AP DGP: ఏపీకి కొత్త డీజీపీని నియమించిన ఈసీ.. ఎవరంటే?

ఏపీ డీజీపీ రవీంద్రనాథ్ రెడ్డిపై నిన్న బదిలీ వేటు వేసీన ఈసీ.. ఈ రోజు ఆయన స్థానంలో హరీష్ కుమార్ గుప్తాను నియమించింది. ఈ రోజు సాయంత్రం 5 గంటలలోగా విధుల్లో చేరాలని ఆయనను ఆదేశించింది ఈసీ.

New Update
AP DGP: ఏపీకి కొత్త డీజీపీని నియమించిన ఈసీ.. ఎవరంటే?

Harish Kumar Gupta As A New DGP For AP: ఏపీ కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తాను నియమించింది ఈసీ. సాయంత్రం 5 గంటల లోపు బాధ్యతలు చేపట్టాలని ఆదేశించింది. ఏపీ డీజీపీ రవీంద్రనాథ్ రెడ్డిపై ఈసీ నిన్న బదిలీ వేటు వేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు కొత్త డీజీపీని నియమించింది ఈసీ. ప్రస్తుతం హోం శాఖ కార్యదర్శిగా గుప్తా ఉన్నారు. కొత్త డీజీపీ నియామకం కోసం సీనియార్టీ జాబితాను పంపించమని ఈసీ ఆదేశించగా.. సీఎస్.. ద్వారకా తిరుమల రావు, మాదిరెడ్డి ప్రతాప్, హరీశ్ కుమార్ గుప్తా పేర్లను పంపించారు. ఇందులో హరీశ్ గుప్తా పేరును ఈసీ ఎంపిక చేసింది.

ఏపీలో అధికారులపై వరుసగా బదిలీ వేటు పడడం కలకలం రేపుతోంది. ఎన్నికలు ముగిసే వరకు మరికొంత మంది అధికారులపై కూడా వేటు పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిని ఈసీ బాధ్యతల నుంచి తప్పించే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

Harish Kumar Gupta As A New DGP For AP

ప్రతిపక్షాలు ఇప్పటికే ఆయనపై అనేక ఫిర్యాదులు చేసిన నేపథ్యంలో ఈసీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంటుందన్న చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే.. నిన్న డీజీపీపై వేటు వేసిన ఈసీ.. ఈ రోజు అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిని బదిలీ చేసింది. ఎన్నికలు ముగిసే వరకు ఆయనకు ఎలాంటి బాధ్యతలు ఇవ్వొద్దని ఆదేశాలు జారీ చేసింది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Aghori: మహిళా నిర్మాతకు యో*ని పూజ.. రూ.10 లక్షలు దొబ్బేసిన అఘోరీ!

లేడీ అఘోరీ మరోమోసం బయటపడింది. యోని పూజ పేరుతో రూ.10లక్షలు దోచేసినట్లు ఓ మహిళా నిర్మాత మొకిలా పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో అఘోరీపై 308(5), 318(1),351(4),352 BNS సెక్షన్లకింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

New Update

 Aghori: లేడీ అఘోరీ అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. పూజల పేరిట భారీ మోసాలకు పాల్పడ్డట్లు  సైబరాబాద్‌ మొకిలా పీఎస్‌లో కేసు నమోదైంది. యోని పూజ చేస్తానంటూ రూ.10 లక్షలు తీసుకుని మోసం చేసిందంటూ మహిళా నిర్మాత ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఉజ్జయినిలోని ఫాంహౌస్‌కి తీసుకెళ్లి పూజ చేసినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. రెండు విడతలుగా అఘోరీకి రూ. 10 లక్షలు ఇచ్చినట్లు తెలిపింది. దీంతో ఫిబ్రవరి 25న అఘోరీపై 308(5), 318(1),351(4),352 BNS సెక్షన్లకింద ఎఫ్ఐఆర్ నమోదైంది. 

Also Read: పిల్లలు థియేటర్ వైపు రావొద్దు.. హిట్-3 సెన్సార్ షాకింగ్ రిపోర్ట్

ప్రగతి రిసార్ట్స్ కు వెళ్లి..

పోలుసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లాకు చెందిన ప్రొడ్యూసర్ లేడీ అఘోరీతో 6 నెలల క్రితం పరిచయం అయినట్లు చెప్పింది. దీంతో ప్రొద్దటూర్ లోని ప్రగతి రిసార్ట్స్ కు అఘోరిని డిన్నర్ కు పిలవగా వచ్చినట్లు తెలిపింది. అప్పటి నుంచి ఫోన్ చేస్తూ తన వ్యక్తిగత విషయాలు తెలుసుకుంది. ఒక పూజ చేస్తే అంతా మంచి జరుగుతుందని నమ్మించింది. అది కూడా ప్రైవేట్ పార్ట్ యోని  పూజ అని చెప్పడంతో నిర్మాత పూజకు అంగీకరించింది. 

Also Read: మేటర్ పెద్దదే..! ఇంట్లో వాళ్ళతో మాత్రం అస్సలు చూడకండి..

ఈ క్రమంలోనే పూజ సామాగ్రి కోసం మొదట రూ. 5 లక్షలు అఘోరీ అకౌంట్ లో వేసింది. మొదటిసారి యూపీలోని ఉజ్జయిని ఫాం హౌస్ తీసుకెళ్లి పూజ చేసింది. ఆ తర్వాత మరో రూ.5 లక్షలు ఇవ్వాలని అడిగింది. లేదంటే పూజ విఫలమై ఫ్యామిలీ మొత్తం నాశనం అవుతుందని భయపెట్టింది. భయంతోనే మరో 5 లక్షలు అకౌంట్ లో వేసింది. మొత్తం రూ.10 లక్షలు పంపించినట్లు ఫిర్యాదులో మహిళా నిర్మాత పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. 

 cheating | producer | telugu-news | today telugu news

Advertisment
Advertisment
Advertisment