Chandigarh: చండీగఢ్‌ కోర్టులో కాల్పులు.. IRS అధికారి మృతి

కుటుంబ వివాద పరిష్కారం కోసం రెండు కుటుంబాలు చండీగఢ్‌ కోర్టుకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఐఆర్ఎస్‌ అధికారిగా పనిచేస్తున్న హర్‌ప్రీత్‌ సింగ్ అనే వ్యక్తిని అతడి మామ మాల్విందర్ సింగ్ తుపాకితో కాల్చాడు. హర్‌ప్రీత్‌ సింగ్‌ను ఆస్పత్రికి తరలించగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు.

New Update
Chandigarh: చండీగఢ్‌ కోర్టులో కాల్పులు.. IRS అధికారి మృతి

చండీగఢ్‌ కోర్టులో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఓ ఐఆర్‌ఎస్ అధికారి ప్రాణాలు కోల్పోయాడు. ఇక వివరాల్లోకి వెళ్తే.. హర్‌ప్రీత్‌ సింగ్ అనే వ్యక్తి నీటిపారుదల శాఖలో ఐఆర్‌ఎస్‌ అధికారిగా పనిచేస్తున్నాడు. అతడి మామ మాల్విందర్ సింగ్ సిద్ధూ పంజాబ్ పోలీసు అసిస్టెంట్‌ ఐజీగా పనిచేశాడు. ప్రస్తుతం ఇతడు సస్పెషన్సన్‌లో ఉన్నాడు. అయితే కొంతకాలంగా హర్‌ప్రీత్ సింగ్, మాల్విందర్‌ సింగ్ కుటుంబాల మధ్య గొడవలు నడుస్తున్నాయి. దీంతో వీళ్లు కుటుంబ కోర్టుకు వచ్చారు. వారి సమస్యను పరిష్కరించుకునేందుకు ఏర్పాటు చేసిన మధ్యవర్తిత్వ సెషన్‌కు హాజరయ్యారు.

Also Read: మూడు నెలల్లో ఆ పనులు పూర్తి చేయండి: మంత్రి పొంగులేటి

అయితే మాల్విందర్ సింగ్‌ బాత్‌రూంకు వెళ్తానంటూ బయటకు వచ్చాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన అల్లుడిపై తుపాకితో కాల్పులకు పాల్పడ్డాడు. తుపాకీ శబ్దం రావడంతో లోపల ఉన్నవాళ్లందరూ షాక్‌కు గురయ్యారు. రక్తపు మడుగులో ఉన్న హర్‌ప్రీత్‌ సింగ్‌ను ఆస్పత్రికి తరలించగా.. మార్గంలోనే అతడు ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధృవీకరించారు. మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

Also Read: అమెరికా తో పోటీ పడాలంటే భారత్ కు 75 ఏళ్లు పడుతుంది..వరల్డ్ బ్యాంక్!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Renu Desai: నాకు రాజకీయాల్లోకి రావాలని ఉంది..రేణూ దేశాయ్

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. దేశంలో జరిగే అన్ని విషయాలపైనా స్పందిస్తూ ఉంటారు. తాజాగా ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె..తనకు రాజకీయాల్లోకి రావాలని ఉందని చెప్పారు. 

New Update
Renu Desai

Renu desai

తనకు రాజకీయాల్లోకి వెళ్ళే అవకాశం ఇంతకు ముందే వచ్చిందని..కానీ పిల్లలు చిన్నవారు కావడం వలన వదులుకున్నానని చెప్పారు రేణూ దేశాయ్. రాజకీయాల్లోకి వెళ్ళడం తన జాతకంలోనే ఉందని అన్నారు. ఇప్పటికీ తనకు అదే కోరికని...కానీ తాను విధి రాతకు వ్యతిరేకంగా ప్రయాణిస్తున్నానని చెప్పుకొచ్చారు రేణు. ఓ పాడ్ కాస్ట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనసులో మాటను బయటపెట్టారు.  సామాజిక సేవ చేయడం అంటే తనకు ఆనందమని...ఏ చిన్నారీ ఆకలితో ఉండకూడదని అనుకుంటానని ఆమె తెలిపారు. అయితే తాను కొంచెం ముక్కు సూటి మనిషిని...స్నేహితులు, పిల్లలతో ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తానని...అందుకే వారు తాను పోలిటిక్స్ లో పనికి రానని అంటారని నవ్వూతూ చెప్పారు రేణూ దేశాయ్. 

మోడీ భక్తురాలిని..బీజేపీకే సపోర్ట్..

తాను ఎప్పటికీ మోడీనే సపోర్ట్ చేస్తానని...ఆమె భక్తురాలిని అని నిర్భయంగా చెప్పుకున్నారు రేణు. మన ధర్మం ఎలా బతకాలో, ఎలా నడుచుకోవాలో నేర్పించింది. అందుకే నేను సనాతురాలినే అని చెప్పుకుంటాననన్నారు ఎవరేం అనుకున్నా ఎప్పటికీ తాను బీజేపీకే సపోర్ట్ చేస్తానని చెప్పుకొచ్చారు. భవిష్యత్తులా తాను ఏదైనా పార్టీలో చేరితే కచ్చితంగా అందరికీ చెప్పే చేస్తానని రేణూ దేశాయ్ అన్నారు. ఇక ఆమె కుమారుడు అకీరా నందన్ గురించి చెబుతూ...ఓజీ సినిమాలో అతను పని చేయడం లేదని తెలిపారు. అకీరా నటన గురించి ఆలోచించిన రోజే నా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెడతా. కొందరు యూట్యూబర్లు మనీ కోసం తప్పుడు థంబ్‌నైల్స్‌ పెడుతున్నారు రేణూ ఆరోపించారు. 

today-latest-news-in-telugu | renu-desai | actress | inter-view

Also Read: WHO: మరో మహమ్మారి తప్పదు-WHO చీఫ్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు