T20 World Cup 2024: డిఫెండింగ్ ఛాంపియన్‌ ఇంగ్లాండ్ తుది జట్టు ఇదే.. జోఫ్రా రీ ఎంట్రీ!

డిఫెండింగ్ ఛాంపియన్‌ ఇంగ్లాండ్ టీ20 ప్రపంచకప్ బరిలో దిగబోయే తుది జట్టును ప్రకటించింది. ఇంగ్లాండ్‌ను జోస్ బట్లర్ ముందుండి నడిపించనున్నాడు. గాయం కారణంగా కొన్ని నెలలు ఆటకు దూరమైన జోఫ్రా అర్చర్ రీ ఎంట్రీ ఇచ్చాడు.

New Update
T20 World Cup 2024: డిఫెండింగ్ ఛాంపియన్‌ ఇంగ్లాండ్ తుది జట్టు ఇదే.. జోఫ్రా రీ ఎంట్రీ!

T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ 2024 జూన్‌ 2 నుంచి మొదలుకానున్న సంగతి తెలిసిందే. కాగా ఈ మెగా టోర్నీ కోసం భారత్ తో పాటు మరిన్ని దేశాలు తమ జట్లను దాదాపు ఖరారు చేశాయి. అయితే తాజాగా పొట్టి కప్ సమరంలోకి దిగబోయే గెలుపు గుర్రాల లిస్ట్ ఇంగ్లాండ్ రిలీజ్ చేసింది.

జోఫ్రా అర్చర్ రీ ఎంట్రీ..
ఈ మేరకు జూన్‌ 2 నుంచి యూఎస్ఏ, వెస్టిండీస్‌ వేదికగా ఈ మెగా టోర్నీ జరగనుండగా.. ఇప్పటికే న్యూజిలాండ్ తమ జట్టును ప్రకటించాయి. అయితే డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగనున్న ఇంగ్లాండ్‌ను జోస్ బట్లర్ ముందుండి నడిపించనున్నాడు. గాయం కారణంగా కొన్ని నెలలుగా ఆటకు దూరమైన ఫాస్ట్ బౌలర్ జోఫ్రా అర్చర్ రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు.

ఇది కూడా చదవండి: Airports: ఇండియాలోని 24 విమానాశ్రయాలకు ఉగ్ర ముప్పు.. ‘టెర్రరైజర్స్ 111’ నుంచి మెయిల్!

ఇంగ్లాండ్: జోస్ బట్లర్ (కెప్టెన్‌), మొయిన్ అలీ, జోఫ్రా అర్చర్, జానీ బెయిర్‌స్టో, హ్యారీ బ్రూక్, సామ్ కరన్, బెన్ డకెట్, టామ్ హార్ట్లీ, విల్ జాక్స్, క్రిస్ జోర్డాన్, లియామ్ లివింగ్‌స్టోన్, అదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, రీస్ టాప్లీ, మార్క్ వుడ్.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

RCB VS RR: హుర్రే..ఓన్ గ్రౌండ్ లో ఆర్సీబీ గెలిచింది..ఆరఆర్ పై విక్టరీ

మొత్తానికి సొంతగడ్డపై బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మ్యాచ్ గెలిచింది. ఐపీఎల్ 18 సీజన్ లో బెంగళూరు చినస్వామి స్టేడియంలో ఆర్సీబీ గెలవడం ఇదే మొదటిసారి. రాజస్థాన్ రాయల్స్ మీద ఆర్సీబీ 11 పరుగులు తేడాతో విజయం సాధించింది. 

New Update
ipl

RCB VS RR

ఐపీఎల్ లో ఈ రోజు ఆర్సీబీ, ఆర్ఆర్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో బెంగళూరు 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 205 పరుగులు చేసి ఆర్ఆర్ కు 206 టార్గెట్ ఇచ్చింది. ఈ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 194 పరుగులే చేసింది.  పరుగుల ఛేదనలో ఆర్ఆర్ తొమ్మిది వికెట్లను కోల్పోయింది. యశస్వీ జైస్వాల్‌ (49), ధ్రువ్‌ జురెల్‌ (47) పోరాడినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. బెంగళూరు జట్టులో హేజిల్ వుడ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 19వ ఓవర్లో కేవలం ఒక పరుగే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. చివరి ఓవర్లో లక్ష్యం 17 పరుగులు కాగా, యశ్‌ దయల్‌ వికెట్‌ తీసి కేవలం 5 పరుగులే ఇచ్చాడు. ఆర్సీబీలో హేజిల్‌ వుడ్‌ 4, కృనాల్‌ పాండ్య 2, భువనేశ్వర్‌ కుమార్‌, యశ్‌ దయాల్‌ ఒక్కో వికెట్‌ తీశారు. 

చిన్నస్వామి స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య రసవత్తరమైన మ్యాచ్ జరుగింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ  20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. 

ఎవరెన్ని కొట్టారంటే?

ఫిల్ సాల్ట్ 23 బంతుల్లో 26 పరుగులు, విరాట్ కోహ్లీ 42 బంతుల్లో 70 పరుగులు, పడిక్కల్ 27 బంతుల్లో 50 పరుగులు, కెప్టెన్ రజత్ పాటిదార్ 3 బంతుల్లో 1 పరుగు చేశాడు. అలాగే మ్యాచ్ ఆఖరి వరకు ఆడిన డేవిడ్ 15 బంతుల్లో 23 పరుగులు, జితేశ్‌ శర్మ 10 బంతుల్లో 20 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 

కోహ్లీ పరుగుల వరద

32 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత కూడా దూకుడుగానే ఆడుతూ రన్స్ రాబట్టాడు. అప్పటికే రెండు సిక్సులు కొట్టి ఫ్యాన్స్‌కు మంచి ఊపు తెప్పించాడు. కానీ మరో షార్ట్ ఆడే క్రమంలో క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో 42 బంతుల్లో 70 పరుగులు చేసి ఔరా అనిపించాడు. అయితే ఈ మ్యాచ్‌లో రెండు సిక్సులు కొట్టిన కోహ్లీ.. మరో సిక్స్ కొట్టుంటే అరుదైన రికార్డు క్రియేట్ చేసి ఉండేవాడు. 

today-latest-news-in-telugu | IPL 2025 | rcb-vs-rr | match

Advertisment
Advertisment
Advertisment