/rtv/media/media_files/2025/04/23/itjjcx0lhbhRceYiUNmm.jpg)
Indus River
కాశ్మీర్ లోని పహల్గామ్ లోని బైసరన్ వ్యాలీ ఉగ్రవాదుల సృష్టించిన మారణకాండ భారతదేశం మొత్తాన్ని కన్నీటి సంద్రంలో ముంచివేసింది. ఈ దాడిలో 28 మంది అమాయక టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. మరో 60 మంది గాయపడ్డారు. దీనికి తామే కారణం అని పాక్ ప్రేరేపిత లష్కరే తోయిబా ప్రాక్సీ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ టీఆర్ఎఫ్ ఉగ్రసంస్థ ప్రకటించింది. ఈ దాడిలో పాకిస్తాన్ ప్రమేయం కూడా ఉన్నట్టు భారత ఇంటెలిజెన్స్ సంస్థలు కనుగొన్నాయి. పాకిస్తాన్ ప్రభుత్వం తమకేమీ సంబంధం లేదని బుకాయిస్తున్నప్పటికీ...ఉగ్రవాదులకు ఊతమిచ్చింది ఆ దేశమేనని స్పష్టంగా తెలుస్తోంది.
పహల్గామ్ దాడులపై కేంద్ర ప్రభుత్వం వెంటనే అలెర్ట్ అయింది. ప్రధాని మోదీ తన సౌదీ పర్యటనను మధ్యలోనే ముగించుకుని వచ్చేశారు. ఈరోజు ఉదయం నుంచీ రక్షణశాఖ, క్యాబినెట్ తో చర్చలు జరుపుతూనే ఉన్నారు. వీటి తర్వాత పాకిస్తాన్ విషయంలో భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పాక్ పౌరులు, పర్యటకులు ఎవరైనా ఇండియాలో ఉంటే వారం రోజుల్లో వారి దేశానికి వెళ్లాలని అట్టారి ఇంటిగ్రేటెడ్ చెక్పోస్ట్ ను వెంటనే నిలిపివేస్తున్నట్లుగా కేంద్రం తెలిపింది. పాక్ పౌరులును ఇండియాలోకి అనుమతించేది లేదని స్పష్టం చేసింది. అంతేకాకుండా ఇండస్ వాటర్ ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు తెలిపింది. SAARC వీసా మినహాయింపు పథకం (SVES) వీసాల కింద పాకిస్తానీ పౌరులు భారత్ లో ప్రయాణించడానికి అనుమతించబడరు. ప్రస్తుతం భారత్ లో ఉ్న వారు కూడా 48 గంటల్లో తమ దేశానికి వెళ్ళిపోవాలి .
సింధూ జలాల ఒప్పందం...
సీమాంతర ఉగ్రవాదాన్ని పోషిస్తున్న పాకిస్తాన్ కు భారత్ చాలా సార్లే అవకాశం ఇచ్చింది. అయినప్పటికీ ఆ దేశం మారలేదు. ఇప్పుడు తాజాగా జరిగిన ఉగ్రదాడితో కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. ఇంక ఉపేక్షించేదే లేదంటూ సింధు జాలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. గతంలోనే ప్రధాని మోదీ రక్తం, నీరు కలిపి ఒకచోట ప్రవహించలేదు అని అన్నారు. కానీ ఇప్పటి వరకు పాక్ ను ఇబ్బంది పెట్టకూడదనే ఆలోచనతో సిధుజలాల జోలికి వెళ్ళలేదు. తాజాగా పాక్ తో దౌత్య సంబంధాలతో పాటూ 64 ఏళ్ళ సింధు జలాల ఒప్పందాన్ని కూడా రద్దు చేసుకుంది భారత్.
ఎడారిగా మారనున్న పాక్..
ఇది పాక్ చాలా పెద్ద షాక్. ఇండస్ రివర్ వాటర్ ఆగిపోతే పాకిస్తాన్ ఎడారిగా మారుతుంది అనడంతో ఎటువంటి సందేహం లేదు. ప్రపంచంలో అతి తక్కువ నీటి వనరులు ఉన్న దేశాల్లో పాకిస్తాన్ ఒకటి. దీనికి ప్రధాన ఆయువు ఇండస్ రివర్ వాటర్ ఒక్కటే. మొత్తం దేశ వ్యవసాయం సింధూ జలాలపైనే ఆధారపడి ఉంటుంది. అక్కడి పంజాబ్, సింధ్ వంటి రాష్ట్రాలకు ఇదే ప్రధాన వనరు. బలూచిస్తాన్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా, సింధ్ ప్రాంతాలు అతి తక్కువ నీటి వనరులు కలిగిన ప్రాంతాలుగా ఉన్నాయి. ఇప్పుడు భారత్ ఈ నీటిని ఆపేస్తే ఈ ప్రాంతాలన్నీ ఎడారిగా మారతాయి. ఇప్పటికే విపరీతమైన ద్రవ్యోల్బణం, పేదరికాన్ని ఎదుర్కొంటున్న పాకిస్తాన్ ఈ దెబ్బకు మలమల మాడిపోవడం ఖాయం. దీంతో అక్కడ తాగు నీటికి కూడా కొరత ఏర్పడుతుంది.
ఏమిటీ ఒప్పందం..?
సింధూ నదీ జలాలపై 1960లో అప్పటి భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, పాక్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్లు వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంలో ఒప్పందం కుదుర్చుకున్నారు. దీని ప్రకారం భారత్కి తూర్పు నదులు బియాస్, రావి, సట్లేజ్లపై, పాకిస్తాన్కి పడమర నదులైన సింధు, చీనాబ్, జీలం నదులపై నియంత్రణ ఉంటుంది. సింధూ నది చైనాలో పుట్టి భారత్ మీదుగా పాకిస్తాన్ లోకి ప్రవహిస్తుంది. అందువల్లనే ఈ నదిపై రెండు దేశాల ఒప్పందం చేసుకున్నాయి. ఈ ఒప్పందం వల్ల సింధూ జలాల్లో 80 శాతం నీటిని పాక్ వినియోగించుకుంటోంది. ఇంతకు ముదు కడా చాలా సార్లు ఈ షింధూ జలాల ఒప్పందం వివాదాస్పదం అయింది. దీని వల్ల భారత్ కన్నా పాకిస్తాన్ ఎక్కువ లబ్ధి పొందిందనే వాదన కూడా ఉంది. 2016 ఉరీ ఉగ్రదాడి తర్వాత భారత ప్రధాని నరేంద్రమోడీ.. ‘‘రక్తం, నీరు కలిసి ప్రవహించలేవు’’ అని వ్యాఖ్యానించారు. 2023లో ఈ ఒడంబడికపై మళ్లీ చర్చించాల్సిందిగా భారత్ అధికారికంగా పాకిస్తాన్కి తెలియజేసింది. అయితే, పాక్ మాత్రం పాత ఇండస్ వాటర్ ట్రిటీ నిర్దేశించిన విధానాలకు కట్టుబడి ఉండాలనే కోరికను వ్యక్తం చేసింది. అయితే ఇప్పుడు మాత్రం పాక్ కు గట్టిగానే బుద్ధి చెప్పాలని భారత్ నిర్ణయించుకుంది. అందుకే ఆ దేశానికి జీవనాడి అయిన సింధూ జలాలను కట్ చేసి పారేసింది.
today-latest-news-in-telugu | pakistan | sindhu | river
Also Read: BIG BREAKING: మోడీ సంచలన నిర్ణయం.. పాకిస్థాన్తో సంబంధాలు క్లోజ్!
Telangana: కాంగ్రెస్ అధికారంలోనే భారీ అక్రమాలు జరిగాయి..ఈటల సంచలన కామెంట్స్!
తెలంగాణలో బీజేపీ 10కిపైగా ఎంపీ సీట్లు గెలుస్తుందని ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. విజయసంకల్ప యాత్రలో భాగంగా గజ్వేల్ కేంద్రంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. బీర్ఎస్ పనైపోయిందని, కాంగ్రెస్ అధికారంలోనే 2జి స్పెక్ట్రమ్, కోల్ మైన్, ఫెర్టిలైజర్ స్కామ్స్ జరిగాయని విమర్శించారు.
Etela Rajender: ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ తెలంగాణలో 10కిపైగా సీట్లు గెలుస్తుందని ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. మెదక్ (Medak) పార్లమెంట్ పరిధిలో విజయసంకల్ప యాత్ర (Vijay Sankalp Yatra) సందర్భంగా గజ్వేల్ పట్టణ కేంద్రంలో ప్రెస్ మీట్ నిర్వహించారు ఈటల రాజేందర్. ఈ సందర్బగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ (BJP) తెలంగాణ రాష్ట్రంలో 17 సీట్లలో సంపూర్ణంగా కొట్లాడాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
గుంజుకున్న భూములు వెనక్కు ఇవ్వాలి..
అలాగే ఈ నెల 20 నుంచి 5 క్లస్టర్స్ లో విజయసంకల్ప యాత్ర చేస్తున్నమని తెలిపారు. జహీరాబాద్, కరీంనగర్, చేవెళ్ల, మెదక్ పార్లమెంట్ స్థానాల్లో యాత్ర కొనసాగుతుంది. యాత్రలో మాకు అనేక ధరఖాస్తులు వస్తున్నాయి. మా భూములు ప్రాజెక్టులు కోసం, రోడ్ల కోసం గుంజుకుంటే భరించాం. కాని ప్రైవేట్ వ్యక్తులకోసం కోసం గుంజుకున్న భూములు వెనక్కు ఇవ్వాలని ఆందోళన కొనసాగుతుంది. ఈ ప్రభుత్వం ఆ భూములు వెంటనే తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు.
ఇవన్ని జన్యూన్ డిమాండ్స్..
ఇక గజ్వేల్ లో అనేక హామీలు ఇచ్చిన ఈటల.. ఎన్నికల్లో (Telangana Elections) గెలవగానే లక్ష అదనంగా భూభాదితులకు ఇస్తామన్నారు. 18 సంవత్సరాల వయసు పైబడిన భూములు కోల్పోయిన వారికి 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు. ఇళ్లకు పట్టాలు ఇస్తాం, ఇల్లు కట్టిస్తాం అంటూ అనేక హామీలు ఇచ్చారు. ఇక గత పార్టీలు ఓట్లు డబ్బాల పడే వరకు హామీలు ఇచ్చి, వాటి ఊసే ఎత్తడం లేదని విమర్శించారు. కేసీఆర్ ఓడిపోవచ్చు.. కానీ ఇవన్ని జన్యూన్ డిమాండ్స్ కాబట్టి వాటిని నెవర్చాలని నేనే ఈ ప్రభుత్వానికి దరఖాస్తు ఇస్తానన్నారు. మొన్న ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటు వేశాం. కానీ ఈ సారి జెండాలు లేవు మోడీ (PM Modi) గారికే ఓటు వేస్తామని ప్రజలు చెబుతున్నట్లు పేర్కొన్నారు.
మహిళలకు ఆత్మగౌరవం..
ఇక ప్రధాని మోడీ గారు మహిళలకు ఆత్మగౌరవం పెంచే విధంగా టాయిలెట్స్ కట్టించాడని, మున్సిపల్ కార్మికుల కాళ్లు కడిగి మా గౌరవం పెంచారని కొనియాడారు. రామగుండం ఎరువుల కర్మాగారం నిర్మించి లైన్లలో నిలబడే బాధలేకుండా ఎరువులు అందించారు. కేంద్రం ఇచ్చే రైతుబంధు టెంచన్ గా పడుతుంది. 10 లక్షల రూపాయల వరకు మహిళలకు వడ్డీ లేని రుణాలు అందించబోతున్నారు. అంతేకాదు ఈ దేశంలో సుభిక్షంగా, సురక్షితంగా బ్రతకాలి అనే మోదీ గారికి ఓటు వేయాలని ప్రజలందరూ అనుకుంటున్నారని చెప్పారు.
ఇది కూడా చదవండి: Liquor Scam : కవితకు మరో బిగ్ షాక్.. న్యాయవిచారణకు దిగిన సీబీఐ!?
కాంగ్రెస్ హయాంలోనే అనేక అక్రమాలు..
గతంలో కాంగ్రెస్ (Congress) అధికారంలో ఉంటే అనేక అక్రమాలు జరిగాయి. 2జి స్పెక్ట్రమ్ స్కాం, కోల్ మైన్ స్కాం, ఫెర్టిలైజర్ స్కాం.. ఇలా అనేక స్కామ్ లలో మంత్రులు, ఐఏఎస్ అధికారులు అరెస్ట్ అయ్యు జైల్లో ఉన్నారు. కానీ మోడీ గారి హయాంలో ఎక్కడా ఒక్క స్కామ్ లేదు. మొదటి సారి 273 సీట్లతో గెలిస్తే, రెండవ సారి 303 సీట్లతో బీజేపీ ని గెలిపించారు. 370 రద్దు (Article 370), రామాలయ నిర్మాణం, మైనారిటీ మహిళలకు వరమైన ట్రిపుల్ తలాక్ (Triple Talaq) రద్దులాంటి ఎన్నో తీసుకువచ్చారు. సబ్ కా సాత్ సబ్ కా విశ్వాస్ సబ్ కా ప్రయాస్ ను నిబద్ధతగా అమలు చేస్తున్నారు. అందుకే మోడీ గారికి దేశంలో అన్ని వర్గాల అన్ని రకాల ప్రజలు మద్దతు తెలుపుతున్నారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతున్నప్పుడు యుద్ధం ఆపి విద్యార్థులను తీసుకువచ్చిన ఘనత మోడీ గారిది.మన సైనికుడు అభినందన్ పాకిస్థాన్ లో చిక్కుపడితే అల్టిమేటం ఇచ్చి తీసుకువచ్చి భారత జాతి ఆత్మగౌరవం నిలిపిన బిడ్డ. మన నావీ ఆఫీసర్స్ కి శిక్ష పడితే దౌత్యపరమైన చర్చ జరిపి తీసుకువచ్చారు. ఒకప్పుడు భారత్ వేరు ఇప్పుడు వేరు. కరోనా కష్టకాలంలో అమెరికాకు, ప్రపంచానికి వాక్సిన్ అందించారంటూ ప్రధానిపై ప్రశంసలు కురిపించారు.
మోసపు హామీలు నమ్మవద్దు..
ఆర్ధిక వ్యవస్థ, అభివృద్ధి, నేషనల్ హై వేస్, విమానాశ్రయాల నిర్మాణం ఎందులో అయినా బ్రహ్మాండమైన అభివృద్ధి ఉందని, మోడీ గారు మళ్ళీ అధికారంలోకి రావాలి భారత దేశం వికసించాలని తాము యాత్ర చేస్తున్నామన్నారు. తెలంగాణ ప్రజలారా మోసపు హామీలు నమ్మవద్దు. కాంగ్రెస్ అనేక హామీలు ఇచ్చింది. ఒక్క బస్సు ప్రయాణం తప్ప ఏదీ అమలు కాలేదు. ప్రతి మహిళకు రూ. 2500, రైతుబంధు రూ.15000 కౌలు రైతులకు రూ.12 వేలు,ఆటో డ్రైవర్లకు రూ. 12 వేలు, మహిళలకు రూ. 10 లక్షల వడ్డీ లేని రుణాలు ఏదీ అమలు కాలేదు. ధరకాస్తుల పేరుతో మళ్ళీ మోసం చేస్తారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. బీఆర్ఎస్ ఖతం అయిన పార్టీ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సారి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి బీజేపీనీ గెలిపించి నరేంద్ర మోడీ గారిని ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రిని చేయాలని కోరుతున్నాని ఈటల రాజేందర్ (Etela Rajender) అన్నారు.
Indus River Agreement: 64 ఏళ్ళ ఒప్పందానికి స్వస్తి..ఎడారిగా మారనున్న పాకిస్తాన్
64 ఏళ్ళ క్రితం మాజీ ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ, అప్పటి పాక్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ మధ్య జరిగి సింధూ జలాల ఒప్పందం రద్దు చేసుకోవాలని తాజాగా భారత ప్రభుత్వం నిర్ణయించింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్ | నేషనల్
Chess: ఫిడే మహిళల గ్రాండ్ప్రి చెస్ టోర్నీ విజేతగా కోనేరు హంపి
ఫిడే వుమెన్ గ్రాండ్ ప్రి చెస్ టోర్నీలో తెలుగు అమ్మాయి కోనేరు హంపి విజేతగా నిలిచింది. పునేలో జరిగిన ఈ చెస్ టోర్నీలో చివరి ఆట సమయానికి జు జినర్ తో కలిసి ఆమె అగ్రస్థానంలో కొనసాగింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
Aghori: చంచల్గూడ జైలుకు అఘోరీ.. ప్రత్యేక బ్యారక్ ఏర్పాటు చేసి!
చీటింగ్ కేసులో అరెస్టైన లేడీ అఘోరిని ఎట్టకేలకు పోలీసులు చంచల్గూడ జైలుకు తరలించారు. క్రైం | Short News | Latest News In Telugu | హైదరాబాద్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
TG Crime: కోడలిపై మోజుతో కొడుకును లేపేసిన తండ్రి.. రోకలి బండతో కొట్టి చంపి!
వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. రేపాకపల్లికి చెందిన మొండయ్య కోడలిపై మోజుతో కొడుకు. పనిచేస్తున్నట్లు తెలిపారు. క్రైం | Short News | Latest News In Telugu | వరంగల్
🔴Pahalgam Terrorist Attack: మోడీ సంచలన నిర్ణయం.. పాకిస్థాన్ కు బిగ్ షాక్!
జమ్ము కశ్మీర్లో అనంత్నాగ్ జిల్లాలోని పహల్గాం ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఈ భీకర ఘటనలో 27 మంది ప్రాణాలు కోల్పోగా. Latest News In Telugu | నేషనల్
BIG BREAKING: మోడీ సంచలన నిర్ణయం.. పాకిస్థాన్తో సంబంధాలు క్లోజ్!
జమ్ము కశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తరువాత కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ తో Short News | Latest News In Telugu | నేషనల్
SRH VS MI: మళ్ళీ హైదరాబాద్ ఓటమి..వరుసగా ముంబైకు నాలుగో విజయం
Indus River Agreement: 64 ఏళ్ళ ఒప్పందానికి స్వస్తి..ఎడారిగా మారనున్న పాకిస్తాన్
Chess: ఫిడే మహిళల గ్రాండ్ప్రి చెస్ టోర్నీ విజేతగా కోనేరు హంపి
Aghori: చంచల్గూడ జైలుకు అఘోరీ.. ప్రత్యేక బ్యారక్ ఏర్పాటు చేసి!
వర్షిణి ఏడవకు నేనున్నా నీ భర్తను బయటకు తెస్తా.. | Lawyer Comments On Aghori Arrest | RTV