కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలకు అప్లై చేశారా.. ఇంకా ఒక్కరోజే మిగిలివుంది పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు రెవెన్యూ విభాగంలో టైపిస్ట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు అలర్ట్. మొత్తం 12 పోస్టులకుగానూ ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయగా అప్లికేషన్ కు ఇంకా ఒక్కరోజే సయమం మిగిలివుంది. నవంబర్ 30 తుది గడువు. By srinivas 29 Nov 2023 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి AP Govt Recruitment : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల తమ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వివిధ శాఖల్లోని ఖాళీలను భర్తి చేసేందుకు నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ క్రమంలోనే పశ్చిమగోదావరి జిల్లా రెవెన్యూ విభాగంలో (ఏలూరు) మిగిలివున్న టైపిస్ట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులకు కూడా దరఖాస్తులు కోరింది. అయితే ఇందుకోసం నిరుద్యోగ అభ్యర్థులను మరోసారి అలర్ట్ చేసింది. ఈ ఉద్యోగాలకోసం అప్లై చేసుకునేవారికి నవంబరు 30వ తేదీని తుది గడువుగా ప్రకటించారు. దీంతో ఇంకా ఒక్కరోజే సమయం మిగిలివుందని, త్వరగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. Also read :బొచ్చెడుసార్లు మోసపోయా.. లవ్ ఫెయిల్యూర్ పై స్పందించిన శ్రీముఖి ఇక ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. రెవెన్యూ డిపార్ట్ మెంట్, పశ్చిమగోదావరి జిల్లా(ఏలూరు)లో మొత్తం టైపిస్ట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ కు సంబంధించి 12 ఖాళీలున్నాయి. అయితే ఇందుకు కావాల్సిన అర్హతలు.. డిగ్రీలో కంప్యూటర్ సైన్స్ లేదా బీఈ, బీటెక్/ ఎంసీఏ చదివివుండాలి. అలాగే టైపింగ్ శిక్షణ తీసుకున్నట్లు సర్టిఫికెట్ తప్పనిసరి. వయసు 18 - 42 ఏళ్ల మధ్య ఉండాలి. అకాడమిక్ మార్కుల ఆధారంగా ఆన్ లైన్ లోనే ఎంపిక విధానాన్ని చేపడతారు. షార్ట్ లిస్ట్ అయిన వారికి కంప్యూటర్ పరిజ్ఞానం, టైపింగ్ పై పరీక్షలు నిర్వహిస్తారు. ఈ ఉద్యోగాలను ఔట్ సోర్సింగ్ ప్రాతిపాదికన భర్తీ చేయనుండగా జీతం రూ. 18,500 చెల్లిస్తారు. దరఖాస్తులకు చివరి తేదీ 2023 నవంబర్ 30. అధికారిక వెబ్ సైట్ - https://westgodavari.ap.gov.in #eluru #jobs #revenue-department సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి