సీఎం హేమంత్ సోరెన్ కు ఈడీ షాక్... మరోసారి సమన్లు పంపిన దర్యాప్తుసంస్థ....!

జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ కు మరోసారి షాక్ తగిలింది. భూకబ్జాకు సంబంధించిన కేసులో ఆయనకు తాజాగా ఈడీ మరోసారి నోటీసులు పంపింది. ఈ కేసులో అగస్టు 24న విచారణకు హాజరు కావాలని ఈడీ ఆదేశించింది. అంతకు ముందు ఈ నెల 14న విచారణకు హాజరు కావాలని ఈడీ ఆదేశించింది గతంలో అక్రమ మైనింగ్ కేసులో జార్ఖండ్ లోని కార్యాలయంలో ఆయన్ని ఈడీ ప్రశ్నించింది.

author-image
By G Ramu
New Update
Hemanth Soren: ఇక ప్రజా సేవలోనే-హేమంత్ సోరెన్

ED issues summons to Jharkhand CM Hemant Soren: జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ కు మరోసారి షాక్ తగిలింది. భూకబ్జాకు సంబంధించిన కేసులో ఆయనకు తాజాగా ఈడీ మరోసారి నోటీసులు పంపింది. ఈ కేసులో అగస్టు 24న విచారణకు హాజరు కావాలని ఈడీ ఆదేశించింది. అంతకు ముందు ఈ నెల 14న విచారణకు హాజరు కావాలని ఈడీ ఆదేశించింది. కానీ ముందస్తుగా షెడ్యూల్ చేసిన కార్యక్రమాల నేపథ్యంలో తాను విచారణకు హాజరు కాలేనని వెల్లడించారు.

విచారణకు హాజరయ్యేందుకు తనకు మరి కొంత సమయం కావాలని ఈడీని ఆయన కోరారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయనకు మరోసారి ఈడీ సమన్లు పంపింది. గతంలో అక్రమ మైనింగ్ కేసులో జార్ఖండ్ లోని కార్యాలయంలో ఆయన్ని ఈడీ ప్రశ్నించింది. ఈ కేసులో ఆయనతో పాటు ఆయన సతీమణిపై ఈడీ పది గంటల పాటు ప్రశ్నల వర్షం కురిపించింది.

భూకబ్జా కేసుకు సంబంధించి ఇప్పటికే 13 మందిని ఈడీ అదుపులోకి తీసుకుంది. ఇందులో ఓ ఐఏఎస్ అధికారి కూడా ఉండటం గమనార్హం. ఇదే కేసులో గత నెల 8న సీఎం సన్నిహితుడు, ఎమ్మెల్యే పంకజ్ మిశ్రా (MLA Pankaj Mishra) నివాసంలో ఈడీ దాడులు చేసింది. దాడుల్లో సీఎం హేమంత్ సోరెన్ కు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ తో లింక్ ఉన్న చెక్ బుక్ ను ఈడీ స్వాధీనం చేసుకుంది.

చెక్ బుక్ దొరకడంతో ఈ కేసులో సీఎం హేమంత్ సోరెన్ (CM Hemant Soren) పేరును కూడా ఈడీ చేర్చింది. అనంతరం పంకజ్ మిశ్రాను ఈడీ అరెస్టు చేసింది. ఈ కేసులో మరో ఆశ్చర్య కరమైన విషయాన్ని ఈడీ గుర్తించింది. ఈ కేసులో నిందితులు 1932 నాటి పత్రాలను ఉపయోగించి ప్రజల భూములను అన్యాయంగా స్వాధీనం చేసుకున్నారని ఈడీ అబియోగాలు మోపింది. దీనికి సంబంధించి దర్యాప్తు కొనసాగుతోంది.

ఆ భూములను ఇప్పటికే బాధితుల తాతలు తమకు అమ్మి వేశారన్ని బాధితులకు చెప్పారని ఈడీ పేర్కొంది. ఆర్మీకి లీజుకు ఇచ్చిన భూములను అలా తప్పుడు పత్రాలు సృష్టించి మోసపూరితంగా వాటిని స్వాధీనం చేసుకున్నారని పేర్కొంది. అనంతరం వాటిని వేరే వ్యక్తులకు విక్రయించారని తెలిపింది. వాటికి సంబంధించి భారీగా నకిలీ ధ్రువపత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు ఈడీ చెప్పింది.

Also Read: లడఖ్‎లో రాహుల్…బైక్ మీద రయ్ రయ్ మంటూ చక్కర్లు..!!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Ind-Pak: భారత్-పాక్ యుద్ధమే జరిగితే గెలుపెవరిది? ఎవరి బలం ఎంతుంది?

కాశ్మీర్ ఉగ్రదాడి భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలకు దారి తీసింది.అపార నష్టంతో కుమిలిపోతున్న మనం రగిలిపోతుంటే..పాకిస్తాన్ మాత్రం పొగరుతో కాలు దువ్వుతోంది. యుద్ధం తప్పదనే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకవేళ అదే కనుక జరిగితే గెలుపెవరిది?ఎవరి బలం ఎంతుంది?

New Update
Indian Army

Indian Army

ప్రస్తుతం భారత్, పాకిస్తాన్ లలో పరిస్థితి మారిపోయింది. ఒక్క ఉగ్రదాడితో రెండు దేశాలు అల్లకల్లోలం అయిపోయాయి. యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. 26మందిని పోగొట్టుకుని భారత ప్రజలు రగిలిపోతున్నారు. ప్రభుత్వం కూడా దీనిని సీరియస్ గా తీసుకుంది. పాకిస్తాన్ మీద కస్సుబుస్సుమంటోంది. ఆ దేశాన్ని అన్ని విధాలా దిగ్భంధనం చేస్తూ ఐదు కఠిన నిర్ణయాలను తీసుకుంది. పోనీ అటు నుంచి పాకిస్తాన్ ఏమైనా తగ్గిందా అంటే..అదీ లేదు. ఆ దేశం కూడా యద్ధానికి సిద్ధం అంటూ కయ్యానికి కాలు దువ్వుతోంది. అసలు ఇదంతా జరగడానికి తామే కారణం అయినా కూడా ఆ విషయాన్ని ఒప్పుకోకుండా పొగరుగా మాట్లాడుతోంది. ఇండియా ఒక్కటేనా నిర్ణయాలు తీసుకోగలదు అంటూ వాళ్ళు కూడా సేమ్ టూ సేమ్ కాపీ కొట్టేశారు. దీంతో యుద్ధం తప్పదనే సూచనలు చాలా గట్టిగానే కనిపిస్తున్నాయి. దీని కోసం రెండు దేశాలూ సిద్ధమైపోతున్నాయి కూడా. భారత ఆర్మీ ఛీప్ రేపు కాశ్మీర్ కూడా వెళుతున్నారు. అక్కడ బలగాలు పర్యవేక్షించడంతో పాటూ ఇతర ఏర్పాట్లను కూడా చూడనున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో యుద్ధమే కనుక జరిగితే ఏ దేశం గెలుస్తుంది...ఎవరి బలం ఎంత అనే చర్చలు జరుగుతున్నాయి. 

భారత్, పాక్ సైనిక బలాలు ఇవే..

ఇండియా, పాకిస్తాన్ ల మధ్య ఇదే మొదటిసారి కాదు. ఇలా దాడులు జరగడం...రెండు దేశాలు యుద్ధానికి రెడీ అవడం చాలాసార్లే జరిగింది. పాక్ చేసిన పనులకు భారత్ అన్ని సార్లూ గట్టిగానే జవాబు చెప్పింది. ఎప్పుడూ విజయం కూడా మనవైపే ఉంటుంది కూడా. అయితే ఈ సారి యుద్ధం జరిగితే పరిస్థితులు ఎలా ఉంటాయి. ఎవరికి గెలిచే ఛాన్స్ ఉందంటే..కచ్చితంగా భారత్ కే అని చెప్పాలి. ఎందుకంటే అన్ని రకాలుగా పాకిస్తాన్ కంటే భారత్ బలంగా ఉంది. 

భారత ఆర్మీ సైనికులు...పాక్ ఆర్మీ సైనికుల కంటే దాదాపు రెండింతలు ఉన్నారు.  భారత సైనికులు 14, 55, 550 మంది ఉంటే పాక్ సైనికులు 6, 54,00 మంది ఉన్నారు.  ఇండియా దగ్గర ఆరు వైమానిక ట్యాంకర్లు ఉంటే పాక్ దగ్గర నాలుగు ఉన్నాయి. ఇక అణు జలాంతర్గాముల విషయానికి వస్తే భారత్ దగ్గర 2893 ఉన్నాయి. పాక్ దగ్గర 121 మాత్రమే ఉన్నాయి. గగనతలం సంగతి చూస్తే..ఇండియా దగ్గర 2,229 ఎయిర్ క్రాఫ్ట్స్, 513 ఫైటర్ జెట్స్ ఉన్నాయి. అదే పాకిస్తాన్ దగ్గర 1, 399 ఎయిర్ క్రాఫ్ట్స్, 328 ఫైటర్ జెట్స్ ఉన్నాయి. వీటన్నిటితో పాటూ భారత్ దగ్గర 1.15 మిలియన్ రిజర్వ్, 25 లక్షల పారా మిలటరీ బలగాలు అదనంగా ఉన్నాయి. 

ఆర్థిక బలం..

ఇవన్నీ ఒక ఎత్తైతే ఆర్థికంగా పాకిస్తాన్ కంటే భారత్ చాలా ఉన్నతంగా ఉంది. ఇప్పటికప్పుడు యుద్ధం వచ్చినా దాన్ని ఇండియా తట్టుకోగలదు. దానికి కావాల్సిన ఏర్పాట్లను వెంటనే చేయగలదు. ప్రపంచ దేశాలు కూడా భారత్ కు సహాయం చేయడానికి ముందుకు వస్తాయి. ముఖ్యంగా పెద్దన్న అమెరికా అందరి కంటే ఈ విషయంలో ముందుంటుంది. కానీ మరి పాకిస్తాన్ సంగతేంటి. ఆ దేశం చాలా రోజులుగా ఆర్థికంగా ఇబ్బంది పడుతోంది. తినడానికి తిండి కూడా లేకుండా బాధలు పడుతోంది. ఇలాంటి సమయంలో ఆ దేశం ఫుల్ ఎఫెర్ట్ పెట్టి యుద్ధం చేయగలదా...ఒకవేళ చేసినా...యుద్ధం ముగిశాక వచ్చే పరిసనామాలను తట్టుకోగలదా అనే చాలా పెద్ద ప్రశ్నే. పైగా ప్రపంచ దేశాలు పాకిస్తాన్ కు ఏ విధంగానూ సహాయం చేయవు. ఆఖరుకి కాశ్మీర్ ఉగ్రదాడి తర్వాత తాలిబాన్లు కూడా భారత్ కు సపోర్టు చేశారు. పాక్ చేసింది తప్పు అంటూ మాట్లాడారు. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ యుద్ధం అంటూ ఎగదోయడం సరైన విషయం కాదు. దీన్ని ఆ దేశం ఎంత త్వరగా తెలుసుకుంటే...దానికి అంత మంచిది. 

 today-latest-news-in-telugu | india | pakistan | war | army

Advertisment
Advertisment
Advertisment