Andhra Pradesh: వినుకొండలో హైటెన్షన్‌.. రషీద్ ఇంటికి చేరుకున్న జగన్

వైసీపీ అధినేత జగన్ వినుకొండకు చేరుకున్నారు. హత్యకు గురైన రషీద్ ఇంటికి చేరుకున్న ఆయన.. అతని కుటుంబ సభ్యులను పరామర్శించారు. అక్కడికి పెద్దఎత్తున వైసీపీ కార్యకర్తలు చేరుకోవంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు మోహరించారు.

New Update
Andhra Pradesh: వినుకొండలో హైటెన్షన్‌.. రషీద్ ఇంటికి చేరుకున్న జగన్

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ వినుకొండకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. హత్యకు గురైన రషీద్ ఇంటికి చేరుకున్న జగన్‌.. అతని కుటుంబ సభ్యులను పరామర్శించారు. పెద్దఎత్తున వైసీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకోవంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు మోహరించారు. జగన్‌కు సరైన బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇవ్వలేదని.. ఆయన ప్రైవేటు వాహనంలో వినుకొండకు చేరుకున్నారు.

Also read: భారీ వర్షాలు, వరదలపై సీఎం చంద్రబాబు సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు..!

ఈ సందర్భంగా సీఎం జగన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. 'రషీద్ హత్య ఘటనపై హైకోర్టులో ఫిర్యాదు చేస్తాం. ఈ కేసులో ఉన్నవారి పేర్లు ఛార్జ్‌షీట్‌లో వచ్చేలా చూస్తాం. ఢిల్లీకి వెళ్లి ధర్నా చేసే కార్యక్రమం కూడా చేద్దాం. 45 రోజుల్లోనే రాష్ట్రం అంతా అతలాకుతలం చేస్తున్నారు. వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలను తిరగనివ్వట్లేదు. మనకన్నా ఎక్కువ చేస్తామని చెప్పడంతోనే వాళ్లు గెలిచారు. కాబట్టి ఇచ్చిన హామీలు అమలు చేయాలి. వ్యక్తిగత కారణాలతో హత్య జరిగిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. హత్యా రాజకీయాలపై పోరాడుతాం. బుధవారం ఢిల్లీలో ధర్నా చేస్తాం. కేంద్రం జోక్యం చేసుకుని వెంటనే ఈ హత్యారాజకీయాల్ని ఆపాలి. లేదంటే ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలి. 45 రోజుల్లోనే 31 మందిని అరెస్టు చేశారు. లోకేష్ రెడ్‌బుక్ అంటూ పోలీసులు, అధికారుల్ని భయపెడుతున్నారు. ఈ కేసులో ఉన్నవారి పేర్లు ఛార్జిషీటులో వచ్చేలా చుద్దామని' జగన్ అన్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

ముంబై నుంచి హీరోయిన్‌ని తీసుకొచ్చి.. అరెస్టైన ఆ IPS చేసిన పని ఇదేనా..?

సీనియర్ IPS ఆంజనేయులు YCP హయాంలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. జైత్వానీని 42రోజు జుడ్యీషియల్ కస్డడీలో చిత్ర హింసలు పెట్టారని ఆమె ఆరోపించారు.YCP లీడర్ కుక్కల విద్యాసాగర్ పెట్టిన తప్పుడు కేసులో ఆమెను వేధించారని తెలిసింది.

New Update
Kadambari Jatwani Case

ఆంధ్రప్రదేశ్ సీనియర్ IPS అధికారి పి.ఎస్.ఆర్.ఆంజనేయులుని ఏపీ పోలీసులు మంగళవారం హైదరాబాదులో అరెస్ట్ చేశారు. ఆయన వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ ఇంటిలిజెన్స్ చీఫ్‌గా కూడా పని చేశారు. నటి జెత్వానీ కేసులో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే కేసులో పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు. ఓ భూవివాదంలో వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్‌ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు పెట్టి కాదంబరి జైత్వానీని 42 రోజులపాటు జ్యూడీషియన్ కస్టడీలో ఉంచారు.

Also read : Official బిగ్ బ్రేకింగ్: యూపీలో అఘోరీ అరెస్ట్

కుక్కల విద్యాసాగర్‌ భూమిని జైత్వానీ ఫోర్జరీ సంతకాలతో వేరే వ్యక్తులకు అమ్మాలని యత్నించారని ఆమెతోపాటు ఆమె తల్లిదండ్రులపై ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో 2024 ఫిబ్రవరి 2న కేసు పెట్టారు. దానికి 2 రోజులు ముందే (జనవరి 31) అప్పటి విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్ కాంతి రానా టాటా, డీసీపీ విశాల్ గున్నిలను పిలిపించిన పీఎస్ఆర్ ఆంజనేయులు, ముంబయిలో ఉన్న జత్వానీని అరెస్టు చేసి తీసుకురావాల్సిందిగా ఆదేశించారు. దాదాపు 40 రోజులు కస్టడీలో మానసిక, శారీరక వేధింపుల ఎదుర్కొన్నట్లు ఆమె తెలిపారు. 2024 మేలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారాన్ని దక్కించుకుంది. వైసీపీ ప్రభుత్వం హయాంలో అధికార దుర్వినియోగానికి పాల్పడిన జత్వానీ కేసు ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. 

Also read: మోదీకి సౌదీ పర్యటనలో ఫైటర్ జెట్ల ఎస్కార్ట్.. 6 విమానాలతో స్వాగతం (VIDEO)

తనతోపాటు తన తల్లిదండ్రులపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేసి చిత్రహింసలకి గురి చేశారని జత్వానీ 2024 ఆగస్టు 30న విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులోనే ఆమె ముగ్గురు ఐపీఎస్ అధికారుల పేర్లను ప్రస్తావించారు. తనను ఇబ్బంది పెట్టిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ఈ వ్యవహారంపై విచారణ తర్వాత నివేదిక ప్రభుత్వానికి అందింది. ప్రభుత్వం ఈ కేసును సీఐడీకి అప్పగించింది.

Also read: New Pope: కొత్త పోప్ ఎన్నికలో కీలకంగా నలుగురు ఇండియన్ కార్డినల్స్

ఆ నివేదిక ఆధారంగానే గత సెప్టెంబర్‌లో ఆ ముగ్గురు ఐపీఎస్ అధికారులు సస్పెండ్ అయ్యారు. ఆ కేసులో ప్రధాన నిందితుడైన కుక్కల విద్యాసాగర్‌ను కూడా అరెస్ట్ చేశారు. అప్పటి ఏపీ ఇంటిలిజెన్స్ చీఫ్‌ ఆంజనేయులు ఆధారాలు లేకుండా అసంపూర్తిగా ఉన్న ఫిర్యాదుతో ఉన్నత హోదాను అడ్డుపెట్టుకొని తప్పుడు ఆదేశాలు జారీ చేశారని తేలింది. ఈ ఆరోపణపై కూటమి ప్రభుత్వంలో ఆంజనేయులును సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఆర్డర్స్‌ జారీ చేసింది. ఏప్రిల్ 22న హైదరాబాద్‌లో ఏపీ పోలీసులు ఐపీఎస్ అధికారి ఆంజనేయులును అరెస్ట్ చేశారు.

( Kadambari Jatwani Case: | actress-jatwani | IPS officer Anjaneyulu | IPS Anjaneyulu | latest-telugu-news)

Advertisment
Advertisment
Advertisment