఇప్పించేది.. అది చెల్లించుకునేది కేంద్రమేనన్నది వారి మాట.

Also Read: రూ.15 వేల కోట్లు దేనికి సరిపోవు.. సీఎం జగన్‌ సంచలన వ్యాఖ్యలు

కేంద్రమే రుణ సదుపాయం కల్పిస్తుంది కాబట్టి.. అప్పుతిరిగి చెల్లించే బాధ్యత కేంద్రంపై ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది. ఇక కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి సంవత్సరంలో 15,000 కోట్లు రుణం రూపంలో లేదా సహాయం రూపంలో పొందడం మంచి ప్రారంభమని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాజధానిలో ఆర్థిక కార్యకలాపాలను వేగవంతం చేయడానికి ఈ 15 వేల కోట్ల రూపాయలు ఎంతగానో ఉపయోగపడతాయని టీడీపీ చెబుతోంది.

అటు వైసీపీ వెర్షన్‌ మాత్రం వేరేలా ఉంది. రాజధానికి కేంద్రం బడ్జెట్‌ ద్వారా గ్రాంట్‌ రూపంలో కాకుండా రుణకల్పన వెసులుబాటు కల్పించడం దారుణమైన విషయమని మండిపడుతోంది. ఇది టీడీపీ చేతకానితనమేనని విమర్శిస్తోంది. పరిశ్రమల కల్పన, మరింత మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన ద్వారా ఉద్యోగాలు, ఉపాధి కల్పనకు చర్యలు తీసుకోవాల్సి ఉందని.. అది కూడా ఏజెన్సీల ద్వారా రుణాలు ఇవ్వడం వల్ల మంచి జరిగే అవకాశమే లేదని వాదిస్తోంది.

2015లో నాటీ సీఎం చంద్రబాబు నాయుడు అమరావతిని ఏపీకి రాజధానిగా ప్రారంభోత్సవం చేశారు. ఈ ప్రాంతం అభివృద్ధికి వివిధ పనులకు గానూ రూ.9,000 కోట్లకు పైగా వెచ్చించారు. అయితే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానులను ఏర్పాటు చేసింది. ఇక రాజధాని నిర్మాణ పనులకు కేంద్రం నిధులు ఇవ్వడం గతంలోనూ జరిగింది. నాడు టీడీపీ-బీజేపీ కూటమిగా ప్రభుత్వాన్ని నడుపుతున్న కాలంలో కేంద్రం అమరావతికి రూ.2,500 కోట్లు మంజూరు చేసింది. అయితే అందులో రూ.1,500 కోట్లే విడుదలయ్యాయి.

నిర్మలాసీతారామన్ మాట్లాడుతూ.. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం ఏపీ రాజధాని నిర్మాణానికి కేంద్రం సాయం చేయాల్సి ఉందని అన్నారు. ఈ విషయాన్ని టీడీపీ నేతలు ప్రస్తావిస్తూ.. పోలవరం ప్రాజెక్టుకు నాబార్డు ద్వారా రుణం మంజూరు చేయించి కేంద్రం ఎలా చెల్లిస్తుందని చెబుతున్నారు. దీని మాదిరిగానే అమరావతికి కూడా కేంద్రం సహాయం చేస్తుందని వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్న బడ్జెట్ లో పేర్కొన్న రూ.15 వేల కోట్లను కూడా కేంద్రమే చెల్లిస్తుందని వారు చెబుతున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు