Kolkata: ఆర్జీ కర్ ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేసిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్

కోలకత్తా ట్రైనీ డాక్టర్‌‌ అత్యాచారం,హత్య విషయంలో సీబీఐ అదుపులో ఉన్నఆర్జీ కర్ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌ను ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సస్పెండ్ చేసింది.డాక్టర్ హత్య జరిగిన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం,నిర్లక్ష్యంగా ప్రవర్తించడమే కారణమని చెప్పింది.

New Update
Kolkata: ఆర్జీ కర్ ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేసిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్

EX Principal Sandeep Ghosh: వైద్యం చేసే ధైర్యంతో పాటూ సున్నితత్వం కూడా డాక్టర్లకు ఉండాలని అంటోంది ఇండియన్ మెడికల్ అసోసియేషన్. కోలకతాలోని ఆర్జీ కర్ ఆసుపత్రి మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌కు ఇవేమీ లేవని అందుకే అతనిని సస్పెండ్ చేస్తున్నామని ప్రకటించింది. ట్రైనీ డాక్టర్ హత్య, రేప్ విషయంలో డాక్టర్ ఘోష్ ప్రవర్తన అమానవీయంగా ఉందని చెప్పింది. ఆర్జీ కర్‌‌కు ప్రిన్సిపల్‌గా ఉన్న సమయంలో సందీప్ ఎన్నో అవినీతి పనులు చేశారనే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఘోష్ మృతదేహాలను, బయో మెడికల్ వ్యర్ధాలను అక్రమంగా రవాణా చేశారని ఆర్జీకర్ ఉద్యోగులు ఆరోపించారు. సీబీఐ కూడా ఇతని ఇంట్లో 11 గంటల పాటూ సోదాలను నిర్వహించి సాక్ష్యాధారాలను స్వాధీనం చేసుకుంది. ఆ తరువాత సందీప్ ఘోష్‌పై సీబీఐ ఆగస్టు 24న ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఘోష్ పదవీకాలంలో మెడికల్ కాలేజీలో ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఇతనికి సీబీఐ సోమవారం లై డిటెక్టర్ టెస్ట్‌ను కూడా నిర్వహించింది.

ప్రిన్సిపాల్ సందీప్‌ ఘోష్‌ను బెంగాల్ ప్రభుత్వం కాపాడ్డానికి ట్రై చేసిందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇతని వెనుక ఎవరో పెద్ద వ్యక్తులు ఉన్నారనే అనుమానాలు కూడా ఉన్నాయి. ట్రైనీ డాక్టర్ హత్య కు సందీప్ నైతిక బాధ్యత వహిస్తూ ఆర్జీ కర్ ఆసుపత్రి ప్రిన్సిపాల్‌ పదవికి రాజీనామా చేశాడు. అయితే ఆ తరువాత​ అతనిని వెంటనే బెంగాల్ ప్రభుత్వం అతన్ని కలకత్తా నేషనల్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌కు నాయకత్వం వహించడానికి నియమించింది. ఇది చాలా విమర్శలకు దారి తీసింది. దాంతో సందీప్‌ను దీర్ఘకాల సెలవుపై వెళ్ళాలని కోలకత్తా హైకోర్టు ఆదేశించింది. మరోవైపు సుప్రీంకోర్టు కూడా సందీప్‌ ఘోష్‌ను కాపాడ్డానికి ప్రభుత్వం ఎందుకు ప్రయత్నిస్తోంది అంటూ మండిపడింది.

Also Read: Telangana: శ్రీశైలం, నాగార్జునా సాగర్ కు భారీ వరద నీరు..గేట్లు ఎత్తిన అధికారులు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

SRH VS PBKS: వాట్ ఏ కమ్ బ్యాక్..ఎస్ఆర్హెచ్ దుమ్ము దులిపేసింది మామా..

ఐపీఎల్ 2025లో ఈరోజు అద్భుతమైన మ్యాచ్ జరిగింది. హైదరాబాద్ ఉప్పల్ లో ఈరోజు పంజాబ్ కింగ్స్, హైదరాబాద్ సన్ రైజర్స్ నువ్వా నేనా అన్నట్టు ఆడారు. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 246 పరుగుల టార్గెట్ ఇస్తే దాన్ని ఎనిమిది వికెట్ల తేడాతో ఛేదించింది. 

author-image
By Manogna alamuru
New Update
ipl

SRK VS PBKS

హైదరాబాద్ సన్ రైజర్స్ అద్భుతమైన కమ్ బ్యాక్ ఇచ్చింది. ఐదు మ్యాచ్ లు ఓడిపోయిన తర్వాత ఈరోజు పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ చితక్కొట్టేసింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ లు విజృంభించి ఆడేశారు. పజాబ్ కింగ్స్ ఇచ్చిన 246 పరుగుల భారీ టార్గెట్ ను 8 వికెట్ల తేడాతో సునాయాసంగా ఛేదించింది. ఓపెనర్లు అభిషేక్ వర్మ 141 పరుగులు, ట్రావిస్ హెడ్ 66 పరుగులతో ఇరగదీసారు. ఇద్దరూ కలిసి మ్యాచ్ ను గెలిపించేశారు. 150 పరుగుల ముందు అభిషేక్ వర్మ వికెట్ కోల్పోవడం కొంత నిరాశ కలిగించినా...అతను ఈరోజు ఆడిన తీరుతో ఉప్పల్ స్టేడియం మొత్తాన్ని ఉర్రూతలూగించాడు. అభిషేక్‌ శర్మ 55 బంతుల్లో 14 ఫోర్లు, 10 సిక్స్‌లsy 141 పరుగులు చేసి పంజాబ్‌ బౌలర్లకు చుక్కలు చూపించాడు. వరుస ఫోర్లు, సిక్సర్లతో ఉప్పల్ మైదానంలో పరుగుల వరద పారించాడు. అభిషేక్ ధాటికి పంజాబ్ ఏకంగా ఎనిమిది మందితో బౌలింగ్‌ చేయించింది.  మరోవైపు అతను కొట్టిన బంతులను గ్రౌండ్ స్టాఫ్ వెతుక్కోవడంతోనే సరిపోయింది.  ట్రావిస్ హెడ్ 37 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 66 పరుగులు చేసి అభిషేక్ కు మంచి సపోర్ట్ ఇచ్చాడు.  చివర్లో క్లాసెన్ 14 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌ తో 21, ఇషాన్ కిషన్ 9*; 6 బంతుల్లో 1 సిక్స్ కొట్టి మ్యాచ్ ను గెలిపించారు. 

పంజాబ్ కూడా దుమ్మ రేపింది..

అంతకు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు చెలరేగిపోయింది. తొలి ఇన్నింగ్స్ చేసి కింగ్స్ జట్టు నిర్దేశించిన 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 245 పరుగులు సాధించింది. దీంతో SRH ముందు 246 భారీ టార్గెట్ ఉంది. హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో ఈ మ్యాచ్ జరుగుతోంది. మొదట టాస్ గెలిచిన పంజాబ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్స్‌గా క్రీజులోకి ప్రభ్‌మన్ సింగ్‌, ప్రియాంశ్‌ ఆర్య మొదటి నుంచి దంచి కొట్టారు. బాల్‌ టు బాల్ ఫోర్లు, సిక్సర్లతో దుమ్ము దులిపేశారు. ఉప్పల్ స్టేడియంలో పరుగుల వరద పెట్టించారు. సన్ రైజర్స్ జట్టు బౌలర్లకు చెమటలు తెప్పించారు. ఇక హర్షల్‌ పటేల్‌ బౌలింగ్‌లో (3.6) ప్రియాంశ్‌ ఆర్య (36) నితీశ్‌ రెడ్డికి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.  ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన శ్రేయస్ అయ్యార్ దుమ్ము దులిపేశాడు. పరుగులు రాబడుతూ అదరగొట్టేశాడు. ఫోర్లు, సిక్సర్లతో కెవ్ కేక అనిపించాడు. అతడు 36 బంతుల్లో 82 పరుగులు చేసి ఔటయ్యాడు. అలాగే వధేరా 22 బంతుల్లో 27 పరుగులు, శశాంక్ సింగ్ 3 బంతుల్లో 2 పరుగులు, మాక్స్‌వెల్ 7 బంతుల్లో 3 పరుగులు, స్టొయినీస్ 11 బంతుల్లో 34 పరుగులు చేశారు. 

 today-latest-news-in-telugu | IPL 2025 | srh-vs-pbks

Also Read:  USA: యాపిల్ కు అండగా ట్రంప్..సుంకాల నుంచి ఫోన్లు, కంప్యూటర్లు మినహాయింపు

Advertisment
Advertisment
Advertisment